Nepal Floods: నేపాల్లో ప్రకృతి విధ్వంసం.. ముంచెత్తిన వరదలు, ఐదుగురు మృతి
Nepal Floods: నేపాల్లో ప్రకృతి విధ్వంసం సృష్టిస్తోంది. నేపాల్ తూర్పు ప్రాంతాల్లో వరుణుడు తన ప్రతాపాన్ని కొనసాగిస్తున్నాడు. భారీ వర్షాల కారణంగా సంభవించిన విపత్తులో పలువురు మరణించగా, డజన్ల కొద్దీ తప్పిపోయినట్లు సమాచారం. తూర్పు నేపాల్లో కొండచరియలు విరిగిపడటంతో ఇప్పటి వరకు ఐదుగురు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. అదే సమయంలో ఇప్పటి వరకు 28 మంది గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Also Read: Wife Killed Husband: పార్టీలో గొడవైంది.. భర్తను చంపి ప్రియుడితో చెక్కేసింది
Also Read
- Chhattisgarh: ఛత్తీస్గఢ్లో మందుపాతర పేలుడు..ముగ్గురు జవాన్లు మృతి..
- Gas Effect: ఇడ్లీ రూ.75, దోశ రూ.80, ఫుల్ మీల్స్ రూ.200.. ‘ఏంది సార్ ఇది.. మేం తినలేం ఇక’
- Bengal Elections 2026: తృణమూల్ గుండాల అరాచకం.. రీపోలింగ్లో హింస..
- Preity Zinta: పంజాబ్ తొలి ఓటమిపై.. రెండు రోజుల తర్వాత స్పందించిన ప్రీతి జింటా.. ఏమన్నారంటే..
ఆదివారం ఒకరు మృతి చెందారు. అంతకుముందు ఆదివారం కూడా నేపాల్లో ఒకరు మరణించారు. అదే సమయంలో, వరదలు, కొండచరియలు విరిగిపడటంతో కనీసం 25 మంది అదృశ్యమయ్యారు. సమాచారం ప్రకారం శంఖువసభ జిల్లా ఎక్కువగా ప్రభావితమైంది. ఈ జిల్లాలో ఆదివారం 16 మంది గల్లంతయ్యారు. శనివారం సాయంత్రం నుంచి హేవాఖోలాలో వరదల కారణంగా సూపర్ హెవాఖోలా జలవిద్యుత్ కార్మికులు 16 మంది అదృశ్యమయ్యారని జిల్లా ఎస్పీ బీరేందర్ గోదర్ తెలిపారు. వరదలో ఏడు ఇళ్లు కొట్టుకుపోయాయని తెలిపారు.
Also Read: The Kerala Story : సంచలనం సృష్టించిన ఈ సినిమా ఓటీటీ విడుదల ఎప్పుడో తెలుసా…?
ఆదివారం కూలీ మృతదేహం లభ్యమైందని, అతని వివరాల కోసం ప్రయత్నిస్తున్నామని జిల్లా పోలీసులు తెలిపారు. పంచతార్లో వరదల కారణంగా దాదాపు ఐదుగురు తప్పిపోయారు. అయితే జిల్లాలోని వివిధ ప్రాంతాలకు రహదారి కనెక్టివిటీ మూసివేయబడింది. తాప్లేజంగ్లో కొండచరియలు విరిగిపడటంతో నలుగురు గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని ప్రధాని పుష్ప కమల్ దహల్ అధికారులను ఆదేశించారు. సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ను వేగవంతం చేయాలని ఆదివారం ఉదయం అధికారులను ఆదేశించారు. అదే సమయంలో ఈ ఘటనలపై విచారం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Aishwarya Lekshmi: దళపతి విజయ్ అంటే చాలా ఇష్టం.. కానీ ఓటు వేసే ఛాన్స్ లేదు!
-
Chhattisgarh: ఛత్తీస్గఢ్లో మందుపాతర పేలుడు..ముగ్గురు జవాన్లు మృతి..
-
Bengal Election Results: దీదీ కోటలో కమలం వికసిస్తుందా? ఎగ్జిట్ పోల్స్లో హోరాహోరీ పోరు!
-
Gas Effect: ఇడ్లీ రూ.75, దోశ రూ.80, ఫుల్ మీల్స్ రూ.200.. ‘ఏంది సార్ ఇది.. మేం తినలేం ఇక’
-
Bengal Elections 2026: తృణమూల్ గుండాల అరాచకం.. రీపోలింగ్లో హింస..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!