Elon Musk: భారత ఎన్నికల విధానంపై ఎలాన్ మస్క్ ప్రశంసలు..
- ఇటీవల అమెరికా అధ్యక్ష ఎన్నికలు పూర్తి
- కాలిఫోర్నియాలో ఇంకా పూర్తి కాని ఓట్ల లెక్కింపు
- ఓట్ల లెక్కింపు ఇంకా పూర్తికాకపోవడంపై అసంతృప్తి
- భారత ఎన్నికల విధానంపై మస్క్ ప్రశంసలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ భారత ఎన్నికల ప్రక్రియ విధానాన్ని కొనియాడారు. కాలిఫోర్నియాలో ఓట్ల లెక్కింపు ఇంకా పూర్తికాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. భారత్పై ప్రశంసలు కురిపించారు. ఎలాన్ మస్క్ ‘భారతదేశంలో ఒక్క రోజులోనే 640 మిలియన్ల ఓట్లను ఎలా లెక్కించారు?’ అనే హెడ్లైన్తో ప్రచురించి ఓ వార్తా కథనాన్ని తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. ‘భారతదేశం ఒక్క రోజులోనే 640 మిలియన్ల ఓట్లు లెక్కించింది. కానీ కాలిఫోర్నియా ఇంకా లెక్కింపు దశలోనే ఉంది.’ అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ నెల 5న జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికలలో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించినట్లు ప్రకటించారు. అయినా అత్యధిక జనాభా కలిగిన కాలిఫోర్నియాలో ఇప్పటికీ ఓట్ల లెక్కింపు కొనసాగుతుండటం గమనార్హం.
READ MORE: Pushpa 2 : నైజాం చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ‘పుష్ప – 2’
Also Read
కాగా..ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ను ఉపయోగించాలని ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు ఎలాన్ మస్క్ గతంలో సమర్థించారు. అంతేకాదు ఓటింగ్ మెషీన్పై కూడా ఆందోళన కరమైన అంశాన్ని పంచుకున్నారు. కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సాయంతో ఈవీఎంలను హ్యాక్ చేయొచ్చని ఆరోపించారు. అమెరికాలో అధ్యక్ష ఎన్నికలకు ముందు మస్క్ చేసిన ఈ ప్రకటన సంచలనం సృష్టించింది. భారతదేశంలో కూడా ఓటింగ్ యంత్రాల (ఈవీఎంలు) విషయంపై గతంలో మస్క్ అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
READ MORE:UP: సంభాల్ జామా మసీదు-హరిహర్ ఆలయ వివాదం.. రీ సర్వేకు వచ్చిన పోలీసులపై రాళ్ల దాడి..
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!