Aravind Kejriwal: సీపీఐ జాతీయ నాయకులతో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ భేటీ.. ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా చర్చలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aravind Kejriwal: కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్సుకి వ్యతిరేకంగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మద్దతు కూడగడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన బుధవారం సీపీఐ జాతీయ నాయకులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ పోరాటానికి మద్దతుగా ఉంటామని సీపీఐ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా వెల్లడించారు. కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ను తాము వ్యతిరేకిస్తున్నామని, ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వానికి అధికారం ఇవ్వడం లేదని రాజా మండిపడ్డారు. దేశ రాజధాని ఢిల్లీ, పుదుచ్చేరిలో కూడా ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయని.. ఢిల్లీ ప్రభుత్వానికి తాము అండగా ఉంటామన్నారు.
Read Also: Dogs Attack: ఐదేళ్ల బాలుడిపై వీధికుక్కల దాడి..
Also Read
- Nepal Floods: నేపాల్ వరదల్లో 160 మంది మృతి, 750 మందికి పైగా గల్లంతు
- Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు
- Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
- Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
సీపీఐ పార్టీ ఢిల్లీ ప్రజల కోసం తమకు మద్దతు తెలపడం సంతోషకరమని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. సీఎం అయ్యాక మొదటిసారి డి. రాజాను కలిశానని.. ఆర్డినెన్స్ కేవలం ఢిల్లీ కోసమే కాదు.. అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుందని తెలిపారు. బీజేపీయేతర పార్టీలు ఎక్కడ ఉంటే అక్కడ ఇలాంటి ఆర్డినెన్స్ భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉందని అన్నారు. కేంద్రం సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా పక్కన పెడుతుందని.. అధికారులను మార్చే అవకాశం, రాష్ట్ర ప్రభుత్వం నుండి కేంద్రం దూరం చేస్తుందని కేజ్రీవాల్ మండిపడ్డారు.
Read Also: TSRTC: టీ-24 టికెట్ ధరలు పెంపు.. ధరలు జూన్ 16 నుంచి అమలు
మరోవైపు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ.. కేజ్రీవాల్ మమ్మల్ని కలిసి మా మద్దతు కోరడం జరిగిందని తెలిపారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా కేంద్ర ప్రభుత్వం పక్కన పెడుతుందని నారాయణ ఆరోపించారు. ఎన్నికైన ప్రభుత్వం ఉండగా ప్రభుత్వాన్ని కాదని.. వారు నామినేట్ చేసిన గవర్నర్ ద్వారా పాలన కొనసాగించాలని చూస్తున్నారని తెలిపారు. ప్రజలచేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలకు మర్యాద లేకుండా పోతుందని దుయ్యబట్టారు. గవర్నర్ పదవి కేవలం నామినేటెడ్ పదవి మాత్రమేనని.. ఢిల్లీ గవర్నర్ ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్నారని నారాయణ ఆరోపించారు. అన్ని రాష్ట్రాల్లో బిజెపికి వ్యతిరేకంగా మాట్లాడిన పార్టీలపై ఐటి రైడ్స్ చేస్తున్నారని అన్నారు. కర్ణాటక ఫలితాల తర్వాత బిజెపికి దేశంలో వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని నారాయణ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారు జాగ్రత్త సుమీ!
-
Nepal Floods: నేపాల్ వరదల్లో 160 మంది మృతి, 750 మందికి పైగా గల్లంతు
-
NTR Dragon: ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ మూవీ క్రేజీ అప్డేట్.. ఫ్లాష్బ్యాక్లో ఊహించని ట్విస్ట్!
-
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..