Deputy CM Narayana Swamy : పుంగనూరు ఘటన బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పుంగనూరులో ఇటీవల చెలరేగిన హింస.. రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పోలీసులు-టీడీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం మొదలై.. చివరకు లాఠీ ఛార్జ్ వరకు వెళ్లింది. అయితే.. చిత్తూరు పుంగనూరు అల్లర్లపై జిల్లా కలెక్టర్, ఎస్పీలతో పాటు ప్రెస్ మీట్ లో ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి మాట్లాడుతూ.. పుంగనూరు ఘటనలో గాయపడ్డ పోలీసులకు, ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ ఘటన లో తీవ్రంగా గాయపడి ఒక కన్ను పోగొట్టుకొని, మరొక కన్ను కూడా పోగొట్టుకునే పరిస్ధితిలో ఉన్న రణధీర్ అనే కానిస్టేబుల్ కు పది లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. చంద్రబాబు, తన కుమారుడు ముఖ్యమంత్రి కాలేడన్న అక్కసుతోనే పధకం ప్రకారం, ముందస్తు ప్రణాళికతో అల్లర్లకు పురిగొల్పాడని ఆయన మండిపడ్డారు.
Also Read : Daya 2: ఆ అననుమానాలు తీర్చేసేది అప్పుడే.. దయా 2 రిలీజ్ అయ్యేది ఎప్పుడంటే?
Also Read
- Mamidikaya Pappucharu: 'మామిడికాయ పప్పుచారు' ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!
- KTR: పుష్కర తెలంగాణ ఇప్పుడు ముష్కరుల తెలంగాణగా మారిపోయింది.!
- Pawan Kalyan: ప్రెస్మీట్కు అయినా అనుమతి ఇస్తారా?.. పవన్ కల్యాణ్ సెటైర్లు!
- CM Revanth: తెలంగాణ రైజింగ్-2047తో ప్రపంచానికి గేట్వేగా తెలంగాణ.. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో సీఎం విజన్..!
అంతేకాకుండా.. ‘తాము అనుమతి పొందిన రూట్ ను మార్చి పోలిసులపై బీర్ బాటిళ్ళు, రాళ్ళు , కత్తులు, కటార్లతో దాడి చేసారు. ఇంత జరిగినా సమన్వయాన్ని పాటించి , ఎలాంటి ఫైరింగ్ లు లేకుడా అల్లర్లను అణచివేసిన చిత్తూరు ఎస్పీ ని అభినందిస్తున్నాం. ఇంత దారుణానికి పాల్పడిన చంద్రబాబును ఈ కేసులో A1 గా చేర్చాలి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ని చంద్రబాబు ఏమీ చేయలేడు. పోలీసులు ఎందుకు భయపడుతున్నాదో తెలియడం లేదు. చంద్రబాబును మొదటి ముద్దాయి ని చేయాలని డిమాండ్ చేస్తున్నాం. చంద్రబాబు నీచమైన, టెర్రరిజం, అభివృద్ది నిరోధక చరిత్ర. చంద్రబాబు హయాంలో ప్రజా సంకల్ప యాత్రలో చిన్న గొడవ జరగలేదు. భవిష్యత్తులో కూడా తన మనుషులను తానే చంపి అల్లర్లు సృష్టించాలని చూస్తున్నాడు. పాకిస్థాన్ లో బెనజీర్ బుట్టోను చేసినట్టే చంద్రబాబు ను చేయాలి. చిత్తూరు ఎస్పీ ని రెడ్ డైరీలో రాసామంటూ పేర్కొన్న లోకేష్ కు రాజకీయాలు తెలియదు. ఈలలేసుకుని తిరిగే పవన్ కల్యాణ్ కూడా పోలీసులపై జరిగిన దాడిని ఖండించకపోవడం శోచనీయం. మేము శాంతియుతంగా తిరుగుబాటు చేస్తాం. ఔరంగజేబుకు అన్నగా వ్యవహరిస్తున్న చంద్రబాబు జిల్లాలో పెద్ద ఎత్తున అల్లర్లకు పాల్పడే అవకాశం ఉన్నందున కలెక్టర్, ఎస్పీలు అప్రమత్తంగా ఉండాలి.’ అని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read : Mallu Ravi: గద్దర్ మరణం తెలంగాణ ప్రజానీకానికి తీరని లోటు
తాజావార్తలు
-
Bihar: 1992 నాటి కేసు.. 34 ఏళ్ల తర్వాత తీర్పు.. 84 ఏళ్ల వృద్ధుడిని దోషిగా తేల్చిన కోర్టు
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!
-
Psychology Facts: ప్రతి పనికీ 10నిమిషాలు ముందుగా వచ్చే వ్యక్తులు గురించి షాకింగ్ ఫ్యాక్ట్.. తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు!
-
Nikhil : స్వయంభు కోసం 45 రోజుల కఠినమైన శిక్షణ తీసుకున్న హీరో నిఖిల్
-
Samsung: సామ్ సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 8, ఫోల్డ్ 8 అల్ట్రా డిజైన్ లీక్.. 200MP కెమెరాతో రానున్నాయా?
ట్రెండింగ్
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!