Bandi Sanjay: ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ గురించి బండి సంజయ్ ఏమన్నారో తెలుసా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandi Sanjay: పాకిస్థాన్ పై ఇండియా విజయం సాధించిన నేపథ్యంలో కరీంనగర్ లోని టవర్ సర్కిల్ నుంచి బీజేపీ నేతలు, కార్యకర్తలు ర్యాలీ చేపట్టారు. టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ ర్యాాలీలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచకప్ క్రికెట్ మ్యాచ్ లో భారత్-పాకిస్థాన్ పై ఘనవిజయం సాధించడం సంతోషకరమని అన్నారు. దేశభక్తులు, క్రికెట్ అభిమానులు ఈ మ్యాచ్ కోసం ఉత్కంఠగా ఎదురు చూశారని తెలిపారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా మ్యాచ్ చూసారన్నారు. ఇంతటి ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో ఇండియా విజయం సాధించడం సంతోషమని.. ఈ విజయంతో దేశం అంతా సంబరాలు చేసుకుంటున్నారని తెలిపారు. కొంతమంది మూర్ఖులు పాకిస్తాన్ ఓడిందని బాధపడుతున్నారని.. గతంలో కొందరు కరీంనగర్ లో ఇలాగే చేస్తే వీపులు సాఫ్ చేశామన్నారు. అలాగే కొందరు షాపింగ్ మాల్స్ పేరుతో హైదరాబాద్ లో పాకిస్తాన్ జెండాలు ప్రదర్శిస్తున్నారని బండి సంజయ్ తెలిపారు. లవ్ జిహాద్ పేరుతో ప్రత్యేక శిక్షణ పొంది హిందూ అమ్మాయిలను ట్రాప్ చేస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. హైదరాబాద్ లో పాకిస్తాన్ జెండా ప్రదర్శించిన షాపింగ్ మాల్ మూసివేయాలన్నారు.
Read Also: Revanth Reddy: రెండు నెలలు ఓపిక పట్టండి.. నిరుద్యోగులకు రేవంత్ భరోసా
Also Read
- Reliance Ice Cream: ఇక నుంచి మార్కెట్లో రిలయన్స్ ఐస్ క్రీం.. కేవలం రూ.10 లకే..
- AP SIR Voter List Revision: ఎస్ఐఆర్ షెడ్యూల్లో మార్పులు.. కీలక తేదీలు ఇవే..
- Team India Squad: ఆఫ్ఘనిస్తాన్తో టీ20 సిరీస్కు భారత్ జట్టు ప్రకటన.. కొత్త వాళ్లకు చోటు..
- RBI New Loan Rules: లోన్ తీసుకునేవారికి RBI గుడ్న్యూస్.. కొత్త నిబంధనలతో భారీ మార్పులు
ప్రవళిక మరణం తరువాత తల్లిదండ్రులు క్షోభ పడ్డారని బండి సంజయ్ అన్నారు. పోలీసుల తప్పుడు ప్రకటన తర్వాత అంతకంటే ఎక్కువగా క్షోభ పడుతున్నారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం మీద వ్యతిరేకతను తప్పించుకునేందుకు మానవత్వం లేని మానవ మృగాల మాదిరిగా చనిపోయిన అమ్మాయి మరణాన్ని హేళన చేస్తున్నారని మండిపడ్డారు. యువత కోసం కొట్లాడి జైల్ కి పోయిన మీ అన్న గా చెబుతున్నా.. ఊర్లకు వెళ్ళండి ప్రభుత్వ మోసాన్ని చెప్పండని తెలిపారు. వచ్చేది బీజేపీ ప్రభుత్వమే.. అధికారంలోకి వచ్చిన ఆర్నెళ్లలోనే ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. యూనివర్సిటీలను, కోచింగ్ సెంటర్లను వీడండి.. 50 లక్షల మంది తలుచుకుంటే ఈ ప్రభుత్వం కూలడం ఖాయమని తెలిపారు. నిజాయితీ ఉన్నవాళ్లు సీబీఐ విచారణ కోరాలి… సిట్ విచారణతో ఏమి జరగదని పేర్కొన్నారు. పేపర్ లీక్ చేసిన వాళ్ళు రోడ్లపై దర్జాగా తిరుగుతున్నారు.. నిరుద్యోగులు చనిపోతున్నారని బండి సంజయ్ అన్నారు.
Read Also: IND vs PAK: పాకిస్తాన్పై భారత్ ఘన విజయం.. ఇండియా ఆల్రౌండ్ షో
తాజావార్తలు
-
Reliance Ice Cream: ఇక నుంచి మార్కెట్లో రిలయన్స్ ఐస్ క్రీం.. కేవలం రూ.10 లకే..
-
AP SIR Voter List Revision: ఎస్ఐఆర్ షెడ్యూల్లో మార్పులు.. కీలక తేదీలు ఇవే..
-
Team India Squad: ఆఫ్ఘనిస్తాన్తో టీ20 సిరీస్కు భారత్ జట్టు ప్రకటన.. కొత్త వాళ్లకు చోటు..
-
RBI New Loan Rules: లోన్ తీసుకునేవారికి RBI గుడ్న్యూస్.. కొత్త నిబంధనలతో భారీ మార్పులు
-
Pakistan Cricket Board: పాక్ క్రికెట్లో మరో సంక్షోభం.. సెలెక్టర్ పదవికి మిస్బా-ఉల్-హక్ గుడ్బై
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!