Delhi floods: ఇంకా వరదల్లోనే ఢిల్లీ.. హథినికుండ్ బ్యారేజీ నుంచి మళ్లీ నీటి విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీలో వరద ముప్పు ఇంకా కొనసాగుతుంది. హథినికుండ్ బ్యారేజీ నుంచి మరోసారి నీటిని విడుదల చేయడంతో యమునా నది నీటిమట్టం పెరిగే అవకాశం ఉంది. బ్యారేజీ నుంచి విడుదల చేసిన నీరు రేపు సాయంత్రానికి ఢిల్లీకి చేరుకుంటుందని.. ఈ సందర్భంలో యమునా నీటిమట్టం 206.70 మీటర్లకు చేరుకోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు నీటిమట్టం పెరుగుతుందనే భయంతో ఢిల్లీ యంత్రాంగం లోతట్టు ప్రాంతాలను ఖాళీ చేయించింది. శుక్రవారం సాయంత్రం నది నీటిమట్టం 205.34 మీటర్లుగా నమోదవగా, శనివారం మధ్యాహ్నం 3 గంటలకు నీటిమట్టం స్వల్పంగా తగ్గుముఖం పట్టి 205.17గా నమోదైంది. అయితే ఈరోజు రాత్రికి నదిలో నీటిమట్టం పెరిగే అవకాశం ఉంది. రేపు సాయంత్రానికి యమునా నీటిమట్టం 206.70కి చేరుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీలో మరోసారి వరద ముప్పు పొంచి ఉంది.
Woman Suicide: మరో మహిళతో భర్త.. తట్టుకోలేక పిల్లలతో కలిసి రైలు కింద దూకి..!
Also Read
- Tarun Tejpal: అత్యాచార కేసులో సంచలన తీర్పు.. తేజ్పాల్కు 10 ఏళ్లు జైలుశిక్ష
- రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
- Harish Rao: సీఎం రేవంత్ రెడ్డి ఏ రోజూ జై తెలంగాణ అనలేదు.. మాజీ మంత్రి సంచలన ఆరోపణ..
- 6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
హథినికుండ్ బ్యారేజీ నుంచి శనివారం 2 లక్షల 9 వేల క్యూసెక్కుల నీటిని యమునాలోకి విడుదల చేసినట్లు సమాచారం. గత వారం.. యమునా నీరు ఢిల్లీలో భారీ విధ్వంసం సృష్టించింది. ఎర్రకోట, ఢిల్లీ సెక్రటేరియట్, అక్షరధామ్, మయూర్ బీహార్తో సహా అనేక ప్రాంతాలు మునిగిపోయాయి. ప్రస్తుతం యమునా నది నీటిమట్టం క్రమంగా తగ్గుముఖం పట్టడంతో బ్యారేజీ నుంచి నీటిని విడుదల చేశారు. కొండ ప్రాంతాలలో కురిసిన వర్షాల కారణంగా.. ఆ వరద నీరు హథినికుండ్ బ్యారేజీకి చేరుతుంది. దీంతో నీటిని విడుదల చేస్తున్నారు. అయితే ఆ నీరు ఢిల్లీకి చేరుకోవడానికి 24 గంటలకు పైగా సమయం పడుతుంది.
Fargana Hoque: బంగ్లాదేశ్ తరఫున తొలి సెంచరీ నమోదు.. రికార్డు బద్దలు
మరోవైపు ఘజియాబాద్లో హిండన్ నది కూడా ఉధృతంగా ప్రవహిస్తోంది. నదిలో నీటిమట్టం పెరుగుతుండడంతో లోతట్టు ప్రాంతాలకు వరద ముప్పు పొంచి ఉంది. హిందోన్ బీహార్, సిటీ ఫారెస్టర్ కాలనీ, కృష్ణ గౌశాల కాలనీ, నంద్ గ్రామ్ కాలనీ ప్రాంతాల్లోకి హిండన్ నది నీరు చేరింది. ఇక్కడ కూడా నది ఒడ్డున నివసించే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. నది ఒడ్డున చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు చేర్చేందుకు పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందం సహాయక చర్యలు చేపట్టింది.
తాజావార్తలు
-
Star Kids: ‘శ్రీనివాస మంగాపురం’ బాక్సాఫీస్ రిజల్ట్ స్టార్ వారసులకు హెచ్చరికేనా?
-
Tarun Tejpal: అత్యాచార కేసులో సంచలన తీర్పు.. తేజ్పాల్కు 10 ఏళ్లు జైలుశిక్ష
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
Harish Rao: సీఎం రేవంత్ రెడ్డి ఏ రోజూ జై తెలంగాణ అనలేదు.. మాజీ మంత్రి సంచలన ఆరోపణ..
-
Gautam Gambhir: మన హద్దులు దాటాలి.. శ్రీలంక టెస్ట్ సిరీస్కు ముందు టీమిండియాకు గంభీర్ వార్నింగ్
ట్రెండింగ్
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!