EC Notices Pawan: పవన్ కళ్యాణ్కు ఈసీ నోటీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
EC Notices Janasena Chief: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఎన్నికల కమిషన్ (ఈసీ) నోటీసులు జారీ చేసింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి స్కాం స్టార్, లాండ్ గ్రాబర్, సాండ్ అండ్ లిక్కర్ ఎంపరర్ అంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేసిన పవన్ కు ఈసీ నోటీసులు ఇచ్చింది. ఈ కామెంట్స్ పై ఈ నెల 8వ తేదీన ఎలక్షన్ కమిషన్ కు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఫిర్యాదు చేశారు. ఎలక్షన్ కోడ్ ను ఉల్లంఘించారని ఈ సందర్భంగా ఈసీకి వైసీపీ ఫిర్యాదు చేయగా.. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను పరిశీలించిన ఈసీ.. 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేసింది.
Read Also: TDP vs BJP: ఎమ్మెల్యే అభ్యర్థి మెడలో నుంచి కండువా తీసేసిన మాజీ ఎమ్మెల్యే
Also Read
- Ketan Murder Case: "ఒక్క మాట చెబితే పెళ్లి ఆపేవాళ్లం".. కూతురు ఘాతుకంపై తల్లిదండ్రుల కన్నీటిపర్యంతం!
- రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
- Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’ అమరవీరుల పేర్లు ఇవే.. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆరుగురు వీరులు!
- Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ "పెసర గారెలు" చేసేయండి ఇలా.!
కాగా, అంతుకు ముందు ఏపీ ఎన్నికల్లో వీలైనంత ఎక్కువ సీట్లు దక్కించుకొని ప్రభుత్వంలో భాగం కావాలని జనసేన పార్టీ చూస్తుంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీతో పాటు బీజేపీతో కలిసి ఒక కూటమి ఏర్పాటు చేసిన పవన్ కళ్యాణ్ తను పిఠాపురం నుంచి పోటీ చేస్తుండటంతో పాటు మరో 20 ఎమ్మెల్యే సీట్ల నుంచి అభ్యర్థులను ఎన్నికల బరిలోకి దింపారు. కొన్ని ఎంపీ సీట్లు నుంచి కూడా అభ్యర్థులు బరిలో ఉన్నారు. అయితే జనసేన తరఫున స్టార్ క్యాంపైనర్లుగా ఎవరు ప్రచారం చేస్తారనే విషయం మీద ఈ రోజు అధికారికంగా జనసేన పార్టీ ప్రకటన చేసింది. అలాగే, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీతో పాటు పార్లమెంట్ ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేయడానికి స్టార్ క్యాంపెనర్లగా పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబుతో పాటు మాజీ క్రికెటర్ అంబటి రాయుడు, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్, సినీ- టీవీ నటుడు ఆర్కే నాయుడు అలియాస్ సాగర్, 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి, జబర్దస్త్ హైపర్ ఆది, గెటప్ శ్రీను స్టార్ క్యాంపెనర్లుగా వ్యవహరిస్తారని పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరఫున ఆ పార్టీ రాజకీయ కార్యదర్శి హరి ప్రసాద్ పేరుతో ఒక లేఖ విడుదల చేసింది.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi Debut: ఎంతో ప్రతిభ ఉన్నా.. వైభవ్ సూర్యవంశీకి అరంగేట్రం చేసే అర్హత ఉందా?
-
Ketan Murder Case: “ఒక్క మాట చెబితే పెళ్లి ఆపేవాళ్లం”.. కూతురు ఘాతుకంపై తల్లిదండ్రుల కన్నీటిపర్యంతం!
-
Muskan Pradhan: తాగొచ్చిన వరుడికి చెంపదెబ్బ.. ఇప్పుడు మహిళలకు మార్గదర్శి! కౌన్సెలర్గా నియమితురాలైన ముస్కాన్
-
Asha Bhosle : ఆశా భోస్లేకు బ్రిటిష్ బ్యాండ్ గొరిల్లాజ్ ఘన నివాళి.. లండన్ స్టేడియంలో భావోద్వేగ క్షణాలు
-
NRI: అంతిమ శ్వాస భారత్లోనే… అమెరికా పౌరసత్వం ఉన్న బాపట్ల వృద్ధురాలి కన్నీటి విజ్ఞప్తి!
ట్రెండింగ్
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!