Perni Nani: కాకినాడ పోర్టులో పవన్ కళ్యాణ్ తనిఖీలపై పేర్ని నాని సెటైర్లు!
- పవన్ తనిఖీలపై పేర్ని నాని సెటైర్లు
- పవన్ తనిఖీలు ఓ మంచి ప్రయత్నం
- షిప్ మీదకు వెళ్లొద్దని చంద్రబాబు చెప్పారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాకినాడ పోర్టులో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనిఖీలపై మాజీ మంత్రి పేర్ని నాని సెటైర్లు వేశారు. పవన్ వెళ్లిన బోటులో కస్టమ్స్, పోర్టు అధికారి ఇద్దరు ఉన్నారని.. అనుమతి ఇవ్వాల్సిన అధికారులు అక్కడే ఉండగా పర్మిషన్ ఇవ్వటం లేదని చెప్పటం ఏంటన్నారు. కాకినాడ పోర్టులో డిప్యూటీ సీఎం షిప్లో తనిఖీలు ఓ మంచి ప్రయత్నం అని, ఈ ప్రయత్నాన్ని అందరూ అభినందించాలన్నారు. పవన్ను షిప్ ఎక్కడవద్దని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పి ఉండాలని, లేకపోతే పవన్ అబద్ధం చెప్పి ఉండాలని పేర్ని నాని సెటైర్లు వేశారు. ఈరోజు మీడియాతో మాట్లాడిన పేర్ని నాని.. కాకినాడ పోర్టులో పెద్ద ఎత్తున పేదల బియ్యం అక్రమంగా ఎగుమతి అవుతున్న విషయంపై స్పందించారు.
‘కాకినాడ పోర్టులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ షిప్లో తనిఖీలు ఓ మంచి ప్రయత్నం. ఈ ప్రయత్నాన్ని అందరూ అభినందించాలి. ప్రాణాలకు తెగించి పవన్ చేసిన ఈ ప్రయత్నంపై కొన్ని అనుమానాలు ఉన్నాయి. తనను షిప్ ఎక్కడానికి అనుమతి ఇవ్వటం లేదని పవన్ చెబుతున్నారు. పవన్ వెళ్లిన బోటులో కస్టమ్స్, పోర్టు అధికారి ఇద్దరు ఉన్నారు. షిప్ ఎక్కడానికి అనుమతి ఇవ్వాల్సిన ఇద్దరు ఆయనతో ఉంటే.. అనుమతి ఇవ్వలేదని చెప్పటం ఏంటి?. ముందు రోజు కలెక్టర్ వెళ్ళటానికి అనుమతి ఇచ్చింది వారే కదా. పవన్ను షిప్ ఎక్కడవద్దని సీఎం చంద్రబాబు చెప్పి ఉండాలి. లేకపోతే పవన్ అబద్ధం చెప్పి ఉండాలి’ అని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు.
Also Read
- UK: బ్రిటన్ ప్రధానిగా ఆండీ బర్న్హామ్.. సోమవారం బాధ్యతలు స్వీకరణ
- Ponnam Prabhakar: అలాంటి వాహనాలను సీజ్ చేయండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్..
- Sonam Wangchuk: సోనం వాంగ్చుక్ దీక్షలో నవ్వులు.. పువ్వులు.. ఏం జరిగిందంటే..!
- Gambhir-Kohli: గంభీర్-కోహ్లీ మధ్య ‘కోల్డ్ వార్’.. తొలి సారి నోరు విప్పిన టీమిండియా కోచ్!
‘స్టెల్లా షిప్ సీజ్ చేయమని పవన్ కళ్యాణ్ అంటున్నారు. అక్కడే కెన్ స్టార్ అనే మరో షిప్ కూడా ఉంది. కెన్ స్టార్ షిప్ సీజ్ చేయాలని పవన్ ఎందుకు అనలేదు. స్టెల్లాలో ద్వారంపూడి లేదా అతని తమ్ముడి బియ్యం కూడా లేవు. అయినా ఆ షిప్లో బియ్యంపై విచారణ చేయాలని కోరుతున్నాం. బియ్యం రవాణా విషయంలో చంద్రబాబు, పవన్ డ్రామా ఆడుతున్నారా?. కెన్ స్టార్ షిప్ యజమాని శ్రీను అనే వ్యక్తిది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వియ్యంకుడు శ్రీను కాబట్టి దాని జోలికి వెళ్ళటం లేదు. శ్రీను ఒక్కడే 42 వేల టన్నుల పీడీఎస్ బియ్యం రవాణా చేస్తున్నారు. అందుకే పవన్ కళ్ళకు గంతలు కట్టుకుని కెన్ స్టార్ జోలికి వెళ్ళటం లేదు. కెన్ స్టార్ షిప్ మీదకు కూడా పవన్, కలెక్టర్ వెళ్ళాలి. కెన్ స్టార్ షిప్ మీదకు వెళ్లొద్దని పవన్ కి చంద్రబాబు చెప్పారా?. ఎందుకు వెళ్ళలేదో పవన్ సమాధానం చెప్పాలి. బియ్యానికి వైఎస్ జగన్కి, అరబిందో సంస్థకు ఏం సంబంధం?’ అని మాజీ మంత్రి ప్రశ్నించారు.
- Tags
- ap
- pawan kalyan
- Perni Nani
- tdp
- ycp
తాజావార్తలు
-
UK: బ్రిటన్ ప్రధానిగా ఆండీ బర్న్హామ్.. సోమవారం బాధ్యతలు స్వీకరణ
-
Ponnam Prabhakar: అలాంటి వాహనాలను సీజ్ చేయండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్..
-
Sonam Wangchuk: సోనం వాంగ్చుక్ దీక్షలో నవ్వులు.. పువ్వులు.. ఏం జరిగిందంటే..!
-
Gambhir-Kohli: గంభీర్-కోహ్లీ మధ్య ‘కోల్డ్ వార్’.. తొలి సారి నోరు విప్పిన టీమిండియా కోచ్!
-
Pakistan: పాక్లో 5వ రాష్ట్రంగా గిల్గిట్-బాల్టిస్తాన్.. భారత్ను కవ్వించే చర్య..
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?