Etala Rajender : “ఆనాడు మీరు చేసిందేంటి?”.. కశ్మీర్ సమస్యకు కారణం కాంగ్రెస్ కాదా?
- స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లయినా కశ్మీర్ సమస్య అలాగే ఉంది
- కశ్మీర్ సమస్యకు కారణం కాంగ్రెస్ పార్టీ కాదా ?
- కశ్మీర్ కి స్వతంత్రపతిపత్తి ఇచ్చింది ఎవరు?
- వివాదానికి ఆజ్యం పోసింది కాంగ్రెస్ పార్టీ కాదా ?
- సీఎం వ్యాఖ్యలపై ఈటల రాజేందర్ ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీఎం వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ స్పందించారు. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయిన ఇంకా కశ్మీర్ సమస్య అలాగే ఉంది అంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీ కాదా? అని ప్రశ్నించారు. కశ్మీర్ కి స్వతంత్రపతిపత్తి ఇచ్చి వివాదానికి ఆజ్యం పోసింది కాంగ్రెస్ పార్టీ కాదా? ఆనాడు ఇందిర గాంధీ పాక్ ఆక్రమిత కశ్మీర్ ను స్వాధీనం చేసుకొని ఉంటే ఈనాడు భారత్ దేశానికి ఈ పరిస్థితి వచ్చి ఉండేదా ? అని నిలదీశారు. 370 ఆర్టికల్ ను రద్దుచేసి కశ్మీర్ని భారత దేశంలో అంతర్భాగం చేసిన ధీరుడు నరేంద్ర మోడీ అని.. మోడీ మీద విమర్శలు చేయడం సూర్యుని మీద ఉమ్మివేయడమనని తెలిపారు. ప్రపంచంలోనే నరేంద్ర మోడీ పెద్దన్న పాత్రను పోషిస్తున్నారని.. రష్యా ఉక్రెయిన్ యుద్ధం కూడా ఆగాలని కోరుకున్న వ్యక్తి మోడీ అని కొనియాడారు. సమస్య పరిష్కరించడం ముఖ్యమని.. దేశ భద్రత పట్ల కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ నాయకులు మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్లే ఉందని దుయ్యబట్టారు.
READ MORE: Off The Record: ఏపీ బీజేపీ పాత ముద్ర చెరిపేయడానికి తంటాలు పడుతోందా?
Also Read
- రికార్డుల మోత..! The Hundredలో పరుగుల సునామీ.. ఒక్క మ్యాచ్లో 31 సిక్సర్లు, 445 పరుగులు..
- Hyderabad: హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ.. 8 కాలేజీలకు ఫేక్ ఫైర్ NOCలు
- TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
- Ishan Kishan: మైదానంలో సిక్సర్ల కింగ్.. బ్యాంకులో సర్కారీ నౌకరీ.. బిజీ క్రికెట్ లైఫ్లోనూ ఉద్యోగ బాధ్యతలు
ప్రాసకోసం, రాజకీయంకోసం మీరు మాట్లాడుతున్న మాటలు సైనికుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. జైహింద్ పేరుతో సైనికుల కోసమని ర్యాలీ పెట్టి రాహుల్ గాంధీని ప్రధాని చేద్దాం అంటారు.. ఏం మాట్లాడుతున్నారో సోయి ఉండే మాట్లాడుతున్నారా? అని మండిపడ్డారు. ఢిల్లీలో వెళ్లి మోడీని పొగుడుతారు.. గల్లీలో వచ్చి తిడతారని విమర్శించారు.. కేంద్ర ప్రభుత్వ చేస్తున్న పనులపై మీ మంత్రులు కొనియాడతారు.. మీరేమో తిడతారు.. ఇదేనా మీ నైజం? అని తీవ్రంగా మండిపడ్డారు. మల్కాజ్గిరి ప్రజలు అప్పట్లో గుండెల్లో పెట్టుకొని గెలిపించారని అంటున్నారు. అందుకేనా వారికి గుండె కోతను మిగుల్చుతున్నారు? అని ఎద్దేవ చేశారు. అందుకేనా హైడ్రాను తీసుకువచ్చి మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఉన్న ప్రజల ఉసురు పోసుకుంటున్నారని, గుండెల్లో పెట్టుకుని.. అభిమానించినందుకేనా ఆత్మహత్యలు చేసుకొనేలా చేస్తున్నారని నిలదీశారు. రక్తాన్ని చెమటగా మలచి గెలిపిస్తే వారి రక్తాన్నే కళ్ళు చూస్తున్నారన్నారు. ప్రజల కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారని.. మీకు ఓట్లు వేసి గెలిపించినందుకా? ప్రజల కన్నీళ్లు చూసి సంతోషపడుతున్నారన్నారు.
READ MORE: Karnataka: ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య.. సూసైడ్ నోట్లో ఏం రాసిందంటే..!
తాజావార్తలు
-
రికార్డుల మోత..! The Hundredలో పరుగుల సునామీ.. ఒక్క మ్యాచ్లో 31 సిక్సర్లు, 445 పరుగులు..
-
Hyderabad: హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ.. 8 కాలేజీలకు ఫేక్ ఫైర్ NOCలు
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
Aishwarya Rajesh : ఫ్లాప్లతో డీలా పడిన ఐశ్వర్య రాజేశ్.. పెరిగిన రెమ్యునరేషన్ కష్టాలు
-
Naagin: కోరికలు తీర్చే నాగినిగా శ్రద్ధా కపూర్… ఆరేళ్ల తర్వాత మళ్లీ కదిలిన ‘ఇచ్ఛాధారి నాగిన్’..
ట్రెండింగ్
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!