Mumbai: ముంబై, పూణె జలదిగ్బంధం.. వర్ష బీభత్సానికి 13 మంది మృతి
- మహారాష్ట్రలో భారీ వర్షాలు
- ముంబై, పూణె జలదిగ్బంధం
- వర్ష బీభత్సానికి 13 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్రలో వర్షాలు దంచికొడుతున్నాయి. గత వారం నుంచి కురుస్తున్న వర్షాలతో రాష్ట్రం అతలాకుతలం అవుతోంది. ఇక ఆర్థిక రాజధాని ముంబై జలదిగ్బంధం అయింది. ఇక పుణెలో కొండచరియలు విరిగి ఇల్లు మట్టిలో కలిసిపోయింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 13 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. ఇంకోవైపు సహాయ చర్యలు కొనసాగుతున్నాయి.

Also Read
- Dowry harassment: ప్రేమ పెళ్లి చేసుకున్న కట్నం వేధింపులు తప్పలేదు.. 2 నెలలకే నవవధువు మృతి..
- Pahalgam Attack: ఎన్ఐఏ ఛార్జ్షీట్లో సూత్రధారిగా హఫీజ్ సయీద్.. పాక్ కుట్రపై కీలక విషయాలు
- Prashant Kishor: ‘కుక్కను, పిల్లిని నిలబెట్టినా గెలుస్తామనుకుంటున్నారు’ బీజేపీపై ప్రశాంత్ కిషోర్ ఘాటు వ్యాఖ్యలు
- Abortion Ruling: గర్భం కొనసాగించాలా? అబార్షన్ చేయించుకోవాలా? ఈ నిర్ణయం పూర్తిగా తల్లిదే.. హైకోర్టు కీలక తీర్పు
రుతుపవనాలు కారణంగా మహారాష్ట్రలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. ముంబై, పుణె, థానే, పాల్ఘర్ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తుండటంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రాష్ట్రంలో వర్షాల కారణంగా ఇప్పటివరకు కనీసం 13 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. పరిస్థితి మరింత విషమించే అవకాశం ఉండటంతో భారత వాతావరణ శాఖ ముంబైకి ఆరెంజ్ అలర్ట్, పుణెకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.
పుణె జిల్లాలోని పాటన్ గ్రామంలో సోమవారం తెల్లవారుజామున భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఒక ఇంటిపై భారీ మట్టిపెళ్లలు పడటంతో ఇల్లు పూర్తిగా కూలిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఇక ముంబై పరిధిలో భవనం కూలి ఐదుగురు చిన్నారులు, ఒక మహిళ సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. కుర్ల ప్రాంతంలో చెట్టు కూలి ఒక వృద్ధుడు దుర్మరణం చెందాడు. జాతీయ విపత్తు స్పందన దళం, పోలీసులు, ఇతర సహాయక బృందాలు శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. లోనావాలా డివిజన్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గజానన్ తోంపే మాట్లాడుతూ.. భారీ వర్షాల కారణంగా గ్రామంలో మూడు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయని, వాటిలో ఒకటి ఇంటిపై పడటంతో ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు.
ఇక కర్జత్-లోనావాలా భోర్ ఘాట్ సెక్షన్లోని ఠాకూర్వాడి, మంకీ హిల్ ప్రాంతాల్లో వరుసగా కొండచరియలు విరిగిపడటంతో ముంబై-పుణె మధ్య రైల్వే మార్గం తీవ్రంగా దెబ్బతింది. భారీ వర్షాల కారణంగా అప్, డౌన్, మిడిల్ లైన్లు దెబ్బతినడంతో 16 రైళ్లను రద్దు చేయగా, మరో 9 రైళ్లను దారి మళ్లించారు. రద్దైన రైళ్లలో సీఎస్ఎంటీ-పుణె ఇంద్రాయణి ఎక్స్ప్రెస్, ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్, డెక్కన్ ఎక్స్ప్రెస్, డెక్కన్ క్వీన్, ప్రగతి ఎక్స్ప్రెస్, ధూలే ఎక్స్ప్రెస్, పుణె-సీఎస్ఎంటీ సింహగఢ్ ఎక్స్ప్రెస్ తదితర రైళ్లు ఉన్నాయి. మరికొన్ని దూర ప్రయాణ రైళ్లను కుదించిన మార్గాల్లో నడుపుతున్నారు.
భారీ వర్షాల నేపథ్యంలో ముంబై-పుణె ఎక్స్ప్రెస్వే, అలాగే పాత ముంబై-పుణె జాతీయ రహదారిపై రాకపోకలను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. టన్నెల్-2 సమీపంలో కొండచరియలు విరిగిపడటం, కొన్ని ప్రాంతాల్లో వరద నీరు నిలిచిపోవడం వల్ల రవాణా పూర్తిగా స్తంభించింది. కనెక్టింగ్ లింక్ సమీపంలో కాంక్రీట్ స్తంభం రోడ్డుపై కూలిపోవడంతో ఎక్స్ప్రెస్వేను మూసివేశారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప ముంబై-పుణె మధ్య ప్రయాణాలు చేయవద్దని పోలీసులు సూచించారు. పరిస్థితులు మెరుగుపడే వరకు ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని, ప్రభుత్వ ట్రాఫిక్ సూచనలను తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేశారు.
విద్యాసంస్థలకు సెలవు
మరిన్ని భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ముంబై, పుణె, థానే, పాల్ఘర్ జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్, మున్సిపల్ పాఠశాలలు, కళాశాలలకు సోమవారం సెలవు ప్రకటించారు. ఇక పుణె జిల్లాలోని ఘోరవాడి రైల్వే స్టేషన్ సమీపంలో వరద నీటిలో చిక్కుకున్న ఓ ప్రైవేట్ బస్సులోని 37 మంది ప్రయాణికులను ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సురక్షితంగా రక్షించారు. రాష్ట్రవ్యాప్తంగా సహాయక బృందాలు అప్రమత్తంగా ఉండగా, ప్రజలు అవసరం లేని ప్రయాణాలు చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
- Tags
- Floods
- Maharashtra
- mumbai
- Pune
- rains
తాజావార్తలు
-
Mumbai: ముంబై, పూణె జలదిగ్బంధం.. వర్ష బీభత్సానికి 13 మంది మృతి
-
Nagarjuna: కొడుకు కోసం రంగంలోకి దిగిన కింగ్.. అఖిల్ ‘లెనిన్’ వెనుక నాగార్జున మాస్టర్ ప్లాన్!
-
Dowry harassment: ప్రేమ పెళ్లి చేసుకున్న కట్నం వేధింపులు తప్పలేదు.. 2 నెలలకే నవవధువు మృతి..
-
Aadi Srinivas : వారం కాదు.. 209 వారాలు కేసీఆర్ చేతిలోనే ఉంది.. కేటీఆర్కు ఆది శ్రీనివాస్ కౌంటర్
-
Vaibhav Sooryavanshi: పక్కా ప్లాన్తో బరిలోకి వైభవ్ సూర్యవంశీ.. ఆ రికార్డుపైనే గురి..
ట్రెండింగ్
-
IND Playing XI vs ENG: మూడో టీ20లో ఈ ముగ్గురు ఔట్.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే!
-
Ellyse Perry: లార్డ్స్లో ఇంగ్లండ్ను ఓడించాం.. ఆ మజానే వేరప్ప.. ఆస్ట్రేలియా అందం ఆనందం!
-
డ్యూయల్ 200MP కెమెరాలు, 8500mAh బ్యాటరలతో ఎంట్రీ ఇవ్వనున్న Xiaomi 18 Pro Max..!
-
Akriti Agarwal: చాలాసార్లు మోసపోయా.. ప్రతి రూమర్ నిజమే.. పృథ్వీ షా కాబోయే భార్య సంచలన వ్యాఖ్యలు!
-
Beth Mooney History: బెత్ మూనీ చరిత్ర.. అరుదైన డబుల్ రికార్డులు.. ధోనీ, రోహిత్, కోహ్లీలకు సాధ్యం కాలే!