DMK MP A. Raja: లౌకికవాదాన్ని బోధిస్తున్న బీజేపీకి.. ఒక్క ముస్లిం ఎంపీ కూడా లేరు?
- బీజేపీపై డీఎంకే ఎంపీ ఎ. రాజా విమర్శలు
- ఒక్క ముస్లిం ఎంపీ కూడా లేని పార్టీ బీజేపీ
- ఈ బిల్లును తీసుకురావడం విడ్డూరంగా ఉంది
- వీరు లౌకికవాదాన్ని బోధిస్తున్నారని విమర్శ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వక్ఫ్ సవరణ బిల్లును ఈరోజు లోక్సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లును ఆమోదించడానికి ఎన్డీఏ సిద్ధం కాగా.. ఇండియా బ్లాక్ మాత్రం దీనికి వ్యతిరేకంగా ఉంది. లోక్ సభలో వక్ఫ్ సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా డీఎంకే ఎంపీ ఎ. రాజా భారతీయ జనతా పార్టీపై విమర్శలు గుప్పించారు. ఒక్క ముస్లిం ఎంపీ కూడా లేని పార్టీ మైనారిటీల హక్కులను కాపాడేందుకు ఈ బిల్లును తీసుకురావడం విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు. ఈ బిల్లును ప్రవేశపెట్టగల లేదా దాని లక్ష్యాన్ని సమర్థించగల ముస్లిం ఎంపీ బీజేపీలో లేరని, ఇప్పుడు వారు మనకు లౌకికవాదాన్ని బోధిస్తున్నారని ఎంపీ రాజా అన్నారు. కొద్దిసేపటి క్రితం మంత్రి ధైర్యంగా ప్రసంగించారని .. రేపు మీరు మీ ప్రసంగ పాఠాన్ని జేపీసీ నివేదికతో పోల్చి చూడాలని తాను ధైర్యంగా చెబుతున్నానన్నారు. అది సరిపోలితే తాను ఈ సభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు.
READ MORE: Waqf Amendment Bill: 22 మంది సభ్యులు ఉన్న వక్ఫ్ బోర్డులో 10 మంది మాత్రమే ముస్లింలు?
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
వక్ఫ్ బిల్లును రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ, తమిళనాడు అసెంబ్లీ ఆమోదించిన తీర్మానాన్ని ఆయన ప్రస్తావించారు. ఈ సభ ద్వారా దేశం మొత్తంపై రాజకీయ బిల్లును రుద్దుతున్నారని అన్నారు. తమిళనాడు ఆమోదించిన తీర్మానాన్ని విస్మరిస్తే అది దేశ ఐక్యతపై ప్రశ్నార్థకం అవుతుందన్నారు.. వక్ఫ్ చట్టంలో సవరణ అంశం కూడా జేపీసీకి వెళ్లిందని ముస్లిం పర్సనల్ లా బోర్డు జనరల్ సెక్రటరీ అన్నారని గుర్తు చేశారు. జేపీసీ తన నివేదికను దాఖలు చేసిందని.. దీనికి వ్యతిరేకంగా 5 కోట్ల ఈ-మెయిల్స్ వచ్చాయని చెప్పారన్నారు. తమ అభిప్రాయం ప్రకారం.. ఈ బిల్లు ఇప్పుడు మరింత అభ్యంతరకరంగా మారిందని విమర్శించారు. తాము లేవనెత్తిన అభ్యంతరాలు ఏవీ అంగీకరించబడలేదన్నారు. వక్ఫ్ నిర్వహణ ఇప్పుడు ముస్లింల చేతులు వీడుతుందన్నారు. జేపీసీ కేవలం ఒక కపటం, మోసం అని అభిప్రాయపడ్డారు. ఈ బిల్లును ఉపసంహరించుకునే వరకు తాము శాంతియుతంగా నిరసన తెలుపుతామని స్పష్టం చేశారు.
READ MORE: LRS Date Extended: అప్పటివరకు ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లింపు గడువు పెంచిన ప్రభుత్వం
- Tags
- a raja
- bjp
- DMK
- INDIA Bloc
- JPC Report
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!