BRS: ఎన్నికల్లో గెలిచేందుకు వాళ్లు దొంగ దారులు వెతుక్కుంటున్నారు
బీఆర్కే భవన్ లో సీఈఓ వికాస్ రాజ్ తో బీఆర్ఎస్ నేతలు సమావేశం అయ్యారు. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ లీగల్ సెల్ నేతలు సోమభరత్, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు, పలువురు అడ్వకేట్స్ ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ లీగల్ సెల్, జనరల్ సెక్రటరీ సోమ భరత్ మాట్లాడుతూ.. ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీ నేతలు దొంగ దారులు వెతుక్కుంటున్నారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై ఫిర్యాదు చేశామని ఆయన పేర్కొన్నారు. ఈవీఎంలో ఏ గుర్తుకి ఓటు వేసిన గెలిచేది నేను అని అరవింద్ వ్యాఖ్యలు చేశారు.. ఏ బటన్ నొక్కిన బీజేపీకే పడుతుందని మనసులో మాట బయటపెట్టారు అని ఆయన ఆరోపించారు.
Read Also: Chess World Cup 2023: ప్రపంచ చెస్ విజేత కార్ల్ సన్.. ఫైనల్లో ప్రజ్ఞానంద ఓటమి
Also Read
- Playoff Venues: ఐపీఎల్ ప్లే ఆఫ్ వేదికలపై కీలక అప్డేట్.. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్కు చరమగీతం..?
- MI Vs CSK: నిప్పులు చెరిగిన చెన్నై బౌలర్లు.. పెవిలియన్కు క్యూ కట్టిన ముంబై బ్యాటర్స్.. టార్గెట్ ఎంతంటే..
- Vaibhav Sooryavanshi: బిగ్ షాక్.. వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్ నుంచి తొలగించాలంటూ డిమాండ్స్..
- KKR Vs SRH: సన్ రైజర్స్ హైదరాబాద్ ఆరో విజయానికి బ్రేక్..? కేకేఆర్లోకి స్టార్ ప్లేయర్ ఎంట్రీ..
బీజేపీ అప్రజాస్వామీకంపై మాట్లాడితే సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు అని బీఆర్ఎస్ లీగల్ సెల్ జనరల్ సెక్రటరీ సోమ భరత్ అన్నారు. ప్రజాస్వామ్య వాదులందర్నీ అనిచివేయాలని బీజేపీ వాళ్లు చూస్తున్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు నిర్వహించాలని సీఈవోను కోరాం.. ఎంపీ అరవింద్ పై చర్యలు తీసుకోవాలని కోరాం.. బీజేపీ నాయకులపై న్యాయబద్ధంగా చర్యలు తీసుకోకపోతే ప్రజల్లో ఎన్నికల వ్యవస్థపై తప్పుడు భావన ఉంటుంది అని ఆయన వెల్లడించారు. ఎంపీ కామెంట్స్ ను పరిశీలించి చర్యలు తీసుకుంటామని ప్రధాన ఎన్నికల అధికారి హామీ ఇచ్చారు.
Read Also: Anand Mahindra: చంద్రయాన్ ప్రయోగంపై బీబీసీ విమర్శ.. ఘాటైన సమాధానం ఇచ్చిన ఆనంద్ మహీంద్రా
ఇక, హఫీస్ లాయక్ ఖాన్, ప్రెసిడెంట్ జమియట్ ఉల్లమా ఈ హింద్ నిజామాబాద్ మాట్లాడుతూ.. ఏ గుర్తుకు ఓటు వేసిన అది బీజేపీకే పడుతుందని ఎంపీ ధర్మపురి అరవింద్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసామన్నారు. ఎన్నికల్లో మేము ఏ గుర్తుకు ఓటు వేసిన అది పువ్వు గుర్తుకే పడుతుందని మేము భయపడుతున్నామని ఆయన అన్నారు. ఎన్నికల సంఘంపై మాకు నమ్మకం ఉంది.. ఈ అంశంపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరామని లాయక్ ఖాన్ అన్నారు.
తాజావార్తలు
-
Playoff Venues: ఐపీఎల్ ప్లే ఆఫ్ వేదికలపై కీలక అప్డేట్.. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్కు చరమగీతం..?
-
Texas Shooting: అమెరికాలో కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి!
-
NTV Exclusive: సమంత ‘మా ఇంటి బంగారం’ సైలెన్స్ ఎందుకు?
-
MI Vs CSK: నిప్పులు చెరిగిన చెన్నై బౌలర్లు.. పెవిలియన్కు క్యూ కట్టిన ముంబై బ్యాటర్స్.. టార్గెట్ ఎంతంటే..
-
Vaibhav Sooryavanshi: బిగ్ షాక్.. వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్ నుంచి తొలగించాలంటూ డిమాండ్స్..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!