IMD Rain Alert: ఈ రాష్ట్రాలకు అతి భారీ వర్ష సూచన.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
- ఉత్తర భారత రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
- అతి భారీ వర్షాలు కురుస్తాయని వార్నింగ్
- అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ వ్యాప్తంగా రుతుపవనాలు విస్తరిస్తున్నాయి. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత వారం నుంచి మహారాష్ట్రలో వర్షాలు దంచికొడుతున్నాయి. తాజాగా కేంద్ర వాతావరణ శాఖ.. ఉత్తర భారత రాష్ట్రాలకు భారీ వర్షాల హెచ్చరిక జారీ చేసింది. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ శాస్త్రవేత్త డాక్టర్ శశికాంత్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్లు వెల్లడించారు.
డాక్టర్ శశికాంత్ మాట్లాడుతూ.. ‘‘వాయువ్య భారతదేశంలోని జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ పర్వత ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. ఈరోజు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశాం. రేపు కూడా ముఖ్యంగా ఉత్తరాఖండ్లోని బాగేశ్వర్, పరిసర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అందుకే అక్కడ కూడా ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది.’’ అని తెలిపారు. అలాగే జమ్మూకశ్మీర్తో పాటు సమీప ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లు పేర్కొన్నారు. మైదాన ప్రాంతాల విషయానికి వస్తే.. పంజాబ్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఒకటి, రెండు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
Also Read
- Swine Flu H1N1 in India: H1N1 కొత్త వేరియంట్ వచ్చిందా? కరోనా లాంటి ముప్పు ఉందా? ICMR కీలక సమాచారం
- Kangana Ranaut: ‘వాళ్లంతా పనికిమాలిన వాళ్లు’.. తాప్సీ, బాబా రామ్దేవ్పై కంగనా ఘాటు వ్యాఖ్యలు
- CJP: ఢిల్లీలో సెప్టెంబర్ 5న భారీ నిరసన మార్చ్.. మరోసారి ఆందోళనకు సిద్ధమైన విద్యార్థులు
- Tamil Nadu: తీవ్ర దుమారం రేపుతోన్న పొట్టి దుస్తుల వ్యవహారం.. మంత్రి కీర్తన ఘాటు స్పందన
తూర్పు రాజస్థాన్లో ఈరోజు నుంచి వర్షాల తీవ్రత మరింత పెరిగే అవకాశముందని ఐఎండీ తెలిపింది. రాబోయే రెండు నుంచి మూడు రోజుల పాటు అక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని డాక్టర్ శశికాంత్ వివరించారు. దేశంలో రుతుపవనాల పురోగతిపై మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతం దేశంలోని దాదాపు అన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించాయి. రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాలు మాత్రమే ఇంకా మిగిలి ఉన్నాయి. అయితే వచ్చే మూడు రోజుల్లో అక్కడికి కూడా రుతుపవనాలు విస్తరించి, దేశమంతా పూర్తిగా కప్పివేస్తాయి.’’ అని డాక్టర్ శశికాంత్ వెల్లడించారు.
మహారాష్ట్రలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముంబై, పూణె జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇక అతి భారీ వర్షాలు కారణంగా ఇప్పటి వరకు 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అనవసర ప్రయాణాలు రద్దు చేసుకోవాలని సూచించారు.
#WATCH | Delhi: On the weather conditions, IMD Scientist, Dr Shashi Kant says, "Regarding Northwest India—specifically the mountainous regions of Jammu & Kashmir, Himachal Pradesh, and Uttarakhand—an 'orange' warning for heavy to very heavy rainfall has been issued for Himachal… pic.twitter.com/HNsIR6Hekx
— ANI (@ANI) July 6, 2026
- Tags
- Heavy Rain
- IMD
- Rain Alert
- Warning
తాజావార్తలు
-
Tirumala Special Entry Darshan Tickets: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల బుకింగ్..!
-
Godavari Pushkaralu 2027: గోదావరి పుష్కరాలపై వైద్యశాఖ భారీ కసరత్తు.. 1,110 వైద్య శిబిరాలు, 30 ఫీల్డ్ ఆస్పత్రులు..
-
Pluto OTT: తాగుడుకు బానిస అయ్యే ఏలియన్.. ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ సైన్స్ ఫిక్షన్ మూవీ
-
BethlehemKudumbaUnit : తెలుగులో విడుదలవుతున్న నివిన్ పౌలి లేటెస్ట్ బ్లాక్బస్టర్ ‘బెత్లహేమ్ కుటుంబ యూనిట్’
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
ట్రెండింగ్
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!