Karnataka: ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య.. సూసైడ్ నోట్లో ఏం రాసిందంటే..!
- ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య
- కర్ణాటకలోని కొడగులో ఘటన
- సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్న పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
క్షణికావేశంలో ఓ ఇంజనీరింగ్ విద్యార్థిని తీసుకున్న నిర్ణయం విషాదాన్ని నింపింది. అప్పటి దాకా కలిసి మెలిసి తిరిగిన సహచర విద్యార్థిని విగతజీవిగా మారిపోవడంతో ఆ యువతుల గుండెలు తట్టుకోలేకపోయాయి. ఒక్కగానొక్క కుమార్తె ప్రాణాలు పోయాయన్న విషయం తెలిసి ఆ తల్లిదండ్రులు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఈ ఘోర విషాద ఘటన కర్ణాటకలోని కొడగులో చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: Kannada Industry : క్షమాపణ చెప్పకుంటే థగ్ లైఫ్ బ్యాన్ చేస్తాం.. కన్నడ ఇండస్ట్రీ వార్నింగ్
Also Read
- Gas Pipeline: భారత్ మాస్టర్ ప్లాన్.. సముద్రగర్భంలో భారీ గ్యాస్ పైప్లైన్..
- Kamal Haasan: పొదుపు మంత్రంపై కమల్హాసన్ కీలక వ్యాఖ్యలు
- 1991 India Gold Crisis: రాత్రికి రాత్రి బ్రిటన్కు 47,000 కిలోల బంగారం తరలింపు.. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే!
- LayOffs: స్టార్బక్స్లో మళ్లీ ఉద్యోగుల తొలగింపు.. 300 మంది కార్పొరేట్ స్టాఫ్పై వేటు.. కొన్ని ఆఫీసుల మూసివేత..
19 ఏళ్ల తేజస్విని కళాశాల హాస్టల్లో ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈశాన్య కర్ణాటకలోని రాయచూర్ నివాసి మహంతప్ప ఏకైక కుమార్తె తేజస్విని. కొడగు జిల్లా పొన్నంపేటలోని హల్లిగట్టు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు మెషిన్ లెర్నింగ్ కోర్సులో చేరింది.
ఇది కూడా చదవండి: CID: కిడ్నీ రాకెట్ కేసులో సీఐడీ దూకుడు.. మరో ఇద్దరు అరెస్టు..
మూడు రోజుల క్రితం 19వ పుట్టినరోజును స్నేహితులతో కలిసి జరుపుకుంది. బర్త్డేకు హాజరుకాని వారికి బుధవారం మరోసారి స్వీట్లు కూడా పంచిపెట్టింది. తరగతులకు హాజరైన తర్వాత సాయంత్రం 4 గంటల ప్రాంతంలో తిరిగి తన హాస్టల్ గదికి తిరిగి వచ్చింది. సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో ఆమె క్లాస్మేట్స్లో ఒకరు.. గది తలుపు లోపలి నుంచి లాక్ చేయబడి ఉండటాన్ని గమనించింది. పదే పదే తట్టినా, ఫోన్ చేసినా స్పందన రాలేదు. ఈ విషయాన్ని హాస్టల్ సూపర్వైజర్ దృష్టికి తీసుకెళ్లింది. బలవంతంగా తలుపు తెరిచి చూస్తే తేజస్విని విగతజీవిగా పడి ఉంది. సమీపంలోనే సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. ప్రాజెక్ట్ వర్కులు, తదుపరి చదవులు చదవడం ఇష్టం లేనట్లుగా నోట్లో పేర్కొంది.
పొన్నంపేట పోలీస్ స్టేషన్ అధికారులు సంఘటనా స్థలాన్ని సందర్శించి మృతదేహాన్ని పరిశీలించారు. ప్రాథమిక తనిఖీలు నిర్వహించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విద్యాపరమైన ఒత్తిడి కారణంగానే చనిపోయినట్లు సూసైడ్లో పేర్కొందని తెలిపారు. కుమార్తె మరణంతో తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. కన్నీటిపర్యంతం అయ్యారు.
తాజావార్తలు
-
Gas Pipeline: భారత్ మాస్టర్ ప్లాన్.. సముద్రగర్భంలో భారీ గ్యాస్ పైప్లైన్..
-
Polavaram: పోలవరం నిర్వాసితులకు రూ. 307 కోట్ల పరిహారం.. 2027 నాటికి ప్రాజెక్ట్ పూర్తి: మంత్రి నిమ్మల రామానాయుడు
-
Tragedy: భార్య మోసంతో భర్త ఆత్మహత్య కేసులో ట్విస్ట్..!
-
Kamal Haasan: పొదుపు మంత్రంపై కమల్హాసన్ కీలక వ్యాఖ్యలు
-
1991 India Gold Crisis: రాత్రికి రాత్రి బ్రిటన్కు 47,000 కిలోల బంగారం తరలింపు.. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే!
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..