Woman Suicide: మరో మహిళతో భర్త.. తట్టుకోలేక పిల్లలతో కలిసి రైలు కింద దూకి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Woman Suicide: బీహర్లోని అర్రా జిల్లాలో రైలు ఢీకొని ఓ మహిళ మృతి చెందింది. భర్త మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే కోపంతో ఆ మహిళ తన ముగ్గురు చిన్నారులతో సహా రైలు ముందు దూకింది. ఈ ఘటనలో సదరు మహిళ మృతి చెందగా.. ముగ్గురు పిల్లలు గాయపడ్డారు. ఘటనా స్థలంలో ఉన్న ప్రయాణికులు, స్థానికులు గాయపడిన ముగ్గురు చిన్నారులను చికిత్స నిమిత్తం అర్రా సదర్ ఆస్పత్రికి తరలించారు. ఇందులో ఓ చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన చికిత్స కోసం పాట్నాకు తరలించారు. దానాపూర్-పీడీడీయూ రైల్వే సెక్షన్లోని అర్రా రైల్వే స్టేషన్లో ఉన్న ఈస్టర్న్ రైల్ ఓవర్ బ్రిడ్జి సమీపంలో ఈ ఘటన జరిగింది. హిమగిరి ఎక్స్ప్రెస్ రైలు కింద పడి ఆ మహిళ ఆత్మహత్య చేసుకుంది.
నవాడా పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసముంటున్న మనీష్ కుమార్, గుడియా దేవి దంపతులు. వీరికి ముగ్గురు పిల్లలు జ్యోతి కుమారి (13 ఏళ్లు), జయ కుమారి (10 ఏళ్లు), 9 ఏళ్ల కుమారుడు కౌశిక్ కుమార్ ఉన్నారు. మనీష్ కుమార్ వృత్తిరీత్యా డ్రైవర్ కాగా.. అతను ఓ ప్రైవేట్ వాహనం నడుపుతున్నాడు. వారి జీవితం సాఫీగా సాగుతున్న తరుణంలో మనీష్ కుమార్ మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో దంపతుల మధ్య గొడవలు జరుగుతుండేవి. మనీష్ కుమార్ గుడియా దేవిని, పిల్లలను తరచూ కొట్టేవాడు. ఈ నేపథ్యంలో ఆమె పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది.
Also Read
- Mohammed Siraj: కొలంబోలో 'డీఎస్పీ సాబ్' రచ్చ.. సరికొత్త లుక్తో మైదానంలో మెరిసిన సిరాజ్
- 7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
- Trent Boult విధ్వంసం.. యార్కర్తో బెయిర్స్టోకు షాక్.! 'బై-బై' సెలబ్రేషన్ వీడియో వైరల్.!
- Telangana High Court: "సమాజంలో ఎవరికైనా బాధ్యత ఉందా".. ఉచిత పథకాలపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు..
Also Read: Teacher Harassment: యువతిపై మాష్టారు లైంగిక వేధింపులు.. గుడ్డలూడదీసి మరీ..
తన పిల్లలతో సహా రైలు కింద దూకేసింది. ఈ ఘటనలో తల్లి చనిపోగా.. ముగ్గురు పిల్లలు గాయాలతో బయటపడ్డారు. గాయాలపాలైన పిల్లలను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. వీరికి ఆసుపత్రిలో చికిత్స జరుగుతోంది. గాయపడిన పిల్లల్లో కౌశిక్ కుమార్ పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన చికిత్స కోసం పాట్నాకు తరలించారు. అయితే ఈ ఘటనను ఫోన్లో ధ్రువీకరిస్తూ.. ఓ మహిళ తన ముగ్గురు పిల్లలతో రైలు ట్రాక్ దాటుతున్నట్లు సమాచారం అందిందని అర్రా రైల్వే స్టేషన్ ఆఫీసర్ పంకజ్ దాస్ తెలిపారు. ఇంతలో రైలు కింద పడి మహిళ మృతి చెందింది. కాగా అతని ముగ్గురు పిల్లలు గాయపడ్డారు. ప్రస్తుతం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించే పనిలో పోలీసులు నిమగ్నమై ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తాజావార్తలు
-
Mohammed Siraj: కొలంబోలో ‘డీఎస్పీ సాబ్’ రచ్చ.. సరికొత్త లుక్తో మైదానంలో మెరిసిన సిరాజ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
OG 2 Update: పవన్ కళ్యాణ్ ‘ఓజీ 2’ స్క్రిప్ట్ లాక్.. కానీ బిగ్ ట్విస్ట్!
-
Vu Glo Mini-LED TV: వీయూ గ్లో మినీ ఎల్ఈడీ టీవీ విడుదల.. 120Hz డిస్ప్లే, 50W సౌండ్తో కొత్త స్మార్ట్ టీవీ
-
Trent Boult విధ్వంసం.. యార్కర్తో బెయిర్స్టోకు షాక్.! ‘బై-బై’ సెలబ్రేషన్ వీడియో వైరల్.!
ట్రెండింగ్
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్లో లాంచ్..!