Margani Bharath: ప్రభుత్వం చేసే తప్పులు గురించి మాట్లాడకూడదా..?
- వైసీపీ సోషల్ మీడియాపై కేసులు పెట్టడాన్ని ఖండించిన మార్గాని భరత్
- ప్రభుత్వం చేసే తప్పులు గురించి మాట్లాడకూడదా అంటూ ప్రశ్నలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Margani Bharath: వైసీపీ సోషల్ మీడియాపై కేసులు పెట్టడాన్ని మాజీ ఎంపీ మార్గాని భరత్ ఖండించారు. టీడీపీ- జనసేన చేసిన సోషల్ మీడియా పబ్లిసిటీలో వైసీపీ ది 10 శాతం కూడా లేదన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ప్రజల వాక్ స్వాతంత్రపు హక్కును హరిస్తోందని విమర్శించారు. ప్రభుత్వం చేసే తప్పులు గురించి మాట్లాడకూడదా.. ఇదేమన్నా ఎమర్జెన్సీ పాలనా అంటూ ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ఉన్నామా, డిక్టేటర్ షిప్లో ఉన్నామా అంటూ మండిపడ్డారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాలరాస్తున్నారని విమర్శలు గుప్పించారు. రెడ్ బుక్కు పట్టుకుని గతం లోకేష్ ఎన్నో అవాకులు చవాకులు మాట్లాడలేదా అంటూ వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ తాట తీస్తాను అనలేదా అంటూ అడిగారు. వైయస్ జగన్ సైకో జగన్ అంటూ ఎన్నోసార్లు మాట్లాడారు.. మీపై ఏ కేసులు పెట్టాలని ప్రశ్నలు గుప్పించారు. టీడీపీ అఫీషియల్ పేజెస్లో గత ప్రభుత్వంపై అబద్ధపు రాతలు రాశారన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు జరిపి దారుణంగా ఇసుకను దోచేస్తున్నారని ఆరోపించారు.
Read Also: Minister Satya Kumar Yadav: బడ్జెట్లో వైద్యారోగ్య శాఖకు కేటాయింపులపై మంత్రి సత్యకుమార్ యాదవ్ హర్షం
Also Read
- Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
- IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
- Supreme Court: సెప్టెంబర్ 5న ఢిల్లీలో సీజేపీ నిరసన మార్చ్.. అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
- Vijayawada to Amaravati: విజయవాడ నుంచి అమరావతికి రాజబాట.. రూ.1000 కోట్లతో మరో బ్రిడ్జి..
మూలగొయ్యిలో యువకుడిపై దాడి చేశారని.. ప్రత్యక్షంగా వీడియోలు కూడా ఉన్నాయని… అయినా పోలీసుల వద్ద నుండి స్పందన లేదన్నారు. మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా… నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ పాలనలో ఉన్నట్టుందని అన్నారు. కచ్చితంగా ప్రజల పక్షాన నిలబడతామన్నారు. ప్రజల వాయిస్ వినిపిస్తామన్నారు. మొత్తం డైవర్షన్ పాలిటిక్స్ అనుసరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాపై దాడులు చేయటం… ప్రజాస్వామ్యానికి విఘాతమన్నారు. సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్టులు చేయటం … ఏ కోర్టులో ఎక్ హాజరు పరుస్తున్నారో కూడా తెలియటం లేదని మాజీ ఎంపీ మార్గాని భరత్ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Allu Arjun : రాకా హైప్ ఓకే.. కంటెంట్ ఆ రేంజ్ లో లేక పోతే?
-
CM Revanth Reddy : హైదరాబాద్కు కొత్త రూపు.. మూడు కార్పొరేషన్ల లోగోలు
-
Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
-
IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
-
Kavitha : నిజామాబాద్ సభలో కవిత కన్నీళ్లు.. ఆ మాటలేంటి.?
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!