Chhattisgarh Drug Bust: సినిమా ఫక్కీలో నల్లమందు సాగు.. పొలానికి సెక్యూరిటీగా బౌన్సర్లు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chhattisgarh Drug Bust: సాధారణంగా సెలబ్రిటీల దగ్గరో, పబ్ల దగ్గరో బౌన్సర్లను చూస్తాం. కానీ ఒక రైతు తన పొలానికి బౌన్సర్లను కాపలా పెట్టాడు. లోపలికి ఎవరూ రాకుండా జెడ్ ప్లస్ సెక్యూరిటీని ఏర్పాటు చేశాడు. అసలు ఆ పొలంలో అంతటి విలువైన పంట ఏం పండుతోంది? పోలీసులు అక్కడికి వెళ్లినప్పుడు కనిపించిన దృశ్యం చూసి ఎందుకు షాక్ అయ్యారో ఈ స్టోరీలో తెలుసుకుందాం. ఛత్తీస్గఢ్లోని దుర్గ్ జిల్లాలో పోలీసులు చేపట్టిన భారీ ఆపరేషన్ ఒక పెద్ద డ్రగ్ రాకెట్ను బట్టబయలు చేసింది. అక్రమ నల్లమందు సాగును కాపాడటానికి బౌన్సర్లను నియమించుకున్న ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
Also Read
- AP Cabinet: ఏపీ కేబినెట్ భేటీ.. పవన్ కల్యాణ్ సహా ఐదుగురు మంత్రుల డుమ్మా..!
- BCCI: "చేసిన ప్రయోగాలు చాలు.. నువ్వు వెళ్ళిపోరా బాబు".. గౌతమ్ గంభీర్పై వేటుకు బీసీసీఐ సిద్ధం..?
- England vs India: చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్ .. చెత్త రికార్డులు మూటగట్టుకున్న టీమిండియా..
- Car Crash: నటుడి ఇంట్లోకి దూసుకెళ్లిన కారు.. యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.!
పలు నివేదికల ప్రకారం.. నిందితులు సుమారు 5 ఎకరాల వ్యవసాయ భూమిలో అత్యంత రహస్యంగా నల్లమందు సాగు చేస్తున్నారు. పోలీసులతో పాటు అపరిచితులు ఎవరూ లోపలికి రాకుండా ఉండేందుకు పొలం చుట్టూ భారీకాయులైన బౌన్సర్లను మోహరించారు. విషయం తెలుసుకొని అధికారులు పొలానికి వెళ్లి నల్లమందును స్వాధీనం చేసుకున్నారు. అధికారులు స్వాధీనం చేసుకున్న ఈ నల్లమందు విలువ దాదాపు రూ.8 కోట్లు ఉంటుందని అంచనా. నిందితుడికి చెందిన 300 ఎకరాల భారీ పొలంలో మధ్యలో మొక్కజొన్న, అరటి తోటలు సాగు చేస్తూ, ఎవరికీ అనుమానం రాకుండా తోట మధ్యలో ఈ అక్రమ సాగును సాగించారు. ఈ అక్రమ సాగు వెనుక స్థానిక బీజేపీ నాయకుడు వినయ్ తామ్రాకర్ ప్రమేయం ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని అధికారులు తెలిపారు. దీంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేయగా, పార్టీ అధిష్టానం వెంటనే తామ్రాకర్ను బీజేపీ నుంచి బహిష్కరించింది.
దుర్గ్ పోలీసులు, క్రైమ్ బ్రాంచ్ సంయుక్తంగా ఈ కేసును విచారిస్తున్నాయి. ఈ సందర్భంగా పలువురు అధికారులు మాట్లాడుతూ.. స్వాధీనం చేసుకున్న నల్లమందు మొక్కలను నాణ్యత పరీక్షల కోసం ల్యాబ్కు పంపినట్లు తెలిపారు. ఇంత పెద్ద ఎత్తున సాగు చేయడానికి పెట్టుబడి ఎక్కడి నుంచి వచ్చింది? అన్న కోణంలో నిందితుడి బ్యాంక్ ఖాతాలను ఆరా తీస్తున్నట్లు సమాచారం. అక్కడ పండుతున్నది అక్రమ పంట అని తెలిసి కాపలా ఉన్నారా? లేక కేవలం డ్యూటీ మాత్రమే చేస్తున్నారా? అనే కోణంలో సెక్యూరిటీ సిబ్బందిని అధికారులు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం నిందితులపై NDPS చట్టం కింద కఠిన కేసులు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
READ ALSO: Karuppu: స్టార్ హీరోపై కేసు వేయనున్న డైరెక్టర్? కోలీవుడ్లో కలకలం రేపుతున్న ‘కరుప్పు’ వివాదం!
తాజావార్తలు
-
2026 Tata Harrier: టాటా హారియర్, సఫారీ స్టెల్త్ ఎడిషన్ విడుదల.. 13 JBL స్పీకర్లు, లెవెల్-2 ADASతో అదిరిపోయే ఫీచర్లు
-
Lenin : అఖిల్కు మాజీ వదిన కంగ్రాట్స్.. సోషల్ మీడియాలో సామ్ పోస్ట్ వైరల్
-
AP Cabinet: ఏపీ కేబినెట్ భేటీ.. పవన్ కల్యాణ్ సహా ఐదుగురు మంత్రుల డుమ్మా..!
-
BCCI: “చేసిన ప్రయోగాలు చాలు.. నువ్వు వెళ్ళిపోరా బాబు”.. గౌతమ్ గంభీర్పై వేటుకు బీసీసీఐ సిద్ధం..?
-
NPPA: సామాన్యుడికి భారీ ఉపశమనం.. రక్తపోటు నుంచి మధుమేహం వరకు.. 39 మందుల ధరలను నిర్ణయించిన ప్రభుత్వం
ట్రెండింగ్
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!