Bhatti Vikramarka: నాణ్యమైన విద్యుత్ సంపూర్ణంగా అందించేందుకు సిద్ధంగా ఉన్నాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రంలోని రైతులు, వ్యాపారులు, వినియోగదారులందరికీ నాణ్యమైన విద్యుత్తును సంపూర్ణంగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రానున్న వేసవిలో విద్యుత్ సరఫరాకు సంబంధించిన ఏర్పాట్లపై సీఎండి రీజ్వితో కలిసి ట్రాన్స్కో ఎస్సీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా.. అత్యధిక విద్యుత్ డిమాండ్ ఉన్నా కూడా సరఫరా చేసే సామర్థ్యం ఉన్నప్పటికీ కొన్నిచోట్ల చిన్నపాటి ఇబ్బందులు వస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని భట్టి విక్రమార్క తెలిపారు. మెయింటెనెన్స్, ఓవర్ లోడ్ ఈ రెండు అంశాల సందర్భంలో ఇబ్బందులు వస్తున్నాయి.. వీటిని సమన్వయం చేసుకొని తక్కువ సమయంలో పరిష్కరిస్తే ఎలాంటి ఫిర్యాదులు ఉండవని పేర్కొన్నారు.
TS Govt: భారీగా టీచర్ పోస్టుల భర్తీకి తెలంగాణ సర్కార్ కసరత్తు..
Also Read
- ICC Rankings: ఆసియా కప్ దెబ్బకు ఐసీసీ ర్యాంకింగ్స్ తారుమారు.. టాప్లోకి దూసుకెళ్లిన ఇండియన్ ప్లేయర్స్..
- Saudi-Israel: హౌతీల నుంచి భారీ ముప్పు.. ఇజ్రాయెల్ సాయం కోరిన సౌదీ!
- Irctc Tickets Booking: OpenAI మరో సంచలనం.. ఏఐతో ఆటోమేటిక్గా రైలు టికెట్లు బుకింగ్
- Saudi-Houthis: దాడులు తీవ్రం చేసిన హౌతీలు.. అప్రమత్తంగా ఉండాలని పౌరులకు సౌదీ హెచ్చరిక
కమర్షియల్ ఏరియాలో మెయింటెనెన్స్ కోసం రాత్రివేళ లైన్ క్లియరెన్స్ (LC) తీసుకోవాలని డిప్యూటీ సీఎం సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఒక ప్రాంతం తర్వాత మరొక ప్రాంతాల్లో అది కూడా తక్కువ సమయం LC తీసుకోవాలని.. LC తీసుకునే సమయాన్ని ఆయా ప్రాంతాల్లోని వినియోగదారులకు ముందే తెలియజేయాలని కోరారు. ఎమ్మెల్యేలు, ఎంపీలతో స్థానిక విద్యుత్ అధికారులు మాట్లాడి డిమాండ్ కు తగినంతగా విద్యుత్ సరఫరా చేసే సామర్థ్యం ఉన్న విషయాన్ని వివరించాలని తెలిపారు. గత ఏడాదికి ఈ ఏడాదికి డిమాండ్ ఎంత పెరిగింది. ఆ మేరకు సప్లైని ఎలా పెంచుతున్నామని గణంకాలతో స్థానికంగా మీడియాకు అందించాలని కోరారు.
Indian 2 : ‘ఇండియన్ 2 ‘తెలుగు రైట్స్ ను సొంతం చేసుకున్న బడా నిర్మాతలు..
రానున్న మూడు నెలలు విద్యుత్ డిమాండ్ ఉంటుందన్న విషయాన్ని గమనంలో పెట్టుకొని.. గత నాలుగు నెలలుగా శాఖ పరంగా కసరత్తు చేసి ఏర్పాట్లు పూర్తి చేసుకున్నామని వివరించారు. రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా విద్యుత్ సరఫరాకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. గత పాలకులు చేసింది తక్కువ ప్రచారం ఎక్కువ చేసుకున్నారని.. కావాలని అసత్యాలు ప్రచారం చేసే వారిపై సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేయాలని అధికారులకు డిప్యూటీ సీఎం సలహా ఇచ్చారు. జిల్లా స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో తిరుగుతూ ఇటువంటి ఇబ్బందులు ఉన్న సీఎండికి ఆ తర్వాత తనకు తెలియజేయాలని.. తాము 24 గంటలు అధికారులకు అందుబాటులో ఉంటామని వీడియో కాన్ఫరెన్ లో డిప్యూటీ సీఎం భరోసా ఇచ్చారు. ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించేందుకు కాల్ సెంటర్ ను బలోపేతం చేయాలని… వినియోగదారుల నుంచి వచ్చే ప్రతి కాల్ ను రికార్డు చేయాలి, ఆ ఫిర్యాదులకు ఏ పరిష్కారం చూపారో ఎప్పటికప్పుడు తనకు తెలియజేయాలని అధికారులను ఆదేశించారు.
తాజావార్తలు
-
Erravalli Case : ఎర్రవల్లి పసుపు నీళ్ల వివాదంలో ప్రభుత్వానికి షాక్
-
ICC Rankings: ఆసియా కప్ దెబ్బకు ఐసీసీ ర్యాంకింగ్స్ తారుమారు.. టాప్లోకి దూసుకెళ్లిన ఇండియన్ ప్లేయర్స్..
-
Chandrasekhar Reddy: గేట్లు బద్దలు కొట్టి, సెక్యూరిటీని బెదిరించి.. అల్లు అర్జున్ మామ దౌర్జన్యం..?
-
Saudi-Israel: హౌతీల నుంచి భారీ ముప్పు.. ఇజ్రాయెల్ సాయం కోరిన సౌదీ!
-
Irctc Tickets Booking: OpenAI మరో సంచలనం.. ఏఐతో ఆటోమేటిక్గా రైలు టికెట్లు బుకింగ్
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?