GHMC Workers: పర్మినెంట్ చేస్తానని మోసం చేసిండు.. వెంటనే సీఎంపై కేసు పెట్టండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అధికారంలోకి వచ్చిన వెంటనే జీహెచ్ఎంసీ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేస్తానని సీఎం కేసీఆర్ మోసం చేశారని ఆయనపై కేసు పెట్టాలని కోరుతూ వందలాదిమంది కాప్రా సర్కిల్ కార్మికులు కుషాయిగూడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తమ ఉద్యోగాలు పర్మినెంట్ చేయాలని కోరుతూ జీహెచ్ఎంసీ కాప్రా సర్కిల్ కార్మికులు చేస్తున్న సమ్మెలో భాగంగా నేడు (మంగళవారం) నాలుగో రోజు ఈ వినూత్న నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా కాప్రా సర్కిల్ కార్యాలయం నుంచి ఈసీఐఎల్ చౌరస్తాలోని కుషాయిగూడ పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ తీశారు.
Read Also: Pilot: అంత కోపం ఏందయ్యా నీకు…బారియర్ గేట్ తెరుచుకోలేదని గొడ్డలితో విరగొట్టిన పైలెట్
Also Read
- Ginger Kadak Chai Recipe: ఘాటైన అల్లం టీ రహస్యం.. ఈ చిట్కాలతో ఇంట్లోనే కడక్ చాయ్
- Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!
- Tirupati Double Murder: తిరుపతిలో జంట హత్యల కలకలం.. పెళ్లి వేడుకలో కత్తులతో దాడి..
- Ind vs Eng Playing XI: తప్పక గెలవాల్సిందే.! నేడు భారత్, ఇంగ్లాండ్ నాల్గవ టీ20.. ప్లేయింగ్ XI ఇదే..
కుషాయిగూడ సర్కిల్ ఇన్ స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ కు ఫిర్యాదు చేసిన అనంతరం తిరిగి కాప్రా సర్కిల్ కార్యాలయానికి ప్రదర్శనగా జీహెచ్ఎంసీ కార్మికులు తరలి వెళ్లారు. 2014 ఎన్నికల సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జీహెచ్ఎంసీలో 25 వేల మంది అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేస్తున్న తమను పర్మినెంట్ చేస్తామని హామీ ఇచ్చారని వారు అన్నారు. హైదరాబాద్ ను విశ్వ నగరంగా తీర్చిదిద్దుతున్నామని.. కార్మికులు కష్టపడి పనిచేసి నగరానికి మంచి పేరు తేవాలని తమను కోరారని జీహెచ్ఎంసీ వర్కర్స్ తెలిపారు.
Read Also: Viral Video : వార్నీ..ఇది ఫోటో షూటా.. కుస్తీ పోటీనా..
కేసీఆర్ పిలుపు మేరకు ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో సైతం పెద్ద ఎత్తున పాల్గొని ఆందోళన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ప్రత్యేక తెలంగాణ సాధించిన తర్వాత ప్రతి రోజు కష్టపడి పనిచేసి నగరంలో రోడ్లన్నీ శుభ్రం చేస్తున్నామని జీహెచ్ఎంసీ కార్మికులు వివరించారు. అయినప్పటికీ ఇప్పటి వరకు కనీస వేతన చట్టం ప్రకారం మా వేతనాలు పెంచలేదు.. సరి కదా మమ్మల్ని పర్మినెంట్ చేస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదన్నారు. దీంతో మా బతుకులు దుర్భరంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీ మేరకు మమ్మల్ని పర్మినెంట్ చేయని ముఖ్యమంత్రి కేసీఆర్ పై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో జీహెచ్ఎంసీ కార్మికులు కోరారు.
తాజావార్తలు
-
Peddi OTT : ఓటీటీలో ఎంట్రీ ఇచ్చిన పెద్ది.. ఎక్కడ చూడాలంటే
-
Biopics : ఆ ఇద్దరి లెజెండరీ బయోపిక్స్ను పక్కనపెట్టిన కోలీవుడ్ స్టార్ హీరో?
-
Ginger Kadak Chai Recipe: ఘాటైన అల్లం టీ రహస్యం.. ఈ చిట్కాలతో ఇంట్లోనే కడక్ చాయ్
-
Wamiqa Gabbi: సుమో రెజ్లర్ను బురిడీ కొట్టించి గెలిచిన వామికా గబ్బి.. వైరల్ అవుతున్న జపాన్ వీడియో!
-
Yamaha Aerox-e: భారత మార్కెట్లో యమహా ఏరోక్స్-ఇ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్.. ధర, రేంజ్, ఫీచర్లు ఇవే
ట్రెండింగ్
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!
-
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్తో రానున్న Vivo T5 Lite 5G.!
-
బడ్జెట్లో ప్రీమియం అనుభవం.. 50MP Sony కెమెరా, 7000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Moto g77 Power భారత్లో లాంచ్.!
-
Pandu Mirapakaya Pachadi: ఏడాది పాటు నిల్వ ఉండే టేస్టీ ‘పండు మిరపకాయ పచ్చడి’.. ఈ కొలతలు ఫాలో అయితే చాలు!
-
6,500mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో ఎంట్రీకి సిద్దమైన iQOO Z11 Lite.!