Nallamilli Ramakrishna Reddy: మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లితో బీజేపీ నేతల మంతనాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nallamilli Ramakrishna Reddy: ఏపీ ఎన్నికల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గోదావరి జిల్లాలో సమీకరణాలు మారుతున్నాయి. పొత్తులో భాగంగా మూడు పార్టీల మధ్య సీట్ల లెక్కలు పూర్తయ్యాయి. ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ మధ్య పొత్తు ఏర్పడిన నేపథ్యంలో, ప్రతి ఒక్కరికీ టికెట్ కేటాయించలేక ఈ మూడు పార్టీలు అసంతృప్త జ్వాలలను ఎదుర్కొంటున్నాయి. ఈ క్రమంలోనే టీడీపీ అసమ్మతి నేతలకు బీజేపీ గాలం వేస్తోంది. తనకు ప్రకటించిన సీట్ను బీజేపీకి ఇవ్వడంతో ఆవేదనతో ఉన్నారు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ప్రజల దగ్గరకు వెళ్తూ తనకు న్యాయం చేయాలని అడుతున్నారు. ఇది బీజేపీ అభ్యర్ధికి ఇబ్బందిగా మారింది. దీంతో రంగంలోకి దిగిన పురందేశ్వరి నల్లమిల్లిని బీజేపీలోకి లాగేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. పార్టీలోకి రావాలని నల్లమిల్లికి ఫోన్ చేసి ఆహ్వానించారు పురందేశ్వరి…. ఆమె ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరించిన ఆయన టీడీపీలోనే కొనసాగుతానని చెప్పారు. ఒకే కూటమిలో ఉంటూ ఒక పార్టీ నేతలకు ఇంకో పార్టీ గాలం విసరడం చర్చనీయాంశంగామారింది.
Read Also: CM YS Jagan: డ్రైవర్కు టికెట్ ఇస్తే తప్పేంటి?.. లారీ, ఆటో డ్రైవర్లతో సీఎం ముఖాముఖి
Also Read
- Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
- Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
- Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
- Modi-Putin: అంతులేని యుద్ధాన్ని ముగించండి.. పుతిన్కు మోడీ కీలక సందేశం
రామకృష్ణారెడ్డితో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరితో పాటు పలువురు బీజేపీ నేతలు ఫోన్లో మాట్లాడారు. బీజేపీ పార్టీలోకి రావాలని రామకృష్ణారెడ్డికి ఆహ్వానం పలికారు. బీజేపీలో చేరితే జాతీయ స్థాయిలో గుర్తింపుని ఇచ్చే పదవులు ఇస్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది. బీజేపీ ఆఫర్లను నల్లిమిల్లి రామకృష్ణా రెడ్డి సున్నితంగా తిరస్కరించారు. టీడీపీలోనే కొనసాగుతానని రామకృష్ణారెడ్డి నిర్ణయించుకున్నారు. మరోవైపు న్యాయం కోసం నల్లమిల్లి జిల్లా స్థాయి పర్యటన రెండు రోజులు వాయిదా వేసుకోవాలని పలువురు టీడీపీ అభ్యర్థులు ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం.
రేపటి నుంచి జిల్లా వ్యాప్తంగా న్యాయం కోసం నల్లమిల్లి పర్యటనలు చేయాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి టీడీపీని వీడి ఇండిపెండెంట్గా పోటీ చేయాలని అనపర్తి టీడీపీ శ్రేణులు ఒత్తిడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ అధిష్టానం నిర్ణయం కోసం రామకృష్ణారెడ్డి వేచి చూస్తున్నారు.
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!