Revanth Reddy: రెండు నెలలు ఓపిక పట్టండి.. నిరుద్యోగులకు రేవంత్ భరోసా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Revanth Reddy: తెలంగాణ ప్రజలు మరో రెండు నెలలు ఓపిక పట్టండి.. డిసెంబర్ 9న ప్రజా ప్రభుత్వం ఏర్పడబోతోందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ.. నిర్దిష్టమైన ఆలోచనలతో, ప్రణాళిక బద్దంగా కాంగ్రెస్ పాలన ఉంటుందని రేవంత్ రెడ్డి అన్నారు. భావోద్వేగంతో నిరుద్యోగ యువత ప్రాణాలు తీసుకోవద్దన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతోందని మండిపడ్డారు. డిసెంబరు 9 నుంచి యువత జీవితాల్లో వెలుగులు తెస్తామని హామీ ఇచ్చారు. కేసీఆర్ గద్దె దిగడమే అన్ని సమస్యలకు పరిష్కారమని పేర్కొన్నారు. ప్రజలకు ప్రజాస్వామ్యాన్ని అందించే బాధ్యతను కాంగ్రెస్ తీసుకుంటుందని.. ఆరు హామీలతో పాటు, ఇది రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చే మరో హామీ అని రేవంత్ రెడ్డి తెలిపారు.
Read Also: Chandrababu Arrest: చంద్రబాబు ఆరోగ్యం నిలకడగానే ఉంది.. ప్రభుత్వ వైద్యుల ప్రకటన
Also Read
- Mahua Moitra: కోర్టు విచారణకు డుమ్మా.. మహువా మొయిత్రాపై అరెస్ట్ వారెంట్ జారీ
- Operation Sindoor: ఆపరేషన్ సింధూర్లో ఆ 22 నిమిషాలు.. పాక్ స్పందించేలోపే సుఖోయ్ దాడి పూర్తి!
- MG Hector Tomahawk EV: 7 సీటర్ SUV సెగ్మెంట్లో గేమ్ఛేంజర్..! మహీంద్రా XEVకి పోటీగా కొత్త EV..
- Arunachal Pradesh: అరుణాచల్లో చైనా చొరబాటుపై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
ఈ నెల 18 నుంచి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తెలంగాణలో పర్యటించనున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. పర్యటన వివరాలు రేపు మధ్యాహ్నం వరకు అధికారికంగా ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితాను రేపు విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. అందులో 58 పేర్లను మాత్రమే ప్రకటించనున్నారు. నిన్న దాదాపు సగం మంది అభ్యర్ధులపై ఆమోదం లభించిందని రేవంత్ రెడ్డి తెలిపారు. మిగిలిన అభ్యర్దుల పేర్లను త్వరలోనే ఖరారు చేసి అధికారికంగా ప్రకటిస్తామని ఆయన అన్నారు.
Read Also: IMEEC: ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరప్ ఎకనామిక్ కారిడార్పై ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం ప్రభావం చూపిస్తుందా..?
తాజావార్తలు
-
Mahua Moitra: కోర్టు విచారణకు డుమ్మా.. మహువా మొయిత్రాపై అరెస్ట్ వారెంట్ జారీ
-
Operation Sindoor: ఆపరేషన్ సింధూర్లో ఆ 22 నిమిషాలు.. పాక్ స్పందించేలోపే సుఖోయ్ దాడి పూర్తి!
-
Telangana: సినిమా టికెట్లపై సరికొత్త జీవో: ‘స్పెషల్ థియేటర్స్’ కేటగిరీ.. రోజూ 5 షోలకు గ్రీన్ సిగ్నల్!
-
Door Lock Care Tips: వానలకు మీ ఇంటి తాళాలు పాడవుతున్నాయా? ఈ సింపుల్ ట్రిక్స్తో కొత్తవాటిలా మెరిపించండి!
-
Duddilla Sridhar Babu: మంథనిలో అభివృద్ధి పనుల జాతర.. రూ.164 కోట్లతో శంకుస్థాపనలు
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!