Karnataka: ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య.. సూసైడ్ నోట్లో ఏం రాసిందంటే..!
- ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య
- కర్ణాటకలోని కొడగులో ఘటన
- సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్న పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
క్షణికావేశంలో ఓ ఇంజనీరింగ్ విద్యార్థిని తీసుకున్న నిర్ణయం విషాదాన్ని నింపింది. అప్పటి దాకా కలిసి మెలిసి తిరిగిన సహచర విద్యార్థిని విగతజీవిగా మారిపోవడంతో ఆ యువతుల గుండెలు తట్టుకోలేకపోయాయి. ఒక్కగానొక్క కుమార్తె ప్రాణాలు పోయాయన్న విషయం తెలిసి ఆ తల్లిదండ్రులు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఈ ఘోర విషాద ఘటన కర్ణాటకలోని కొడగులో చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: Kannada Industry : క్షమాపణ చెప్పకుంటే థగ్ లైఫ్ బ్యాన్ చేస్తాం.. కన్నడ ఇండస్ట్రీ వార్నింగ్
Also Read
- Ketan Agarwal Case: కేతన్ను లోయలోకి తోసేముందు చేతన్ ఏమన్నాడో తెలుసా.. వెలుగులోకి కొత్త విషయాలు
- Ketan Agarwal Case: కేతన్-సియా కేసులో కొత్త ట్విస్ట్.. బ్లాక్మెయిల్ కోణంలో దర్యాప్తు..
- Woman Constable: ఇదేం పద్దతి మేడం.. ఫిర్యాదు కోసం వచ్చిన వృద్ధుడి ఎదుట.. టేబుల్పై కాళ్లు పెట్టిన మహిళా కానిస్టేబుల్
- Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
19 ఏళ్ల తేజస్విని కళాశాల హాస్టల్లో ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈశాన్య కర్ణాటకలోని రాయచూర్ నివాసి మహంతప్ప ఏకైక కుమార్తె తేజస్విని. కొడగు జిల్లా పొన్నంపేటలోని హల్లిగట్టు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు మెషిన్ లెర్నింగ్ కోర్సులో చేరింది.
ఇది కూడా చదవండి: CID: కిడ్నీ రాకెట్ కేసులో సీఐడీ దూకుడు.. మరో ఇద్దరు అరెస్టు..
మూడు రోజుల క్రితం 19వ పుట్టినరోజును స్నేహితులతో కలిసి జరుపుకుంది. బర్త్డేకు హాజరుకాని వారికి బుధవారం మరోసారి స్వీట్లు కూడా పంచిపెట్టింది. తరగతులకు హాజరైన తర్వాత సాయంత్రం 4 గంటల ప్రాంతంలో తిరిగి తన హాస్టల్ గదికి తిరిగి వచ్చింది. సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో ఆమె క్లాస్మేట్స్లో ఒకరు.. గది తలుపు లోపలి నుంచి లాక్ చేయబడి ఉండటాన్ని గమనించింది. పదే పదే తట్టినా, ఫోన్ చేసినా స్పందన రాలేదు. ఈ విషయాన్ని హాస్టల్ సూపర్వైజర్ దృష్టికి తీసుకెళ్లింది. బలవంతంగా తలుపు తెరిచి చూస్తే తేజస్విని విగతజీవిగా పడి ఉంది. సమీపంలోనే సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. ప్రాజెక్ట్ వర్కులు, తదుపరి చదవులు చదవడం ఇష్టం లేనట్లుగా నోట్లో పేర్కొంది.
పొన్నంపేట పోలీస్ స్టేషన్ అధికారులు సంఘటనా స్థలాన్ని సందర్శించి మృతదేహాన్ని పరిశీలించారు. ప్రాథమిక తనిఖీలు నిర్వహించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విద్యాపరమైన ఒత్తిడి కారణంగానే చనిపోయినట్లు సూసైడ్లో పేర్కొందని తెలిపారు. కుమార్తె మరణంతో తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. కన్నీటిపర్యంతం అయ్యారు.
తాజావార్తలు
-
Denmark: డెన్మార్క్లో అజాన్పై బ్యాన్.. ఇస్లామీకీకరణపై ఆందోళన..
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
YouTube vs Instagram: డబ్బు సంపాదించాలంటే ఇన్స్టా బెస్ట్ ఆ? యూట్యూబ్ బెస్ట్ ఆ? ఈ లెక్కలు చూస్తే షాకవుతారు!
-
Ketan Agarwal Case: కేతన్ను లోయలోకి తోసేముందు చేతన్ ఏమన్నాడో తెలుసా.. వెలుగులోకి కొత్త విషయాలు
-
Ketan Agarwal Case: కేతన్-సియా కేసులో కొత్త ట్విస్ట్.. బ్లాక్మెయిల్ కోణంలో దర్యాప్తు..
ట్రెండింగ్
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!