Devineni Avinash: అవినీతి చేస్తే అరెస్ట్ చేయకుండా ముద్దు పెట్టుకుంటారా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చంద్రబాబు, లోకేష్ పై దేవినేని అవినాష్ తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్, దేవినేని అవినాష్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. టీడీపీ ఉనికిని కోల్పోతోందని ఆరోపించారు. లోకేష్ యువగళం పేరుతో వెళ్లిన ప్రతీ చోటా రెచ్చగొడుతున్నాడని అవినాష్ పేర్కొన్నారు. లోకేష్ రౌడీ షీటర్లు, గూండాలను తయారు చేసే ఫ్యాక్టరీలా టీడీపీని మార్చాడని దుయ్యబట్టారు. రౌడీయిజం, గూండాయిజం, అల్లర్లు చేస్తే పదవులిస్తానని లోకేష్ సిగ్గులేకుండా ఆఫర్లు ఇస్తున్నాడని తెలిపారు. ఏపీలో దొంగతనాలు, గంజాయి, మహిళలపై వేధింపులు, మర్డర్ కేసుల్లో టీడీపీ వాళ్లే ఉంటున్నారని చెప్పారు.
Read Also: G20 Summit 2023 LIVE UPDATES: జీ20 సదస్సు.. ఢిల్లీకి పలు దేశాల అధినేతలు
Also Read
- Viral Video: ‘గ్రౌండ్లో పరుగెత్తలేను.. నేను ముసలివాడిని అయిపోయాను’: ఎంఎస్ ధోనీ
- Jofra Archer: "ఇది ఐపీఎల్ కాదు".. టీమిండియా ఘోర పతనంపై జోఫ్రా ఆర్చర్ సంచలన వ్యాఖ్యలు!
- Fake Condoms: "కండోమ్"లను కూడా వదలని చైనా.. ఏకంగా 2 లక్షల నకిలీ మాల్ స్వాధీనం..
- Telangana Farmers: తెలంగాణ రైతులకు శుభవార్త.. రూ.10లతో యూరియా బుకింగ్..
యువగళం పాదయాత్రకు జనం రాక, నాయకులు లేక.. లోకేష్ యువగళం రౌడీలను రెచ్చగొడుతున్నాడని దేవినేని అవినాష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పుంగనూరులో చంద్రబాబు విధ్వంసం సృష్టిస్తే, భీమవరంలో లోకేష్ అదే విధ్వంసాన్ని కొనసాగించాడని తెలిపారు. విధ్వంసంలో తండ్రికి తగ్గ తనయుడిగా లోకేష్ వ్యవహరిస్తున్నాడని విమర్శించారు. టీడీపీ హయాంలో చేసిన అవినీతి పై చంద్రబాబు, లోకేష్ సమాధానం చెప్పాలన్నారు. 118 కోట్ల ముడుపుల పై ఎందుకు ఎవరూ స్పందించరని అవినాష్ ప్రశ్నించారు. బీజేపీ, పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడరని అన్నారు. అమరావతి ల్యాండ్ స్కామ్, టిడ్కో ఇళ్ల స్కామ్, స్కిల్ డెవలప్ మెంట స్కామ్ పై టీడీపీ, చంద్రబాబు సమాధానం చెప్పాల్సిందని అవినాష్ కోరారు.
Read Also: Asia Cup 2023: ఇండియా – పాకిస్తాన్ మ్యాచ్కే ఆ ఛాన్స్.. మిగతా మ్యాచ్లకు లేనట్టే..!
సీఎం జగన్ తన కుమార్తెల దగ్గరకు వెళితే టీడీపీ సిగ్గులేకుండా తప్పుడు మాటలు మాట్లాడుతోందని దేవినేని అవినాష్ అన్నారు. గతంలో సింగపూర్, మలేషియా, బ్యాంకాక్ ట్రిప్పులు చేసింది ఎవరని ప్రశ్నించారు. పంటి నొప్పి వస్తే సింగపూర్ వెళ్లింది ఎవరు.. హోటల్స్ బిజినెస్ కోసం సింగపూర్ వెళ్లింది మీరు కాదా అని ప్రశ్నించారు. సొంత ఖర్చుతో లండన్ వెళ్తే సీఎం జగన్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని టీడీపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల వద్దకు బాండ్ పేపర్లు తీసుకుని వెళ్లేందుకు టీడీపీ నేతలకు సిగ్గుందా అని తీవ్రంగా మండిపడ్డారు. 600 హామీలు ఇచ్చి చేసిన మోసం పై సమాధానం చెప్పండని.. అవినీతి చేస్తే చంద్రబాబును అరెస్ట్ చేయకుండా ముద్దు పెట్టుకుంటారా అని అవినాష్ అన్నారు.
తాజావార్తలు
-
Rajesh Sharma : ఫౌజీ షూటింగ్లో రాజేష్ శర్మకు విషపురుగు కాటు?.. అసలు నిజం బయటపెట్టిన పీఏ!
-
Viral Video: ‘గ్రౌండ్లో పరుగెత్తలేను.. నేను ముసలివాడిని అయిపోయాను’: ఎంఎస్ ధోనీ
-
Jofra Archer: “ఇది ఐపీఎల్ కాదు”.. టీమిండియా ఘోర పతనంపై జోఫ్రా ఆర్చర్ సంచలన వ్యాఖ్యలు!
-
Fake Condoms: “కండోమ్”లను కూడా వదలని చైనా.. ఏకంగా 2 లక్షల నకిలీ మాల్ స్వాధీనం..
-
Telangana Farmers: తెలంగాణ రైతులకు శుభవార్త.. రూ.10లతో యూరియా బుకింగ్..
ట్రెండింగ్
-
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్తో రానున్న Vivo T5 Lite 5G.!
-
బడ్జెట్లో ప్రీమియం అనుభవం.. 50MP Sony కెమెరా, 7000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Moto g77 Power భారత్లో లాంచ్.!
-
Pandu Mirapakaya Pachadi: ఏడాది పాటు నిల్వ ఉండే టేస్టీ ‘పండు మిరపకాయ పచ్చడి’.. ఈ కొలతలు ఫాలో అయితే చాలు!
-
6,500mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో ఎంట్రీకి సిద్దమైన iQOO Z11 Lite.!
-
45dB ANC, AI కాల్ రికార్డింగ్, 42 గంటల బ్యాటరీతో Nothing Ear (3a) TWS ఇయర్బడ్స్ లాంచ్..