Home
Nepal Floods
Nepal Floods News
-
Nepal Floods: నేపాల్లో వందలాది మృతదేహాలను ఎందుకు పూడ్చిపెడుతున్నారు..? అసలు కారణం ఇదే
Nepal Floods: నేపాల్లో సంభవించిన భారీ వరదలు, కొండచరియలు, హిమానీనద విరిగిపడటంతో తీవ్ర విషాదం నెలకొంది. భోటే కోషి, త్రిశూలి నదుల్లోకి నీరు, బురద, రాళ్లు, భారీ శిథిలాలు ఒక్కసారిగా ప్రవహించడంతో అనేక ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వేలాది మంది గల్లంతుకాగా, నీరు తగ్గిన తర్వాత బురద, శిథిలాల కింద నుంచి వందలాది మృతదేహాలు వెలికితీస్తున్నారు. ఆ మృతదేహాల్లో చాలా వరకు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయి. నీటిలో, బురదలో ఎక్కువసేపు ఉండటంతో శరీరాలు ఉబ్బిపోయి వేగంగా కుళ్లిపోతున్నాయి.… -
GLOF Risk in India: నేపాల్ వరదల తర్వాత భారత్కు భారీ ముప్పు.. హిమాలయాల్లో 200 ‘జల బాంబులు’?
Himalayan Flood Threat: నేపాల్లో సంభవించిన భారీ వరదలు మరోసారి హిమాలయ ప్రాంతాల్లోని హిమానీనద సరస్సులపై ఆందోళనలను పెంచాయి. నేపాల్-టిబెట్ సరిహద్దులో హిమానీనదం విస్ఫోటనం కారణంగా భోటేకోశి, త్రిశూలి నదుల్లో భారీగా వరదలు సంభవించినట్లు సమాచారం. ఈ ఘటనతో మధ్య నేపాల్లోని పలు ప్రాంతాల్లో తీవ్ర నష్టం జరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. అడపాదడపా కురుస్తున్న భారీ వర్షాలు, టిబెట్లో నదీ మూల ప్రాంతానికి సమీపంలో కొత్తగా తాత్కాలిక సరస్సు ఏర్పడటంతో భోటేకోశి నదిలో నీటిమట్టం మళ్లీ పెరిగినట్లు… -
Nepal Floods: తప్పిన ఘోర విషాదం.. 1,643 మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడిన హెడ్మాస్టార్.. క్షణాల్లో మునిగిన స్కూల్
నేపాల్ జలప్రళయం ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపిందో అందరికీ తెలిసిందే. అకస్మాత్తుగా వచ్చిన విలయానికి ఎందరో జలసమాధి అయ్యారు. ఇప్పటికే 700 మంది ప్రాణాలు కోల్పోగా.. వందలాది మంది గల్లంతయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు చూస్తుంటే.. భయాందోళన కలిగిస్తున్నాయి. -
Nepal Floods: “నువ్వు దేవుడు సామీ”.. వరదల్లో 1,643 మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడిన ప్రిన్సిపాల్
Nepal Floods: నేపాల్ నువాకోట్ జిల్లా త్రిశూలి లోయలోని ఉన్న ఒక పాఠశాల నిమిషాల వరద ఉద్ధృతికి కొట్టుకుపోయింది. ఆ సమయంలో శ్రీ త్రిభువన్ త్రిశూలి సెకండరీ స్కూల్లో 1,643 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉన్నారు. ఉదయం 9:20 గంటల సమయంలో ప్రిన్సిపాల్ రాజేంద్ర దవాడీకి ఓ స్నేహితుడి నుంచి అత్యవసర ఫోన్ కాల్ వచ్చింది. ఎగువన ఉన్న గ్రామం కొట్టుకుపోయిందని, వెంటనే అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి వెళ్లాలని ఆ స్నేహితుడు హెచ్చరించాడు. మొదట్లో నదికి… -
Bank Locker Swept: వరదల్లో కొట్టుకుపోయిన బ్యాంకు లాకర్.. రూ. లక్షల్లో డబ్బు.. ఎగబడిన జనం
నేపాల్లో భారీ వరదలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఈ ప్రకృతి విపత్తులో 600 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, సుమారు 2,500 మంది ఇప్పటికీ గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు. గల్లంతైన వారిలో 537 మంది విదేశీయులు ఉండగా.. వారిలో 320 మంది భారతీయులు ఉన్నట్లు సమాచారం. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు మరింత ప్రమాదం పొంచి ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. వరదల్లో కొట్టుకుపోయిన బ్యాంకు లాకర్ నేపాల్లో వరదల… -
Lax Gopisetty: ఐటీ రంగంలో 30 ఏళ్ల అనుభవం.. నేపాల్ వరదల్లో ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటివ్ అదృశ్యం.
నేపాల్లో సంభవించిన బీభత్సమైన మెరుపు వరదల తర్వాత, ప్రముఖ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ అనుబంధ సంస్థ అయిన ‘ఇన్ఫోసిస్ పబ్లిక్ సర్వీసెస్’ (IPS) సీఈఓ లక్ష్ గోపిశెట్టి అదృశ్యమయ్యారని, ఆయనను సంప్రదించడం సాధ్యపడటం లేదని ఇన్ఫోసిస్ అధికారికంగా తెలిపింది. ఆయన తన వ్యక్తిగత పర్యటన నిమిత్తం నేపాల్ వెళ్లి ఈ విపత్తులో చిక్కుకున్నట్లు సమాచారం. ఆయనను వీలైనంత త్వరగా గుర్తించడం, క్షేమంగా కలిసేలా చూడటం , ఆయన భద్రతను నిర్ధారించడమే తమ తక్షణ ప్రాధాన్యత అని కంపెనీ… -
Nepal Floods: భారత పౌరుల గురించి కీలక వివరాలు వెల్లడించిన కేంద్రం
నేపాల్లో ఇంకా సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. నాలుగు రోజులు గడుస్తున్నా ఇంకా పలువురి జాడ కనిపించలేదు. దీంతో ఆత్మీయుల రాక కోసం ఎన్నో కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి. ఇక పలువురి భారతీయుల సమాచారం కూడా తెలియడం లేదు. -
Nepal flood: నేపాల్ వరద బీభత్సం.. ఉత్తర్ ప్రదేశ్లో కనిపిస్తున్న మృతదేహాలు..
Nepal flood: నేపాల్ వరద విషాదం భారత్లో కనిపిస్తోంది. వినాశకమైన వరదల కారణంగా ఆ దేశంలో వందలాది మంది మరణించారు. చాలా మంది గల్లంతయ్యారు. ఇప్పుడు వారి మృతదేహాలు దిగువన ఉన్న భారత్లోని నదుల్లోకి కొట్టుకొస్తున్నాయి. గత రెండు రోజుల్లో ఉత్తర్ ప్రదేశ్లోని వివిధ ప్రాంతాల్లో నదుల్లో 10 మృతదేహాలు లభ్యమయ్యాయి. వరద ప్రభావిత నేపాల్ నుంచి భారత్కు ఈ మృతదేహాలు కొట్టుకొస్తున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. నేపాల్ సరిహద్దును ఆనుకుని ఉన్న మహారాజ్ గంజ్, కుషీ నగర్… -
Nepal Flood Tragedy: 600 దాటిన మృతుల సంఖ్య.. మరణాలు పెరుగుతుండటంతో నేపాల్లో కొత్త సంక్షోభం..!
Nepal Flood Tragedy: నేపాల్ను అతలాకుతలం చేసిన భారీ ఆకస్మిక వరదలు (Flash Floods) తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. వరదల కారణంగా మృతుల సంఖ్య 600 దాటగా, మరో 2,500 మందికి పైగా ఆచూకీ లేకుండా పోయారు. దీంతో సహాయక చర్యలకు మరో పెద్ద సమస్య ఎదురైంది. వరదల్లో మరణించిన వారి మృతదేహాలను భద్రపరిచేందుకు దేశంలోని మార్చురీల్లో సరిపడా స్థలం లేకపోవడంతో అధికారులు తాత్కాలిక ఏర్పాట్లు చేస్తున్నారు. భారత్, చైనా మధ్య ఉన్న భూపరివేష్టిత దేశమైన నేపాల్లోని… -
Mallikarjun Kharge: ప్రధాని మోడీ, అమిత్షాకు ఖర్గే లేఖ.. వారిని కాపాడాలని విజ్ఞప్తి
Mallikarjun Kharge: నేపాల్లో సంభవించిన విధ్వంసకర వరదలపై కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఆయన లేఖ రాశారు. నేపాల్లో భారీ వరదల కారణంగా పెద్ద ఎత్తున ప్రాణ, ఆస్తి నష్టం సంభవించిందని ఖర్గే పేర్కొన్నారు. వరదల కారణంగా 500 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, దాదాపు 1,000 మందికి పైగా గల్లంతైనట్లు ఖర్గే…
తాజావార్తలు
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్లో మంటలు రేపుతున్నాయా..?
-
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
-
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
-
Telangana Health Department: ఆరోగ్యశాఖలో భారీగా ఉద్యోగాలు.. 1,931 పోస్టులకు మెరిట్ లిస్ట్ విడుదల
-
OTR: వరంగల్ కాంగ్రెస్లో అసలేం జరుగుతోంది? కొండా వర్సెస్ కాంగ్రెస్ నేతలు..
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!