Railway Rules: ట్రైన్ లో ఎలక్ట్రిక్ కెటిల్ వాడితే.. ఎన్నేళ్ల జైలు శిక్ష విధిస్తారో తెలుసా?
- ఎలక్ట్రిక్ కెటిల్లో మ్యాగీ తయారీ ఘటనపై భారతీయ రైల్వే తీవ్ర ఆగ్రహం
- రైలులో ఎలక్ట్రిక్ కెటిల్ వాడటం వల్ల భారీ జరిమానా, శిక్ష
- ఎన్నేళ్ల జైలు శిక్ష విధిస్తారో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సామాన్యుడి నేల విమానంగా ప్రాధాన్యత సంతరించుకున్న ట్రైన్ జర్నీకి డిమాండ్ ఎక్కువ. సుదూర ప్రయాణాలకు రైలులో ప్రయాణించడానికే ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. తక్కువ ఛార్జీలు, సమయం ఆదా అవుతుండడం కూడా మరోకారణం. అయితే భారతీయ రైల్వే ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందిస్తున్నప్పటికీ కొందరు మాత్రం రూల్స్ ధిక్కరిస్తూ రైల్వే ఆస్తులకు నష్టంవాటిల్లే విధంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల ఓ మహిళ రైలు కోచ్లోనే ఎలక్ట్రిక్ కెటిల్లో మ్యాగీ తయారు చేస్తున్నట్లు కనిపించింది. వీడియో వెలుగులోకి వచ్చిన తర్వాత, రైల్వేలు దీనిపై తీవ్రంగా స్పందించాయి. రైలులో ఎలక్ట్రిక్ కెటిల్ వాడటం వల్ల భారీ జరిమానా, శిక్ష కూడా విధించబడుతుందని మీకు తెలుసా? ఎన్నేళ్ల జైలు శిక్ష విధిస్తారో తెలుసా? ఆవివరాలు మీకోసం..
Also Read:Top Selling Motorcycles: మరోసారి సత్తా చాటిన బడ్జెట్ బైక్.. అమ్మకాల్లో టాప్ 10 బైకులు ఏవంటే..?
Also Read
ఎలక్ట్రిక్ కెటిల్లో మ్యాగీ తయారీ ఘటనపై రైల్వేలు తీవ్రంగా స్పందించాయి. సంబంధిత వ్యక్తిపై చర్యలు తీసుకోనున్నట్లు తెలిపాయి. రైళ్ల లోపల ఎలక్ట్రానిక్ కెటిల్స్ ఉపయోగించడం నిషేధించారు. ఇది సురక్షితం కాదు, చట్టవిరుద్ధం, శిక్షార్హమైన నేరం. ఇలా చేయడం వల్ల ట్రైన్ లో మంటలకు కారణమవుతుంది, ఇతర ప్రయాణీకులకు హానికరం కావచ్చు. ఇది రైలులో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగించవచ్చు. AC, ఇతర ఎలక్ట్రానిక్ పోర్టులలో పనిచేయకపోవడానికి కారణమవుతుంది. ప్రయాణీకులు అలాంటి ప్రమాదకరమైన పనులకు దూరంగా ఉండాలని సూచించారు.
రైలు విద్యుత్ సరఫరా గృహ వ్యవస్థ లాంటిది కాదని గమనించాలి, అందుకే లోడ్ స్థిరంగా ఉంటుంది. కోచ్ వైరింగ్ తదనుగుణంగా చేస్తారు. ఇది కోచ్ సిస్టమ్ లైన్లపై ఒత్తిడిని పెంచుతుంది, ఓవర్లోడింగ్ ప్రమాదాన్ని సృష్టిస్తుంది. రైలులో విద్యుత్ పరికరాలను ఉపయోగించడం వల్ల స్పార్క్స్, విరిగిన బ్రేకర్లు లేదా పొగలు వస్తాయి. అందుకే, ప్రయాణీకుల భద్రత కోసం, మొబైల్ ఫోన్లు, పవర్ బ్యాంకులు, ల్యాప్టాప్లు వంటి తక్కువ-వోల్టేజ్ పరికరాలకు మాత్రమే రైలులో ఛార్జ్ చేయడానికి అనుమతి ఉంది.
Also Read:KTR : నమ్మించి తడిగుడ్డతో గొంతు కోసిన కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాలి.
రైలులో ఏదైనా హై-వోల్టేజ్ విద్యుత్ పరికరాలను ఆపరేట్ చేయడం నిబంధనల ఉల్లంఘన అని గమనించాలి. రైలులో ఎలక్ట్రిక్ కెటిల్ లేదా ఇలాంటి హై-వోల్టేజ్ పరికరాలను ఆపరేట్ చేస్తూ పట్టుబడిన ఎవరికైనా రైల్వే చట్టం ప్రకారం జరిమానా విధిస్తారు. జరిమానా మొత్తం కేసు తీవ్రతను బట్టి ఉంటుంది. నివేదికల ప్రకారం, రైల్వే చట్టంలోని సెక్షన్ 153 ప్రకారం జరిమానా, ఆరు నెలల వరకు జైలు శిక్షను విధిస్తారు. అలాంటి చర్యలు అగ్ని ప్రమాదానికి కారణమైతే, సెక్షన్ 154 వర్తించవచ్చు, ఇది జరిమానా, రెండు సంవత్సరాల వరకు జైలు శిక్షను విధిస్తారు.
తాజావార్తలు
-
RCB: పాయింట్ల పట్టికలో టాప్లో ఉన్నా.. ఆర్సీబీ కంటే ఆ జట్టుకే ప్లే ఆఫ్ అవకాశాలు..
-
White House: చైనాలో ట్రంప్ టూర్.. హార్ముజ్ జలసంధిపై వైట్హౌస్ కీలక ప్రకటన
-
Health Tips : పార్టీ చేసుకున్న మరుసటి రోజే జిమ్కు వెళ్తున్నారా..? అయితే జాగ్రత్త..!
-
Haji Ali Ship: హోర్ముజ్ జలసంధిలో ఘోరం.. భారత నౌకను ముంచేసిన డ్రోన్ దాడి!
-
Phool Gobi Yakhni Recipe : ఘుమఘుమలాడే కాశ్మీరీ వంటకం.. పూల్ గోబీ యఖ్నీ తయారీ విధానం..!
ట్రెండింగ్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?