Ponguleti Srinivas Reddy : కాళేశ్వరం పాపాన్ని అసెంబ్లీ సాక్షిగా కడుక్కోవాలి.. కేసీఆర్, కేటీఆర్లపై పొంగులేటి ఫైర్
- అసెంబ్లీకి వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్
- కాళేశ్వరం నిర్మాణంపై బీఆర్ఎస్పై విమర్శలు
- డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై కాంగ్రెస్ హామీ
- పేదల సొంతింటి కల నెరవేరుస్తామన్న మంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ponguleti Srinivas Reddy : సిద్దిపేట వేదికగా రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్లపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడానికి లక్షల కోట్ల రూపాయల నిధులు వచ్చాయి కానీ, పేదవాడికి ఒక సొంత ఇల్లు కట్టించి ఇవ్వడానికి మాత్రం వారికి మనసు రాలేదని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది వాళ్లే, దాన్ని ఓపెన్ చేసింది వాళ్లే, చివరకు అది కూలిపోయింది కూడా వాళ్ల హయాంలోనేనని మంత్రి గుర్తుచేశారు. ఇప్పుడు వాళ్లే కాళేశ్వరం దగ్గరకు పోయి తామేదో చేశామంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రాజెక్టులో నీళ్లు నిల్వ ఉంచితే కింద ఉన్న ప్రాంతమంతా కొట్టుకుపోతుందని ఎన్డీఎస్ఏ (NDSA) హెచ్చరించినా, బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్న తీరు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఎద్దేవా చేశారు.
అసెంబ్లీకి వచ్చి సమాధానం చెప్పాలి
ప్రాజెక్టు కట్టినప్పుడు గత పాలకులకు చిత్తశుద్ధి, నిజాయితీ ఉంటే కాళేశ్వరానికి ఈ గతి పట్టేది కాదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దుయ్యబట్టారు. కేవలం అధికారం కోసం కాంగ్రెస్ ప్రభుత్వంపై నిందలు మోపడం ఆపాలని హితవు పలికారు. “కాళేశ్వరం ప్రపంచంలోనే ఎనిమిదో వింత అన్న పెద్దమనిషి (కేసీఆర్) ఇప్పటికైనా అసెంబ్లీకి రావాలి. కాళేశ్వరాన్ని ఎలా కట్టారో సమాధానం చెప్పి.. తాము చేసిన పాపాన్ని అసెంబ్లీ సాక్షిగా కడుక్కోవాలి” అని సవాల్ విసిరారు. వారు ఏవైనా సలహాలు, సూచనలు ఇవ్వాలనుకుంటే అసెంబ్లీ వేదికగా చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామని, కేసీఆర్ సభకు వచ్చి కాళేశ్వరంపై పూర్తి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Also Read
- Hash Oil : స్నాప్చాట్లో డ్రగ్స్ దందా.. ORR వద్ద పెడ్లర్ అరెస్ట్.!
- Bhatti Vikramarka : యూసీ బర్క్లీలో భట్టి విక్రమార్క.. తెలంగాణ క్లీన్ ఎనర్జీపై బిగ్ ప్లాన్.!
- Mephedrone Seized : బీబీనగర్లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. నలుగురు అరెస్ట్..!
- DGP Anand : నక్సలిజం పోయింది.. ఇప్పుడు డేంజర్ ఇదే.. డీజీపీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు
తల తాకట్టు పెట్టి అయినా పేదల ఇళ్ల కల నెరవేరుస్తాం
బీఆర్ఎస్ హయాంలో పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను అసంపూర్తిగా కట్టి మధ్యలోనే వదిలేశారని మంత్రి పొంగులేటి ఆరోపించారు. గుడిసెలు లేని తెలంగాణను నిర్మించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం వదిలేసిన ఆ అసంపూర్తి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను అన్నింటినీ రిపేర్ చేసి త్వరలోనే పేదలకు అందిస్తామని భరోసా ఇచ్చారు. అవసరమైతే తల తాకట్టు పెట్టి అయినా సరే, అర్హులైన ప్రతి పేదవాడి సొంత ఇంటి కలను నెరవేర్చడమే తమ ఇందిరమ్మ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పునరుద్ఘాటించారు.
తాజావార్తలు
-
PM Modi: ‘జో ఖేలేగా, వో ఖిలేగా’.. కామన్వెల్త్ పతక విజేతలతో మోడీ భేటీ, వీడియో వైరల్
-
Toxic Business : డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి యష్.. భారీ ధర పలికిన తెలుగు రైట్స్
-
Shakeel Noorani: నటిపై లైంగిక దాడి ఆరోపణలు.. 73 ఏళ్ల దర్శకుడి అరెస్ట్తో బాలీవుడ్లో కలకలం
-
Tadipatri Tension: తాడిపత్రిలో పొలిటికల్ హీట్.. వైసీపీ–టీడీపీ పోటాపోటీ కార్యక్రమాలు.. పోలీసుల నో పర్మిషన్..
-
Motorola Edge 70 Neo: మోటరోలా ఎడ్జ్ 70 నియో.. 200MP ట్రిపుల్ కెమెరాతో మోటరోలా కొత్త ఫోన్.. డిజైన్ లీక్
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!