Rangareddy: బట్టల వ్యాపారికి లేడీవాయిస్ తో ట్రాప్.. కిడ్నాప్ చేసి కోటి డిమాండ్..
- కొత్త మోసాలకు పాటుపడుతున్న కేటుగాళ్లు..
- లేడీస్ వాయిస్ తో కమర్షియల్ ప్లాట్ ఉందని అక్కడికి రావాలని ట్రాప్..
- బట్టల వ్యాపారిని కిడ్నాప్ చేసి కోటి రూపాయలు డిమాండ్ చేసిన దుండగులు..
Rangareddy: రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్లో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు సైబర్ నేరగాళ్లు సుమారు రాష్ట్రంలో రూ. 1500 కోట్లు కొట్టేశారంటే ఈ వార్త ప్రతి ఒక్కరికి షాకింగ్ కు గురిచేసింది. అంటే సగటున నెలకు రూ.150 కోట్లు అన్న మాట. విద్యావంతులు, ఉన్నతాధికారులు, పోలీసులను సైతం సైబర్ నేరగాళ్ల బారిన పడినవారే. ఈ ఆన్లైన్ మోసాల స్వభావం ఏమిటంటే, ఒక రకమైన నేరాల గురించి అవగాహన పెంచుకునేలోపే మరొక రకమైన సైబర్ మోసం వెలుగులోకి వస్తుంది. ఇలాంటి ఘటన రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
Read also: AlluArjun : పుష్ప 2లో ఆ మూడు బ్లాకులు అదిరిపోతాయట
Also Read
- Advocate Swapna M*urder: కత్తితో పొడిచి, బండరాయితో కొట్టి చంపిన సోదరుడు.. విచారణలో సంచలన విషయాలు!
- Bride Death: ఫిట్స్తో నవ వధువు మృతి.. అల్లుడిపై కేసు పెట్టిన అత్తింటివారు
- Telangana: ప్రాణాలు విడిచిన వారిని వరించిన విజయం..
- Chevella Bus Tragedy: బస్సు ప్రమాదంలో తల్లితో పాటు 3 నెలల చిన్నారి మృతి.. గుండెల్ని పిండేస్తున్న ఫోటో
రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో బట్టల వ్యాపారి కిడ్నాప్ కలకలం రేపింది. కొందరు సైబర్ కేటుగాళ్లు లేడీస్ వాయిస్ తో ఇబ్రహీంపట్నంకు చెందిన ఒక బట్టల వ్యాపారికి కాల్ చేశారు. ఔటర్ రింగ్ రోడ్ మెగా టౌన్ షిప్ వద్ద కమర్షియల్ ప్లాట్ ఉందని అక్కడికి రావాలని తెలిపారు. ఫ్లాట్ తక్కువ ధరకే ఉందని మీకు నచ్చుతుందని నమ్మబలికారు. అంతేకాకుండా ఒక్కసారి మీరు చూస్తే ఆ ఫ్లాట్ వదులుకోలేరని ట్రాప్ చేశారు. దీంతో కేటుగాళ్లు మాటలను నమ్మిన బట్టల వ్యాపారి వెంటనే మెగా టౌన్ షిప్ కి వెళ్ళాడు. కారు దిగిన బట్టల వ్యాపారి అటు చూస్తుండగానే కొందరు వెనుకనుంచి వచ్చి ఒక్కసారిగా తలకు గుడ్డ కట్టి కిడ్నాప్ చేశారు.
అతనిని రూమ్ లో బంధించి కోటి రూపాయలు ఇస్తే వదిలేస్తామని తెలిపారు. తలకు తుపాకీ పెట్టి బెదిరింపులకు పాల్పడ్డారు. ఇప్పటికి ఇప్పుడు డబ్బులు అంటే ఎలా అని ప్రశ్నించగా విలువైన డాక్యుమెంట్ల పైన సంతకాలు తీసుకొని బట్టల వ్యాపారిని ఔటర్ రింగ్ రోడ్ వద్ద వదిలేసి పారిపోయారు. బాధితుడు కుటుంబ సభ్యులకు ఫోన్ చేశాడు. అనంతరం ఆదిభట్ల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న దర్యాప్తు చేస్తున్నారు. బట్టల వ్యాపారిని ఎవరు కిడ్నాప్ చేశారు? అసలు లేడీ వాయిస్ తో ఎందుకు కాల్ చేశారు? అనే దానిపై ఆరా తీస్తున్నారు. ఫ్లాట్ కొనుగోలు వుందని పిలిచి విలువైన డాక్యుమెంట్లపై ఎందుకు సంతకాలు చేయించున్నారనే దానిపై ఆరా తీస్తున్నారు.
Visakhapatnam: ప్రేమోన్మాది వేధింపులకు యువ టీచర్ బలి..
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!