GHMC Workers: పర్మినెంట్ చేస్తానని మోసం చేసిండు.. వెంటనే సీఎంపై కేసు పెట్టండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అధికారంలోకి వచ్చిన వెంటనే జీహెచ్ఎంసీ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేస్తానని సీఎం కేసీఆర్ మోసం చేశారని ఆయనపై కేసు పెట్టాలని కోరుతూ వందలాదిమంది కాప్రా సర్కిల్ కార్మికులు కుషాయిగూడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తమ ఉద్యోగాలు పర్మినెంట్ చేయాలని కోరుతూ జీహెచ్ఎంసీ కాప్రా సర్కిల్ కార్మికులు చేస్తున్న సమ్మెలో భాగంగా నేడు (మంగళవారం) నాలుగో రోజు ఈ వినూత్న నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా కాప్రా సర్కిల్ కార్యాలయం నుంచి ఈసీఐఎల్ చౌరస్తాలోని కుషాయిగూడ పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ తీశారు.
Read Also: Pilot: అంత కోపం ఏందయ్యా నీకు…బారియర్ గేట్ తెరుచుకోలేదని గొడ్డలితో విరగొట్టిన పైలెట్
Also Read
- Maharashtra: టీమ్లో సెలెక్ట్ చేయలేదని క్రికెటర్ ఆత్మహత్య.. సూసైడ్ నోట్లో ఏముందంటే?
- Newton's Third Law: ‘న్యూటన్స్ థర్డ్ లా’ మూవీ రివ్యూ..
- Formula E Case: ఫార్ములా-ఈ రేస్ కేసులో నేడు కీలక విచారణ.. ఏసీబీ కోర్టుకు కేటీఆర్?
- TTD Employees: టీటీడీలో భారీగా ఉద్యోగుల పదవీ విరమణ.. కీలక విభాగాల్లో సిబ్బంది కొరత!
కుషాయిగూడ సర్కిల్ ఇన్ స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ కు ఫిర్యాదు చేసిన అనంతరం తిరిగి కాప్రా సర్కిల్ కార్యాలయానికి ప్రదర్శనగా జీహెచ్ఎంసీ కార్మికులు తరలి వెళ్లారు. 2014 ఎన్నికల సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జీహెచ్ఎంసీలో 25 వేల మంది అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేస్తున్న తమను పర్మినెంట్ చేస్తామని హామీ ఇచ్చారని వారు అన్నారు. హైదరాబాద్ ను విశ్వ నగరంగా తీర్చిదిద్దుతున్నామని.. కార్మికులు కష్టపడి పనిచేసి నగరానికి మంచి పేరు తేవాలని తమను కోరారని జీహెచ్ఎంసీ వర్కర్స్ తెలిపారు.
Read Also: Viral Video : వార్నీ..ఇది ఫోటో షూటా.. కుస్తీ పోటీనా..
కేసీఆర్ పిలుపు మేరకు ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో సైతం పెద్ద ఎత్తున పాల్గొని ఆందోళన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ప్రత్యేక తెలంగాణ సాధించిన తర్వాత ప్రతి రోజు కష్టపడి పనిచేసి నగరంలో రోడ్లన్నీ శుభ్రం చేస్తున్నామని జీహెచ్ఎంసీ కార్మికులు వివరించారు. అయినప్పటికీ ఇప్పటి వరకు కనీస వేతన చట్టం ప్రకారం మా వేతనాలు పెంచలేదు.. సరి కదా మమ్మల్ని పర్మినెంట్ చేస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదన్నారు. దీంతో మా బతుకులు దుర్భరంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీ మేరకు మమ్మల్ని పర్మినెంట్ చేయని ముఖ్యమంత్రి కేసీఆర్ పై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో జీహెచ్ఎంసీ కార్మికులు కోరారు.
తాజావార్తలు
-
Trump: అమెరికాలో చదివే భారతీయ విద్యార్థులకు భారీ షాక్?.. ట్రంప్ సర్కార్ పరిశీలనలో $100,000 OPT ఫీజు
-
World Cup 2027: వరల్డ్ కప్లో అతడు ఉండాల్సిందే.. లేదంటే టీమిండియాకు కప్పు కష్టమే!
-
PM Modi Viral Video Row: ప్రధాని మోడీపై అభ్యంతరకర వ్యాఖ్యలు.. యువతిపై కేసు నమోదు
-
Dulquer Salman : ఏకంగా ముగ్గురు ఫ్లాప్ హీరోయిన్స్కు నేనున్నానంటున్న దుల్కర్ సల్మాన్..
-
Maharashtra: టీమ్లో సెలెక్ట్ చేయలేదని క్రికెటర్ ఆత్మహత్య.. సూసైడ్ నోట్లో ఏముందంటే?
ట్రెండింగ్
-
Ajinkya Rahane Unbeaten Record: భారత క్రికెట్లో అన్బీటెన్ రికార్డు.. జయహో జింక్స్.. దిగ్గజ కెప్టెన్లకు కూడా సాధ్యం కాలేదు!
-
8,500mAh బ్యాటరీ, Kirin 8020 చిప్తో ఎంట్రీ ఇస్తున్న Huawei Nova 16 SE.!
-
కేవలం 6.5 మిమీ మందం, 12.2 అంగుళాల 2.8K OLED డిస్ప్లే, Dimensity 8300 చిప్తో ASUS Pad (T3201) భారత్లో లాంచ్..!
-
Alien Temple: ఏలియన్కు ఆలయం.. ఎక్కడ ఉంది.? ఆలయ విశేషాలేంటంటే..!
-
Google Pixel 11 సిరీస్లో కొత్త ట్విస్ట్.. లాంచ్కు కీలక ఫీచర్స్ లీక్..!