సామాన్యుడి నేల విమానంగా ప్రాధాన్యత సంతరించుకున్న ట్రైన్ జర్నీకి డిమాండ్ ఎక్కువ. సుదూర ప్రయాణాలకు రైలులో ప్రయాణించడానికే ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. తక్కువ ఛార్జీలు, సమయం ఆదా అవుతుండడం కూడా మరోకారణం. అయితే భారతీయ రైల్వే ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందిస్తున్నప్పటికీ కొందరు మాత్రం రూల్స్ ధిక్కరిస్తూ రైల్వే ఆస్తులకు నష్టంవాటిల్లే విధంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల ఓ మహిళ రైలు కోచ్లోనే ఎలక్ట్రిక్ కెటిల్లో మ్యాగీ తయారు చేస్తున్నట్లు కనిపించింది. వీడియో వెలుగులోకి వచ్చిన తర్వాత, రైల్వేలు దీనిపై…