Ponguleti Srinivas Reddy : కాళేశ్వరం పాపాన్ని అసెంబ్లీ సాక్షిగా కడుక్కోవాలి.. కేసీఆర్, కేటీఆర్లపై పొంగులేటి ఫైర్
- అసెంబ్లీకి వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్
- కాళేశ్వరం నిర్మాణంపై బీఆర్ఎస్పై విమర్శలు
- డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై కాంగ్రెస్ హామీ
- పేదల సొంతింటి కల నెరవేరుస్తామన్న మంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ponguleti Srinivas Reddy : సిద్దిపేట వేదికగా రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్లపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడానికి లక్షల కోట్ల రూపాయల నిధులు వచ్చాయి కానీ, పేదవాడికి ఒక సొంత ఇల్లు కట్టించి ఇవ్వడానికి మాత్రం వారికి మనసు రాలేదని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది వాళ్లే, దాన్ని ఓపెన్ చేసింది వాళ్లే, చివరకు అది కూలిపోయింది కూడా వాళ్ల హయాంలోనేనని మంత్రి గుర్తుచేశారు. ఇప్పుడు వాళ్లే కాళేశ్వరం దగ్గరకు పోయి తామేదో చేశామంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రాజెక్టులో నీళ్లు నిల్వ ఉంచితే కింద ఉన్న ప్రాంతమంతా కొట్టుకుపోతుందని ఎన్డీఎస్ఏ (NDSA) హెచ్చరించినా, బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్న తీరు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఎద్దేవా చేశారు.
అసెంబ్లీకి వచ్చి సమాధానం చెప్పాలి
ప్రాజెక్టు కట్టినప్పుడు గత పాలకులకు చిత్తశుద్ధి, నిజాయితీ ఉంటే కాళేశ్వరానికి ఈ గతి పట్టేది కాదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దుయ్యబట్టారు. కేవలం అధికారం కోసం కాంగ్రెస్ ప్రభుత్వంపై నిందలు మోపడం ఆపాలని హితవు పలికారు. “కాళేశ్వరం ప్రపంచంలోనే ఎనిమిదో వింత అన్న పెద్దమనిషి (కేసీఆర్) ఇప్పటికైనా అసెంబ్లీకి రావాలి. కాళేశ్వరాన్ని ఎలా కట్టారో సమాధానం చెప్పి.. తాము చేసిన పాపాన్ని అసెంబ్లీ సాక్షిగా కడుక్కోవాలి” అని సవాల్ విసిరారు. వారు ఏవైనా సలహాలు, సూచనలు ఇవ్వాలనుకుంటే అసెంబ్లీ వేదికగా చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామని, కేసీఆర్ సభకు వచ్చి కాళేశ్వరంపై పూర్తి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Also Read
- Aadi Srinivas : వారం కాదు.. 209 వారాలు కేసీఆర్ చేతిలోనే ఉంది.. కేటీఆర్కు ఆది శ్రీనివాస్ కౌంటర్
- Suicide on Video Call : వీడియో కాల్లోనే విషాదం.. భార్య చూస్తుండగానే భర్త ఆత్మహత్య
- CM Revanth: టూరిజం రంగంలో భారీ మార్పులకు శ్రీకారం.. సీఎం కీలక నిర్ణయాలు.!
- Ramchander Rao: కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయి.. బీజేపీ అధ్యక్షుడు ఫైర్.!
తల తాకట్టు పెట్టి అయినా పేదల ఇళ్ల కల నెరవేరుస్తాం
బీఆర్ఎస్ హయాంలో పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను అసంపూర్తిగా కట్టి మధ్యలోనే వదిలేశారని మంత్రి పొంగులేటి ఆరోపించారు. గుడిసెలు లేని తెలంగాణను నిర్మించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం వదిలేసిన ఆ అసంపూర్తి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను అన్నింటినీ రిపేర్ చేసి త్వరలోనే పేదలకు అందిస్తామని భరోసా ఇచ్చారు. అవసరమైతే తల తాకట్టు పెట్టి అయినా సరే, అర్హులైన ప్రతి పేదవాడి సొంత ఇంటి కలను నెరవేర్చడమే తమ ఇందిరమ్మ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పునరుద్ఘాటించారు.
తాజావార్తలు
-
Ponguleti Srinivas Reddy : కాళేశ్వరం పాపాన్ని అసెంబ్లీ సాక్షిగా కడుక్కోవాలి.. కేసీఆర్, కేటీఆర్లపై పొంగులేటి ఫైర్
-
Delete Autopay: ఆటోపే ఆప్షన్ పెట్టి మర్చిపోయారా..? అయితే సింపుల్గా ఒకే దగ్గర క్యాన్సిల్ చేసుకోండిలా..
-
Naga Vamsi: “మేం కంటెంట్ ఓనర్లం.. ఎప్పుడు డ్యామేజ్ చేయాలో మాకు తెలుసు!”.. నాగవంశీ షాకింగ్ కామెంట్స్!
-
IMD Rain Alert: ఈ రాష్ట్రాలకు అతి భారీ వర్ష సూచన.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
-
Ram Mandir: రామ మందిర ట్రస్ట్లో సంచలనం.. చంపత్ రాయ్ రాజీనామా ఆమోదం
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో వచ్చే రోగాలకు బై..బై.. 5 అద్భుతమైన ఇంటి చిట్కాలు.!
-
IND Playing XI vs ENG: మూడో టీ20లో ఈ ముగ్గురు ఔట్.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే!
-
Ellyse Perry: లార్డ్స్లో ఇంగ్లండ్ను ఓడించాం.. ఆ మజానే వేరప్ప.. ఆస్ట్రేలియా అందం ఆనందం!
-
డ్యూయల్ 200MP కెమెరాలు, 8500mAh బ్యాటరలతో ఎంట్రీ ఇవ్వనున్న Xiaomi 18 Pro Max..!
-
Akriti Agarwal: చాలాసార్లు మోసపోయా.. ప్రతి రూమర్ నిజమే.. పృథ్వీ షా కాబోయే భార్య సంచలన వ్యాఖ్యలు!