TSRTC: టీ-24 టికెట్ ధరలు పెంపు.. ధరలు జూన్ 16 నుంచి అమలు
TSRTC బస్సు ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్ చెప్పింది. టీఎస్ఆర్టీసీ టికెట్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ పెరిగిన టికెట్ ధరలు అన్ని బస్సుల్లో లేవు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సిటీ బస్సుల్లో 24 గంటల పాటు ప్రయాణించేందుకు వెసులుబాటు కల్పించే T-24 టికెట్ ధరలు పెరిగాయి. ఈ టికెట్ ధర సాధారణ ప్రయాణికులకు రూ.90 నుంచి రూ.100కి పెంచారు. ఇక సీనియర్ సిటిజన్లకు టికెట్ ధర ప్రస్తుతం రూ.80 నుంచి రూ.90కి పెంచారు. ఈ మేరకు ఆర్టీసీ ఈడీ ఉత్తర్వులు జారీ చేసింది. పెరిగిన ధరలు జూన్ 16 నుంచి జూలై 31 వరకు అమల్లో ఉంటాయని టీఎస్ఆర్టీసీ అధికారులు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గతంలో సాధారణ ప్రయాణికులకు రూ.100గా ఉన్న టీ-24 టికెట్ ధర ఏప్రిల్ 26న రూ.90కి తగ్గించారు.80 సీనియర్ సిటిజన్స్ కోసం. తాజా నిర్ణయంతో పాత ధరలు అమల్లోకి రానున్నాయి.
Read also: Kakani Govardhan Reddy: నెల్లూరులో అడుగుపెట్టేసరికి యువగళం అట్టర్ ఫ్లాప్.. కాకాని కీలక వ్యాఖ్యలు
Also Read
- Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐపట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..
- Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
- Crime: ఇదేం దారుణం రా నాయనా.. బస్సు ఎక్కడికి వెళ్తుందని అడిగినందుకు వృద్ధుడి హత్య..
- Ashu Reddy: హైకోర్టును ఆశ్రయించిన అషురెడ్డి ..
కాగా.. ప్రయాణికులకు చేరువయ్యేందుకు టీఎస్ఆర్టీసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్డినరీ బస్సుల్లోనూ వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్ (వీటీఎస్) అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తోంది. ఈ సదుపాయాన్ని తీసుకోవడం ద్వారా ప్రయాణికులు బస్సు వచ్చే సమయాన్ని సులభంగా తెలుసుకోవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా తిరిగే 900 మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఈ విధానాన్ని ఇప్పటికే ప్రవేశపెట్టారు. ఇప్పుడు అన్ని సిటీ ఆర్డినరీ బస్సుల్లో తీసుకొచ్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ వ్యవస్థ అందుబాటులోకి వస్తే మొబైల్ యాప్ ద్వారా ప్రయాణికులు బస్సు సమయాలు, వివరాలు, బస్టాప్కు చేరుకోవడానికి ఎంత సమయం పడుతుందో ముందుగానే తెలుసుకోవచ్చు. ఈ వ్యవస్థ ప్రయాణికులు తమ ప్రయాణాన్ని ముందుగానే ప్లాన్ చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. తద్వారా బస్టాప్ల వద్ద వేచి ఉండాల్సిన అవసరం లేదు. అయితే త్వరలో ఈ వ్యవస్థ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
Amit shah Tour: అమిత్ షా పర్యటనకు తుఫాన్ ఎఫెక్ట్.. రద్దయ్యే అవకాశం..?
తాజావార్తలు
-
Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐపట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..
-
Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
-
Crime: ఇదేం దారుణం రా నాయనా.. బస్సు ఎక్కడికి వెళ్తుందని అడిగినందుకు వృద్ధుడి హత్య..
-
Ashu Reddy: హైకోర్టును ఆశ్రయించిన అషురెడ్డి ..
-
Shreyas Iyer: “నీ వల్ల కాదు అంటే తట్టుకోలేను”.. విమర్శకులకు శ్రేయస్ అయ్యర్ స్ట్రాంగ్ కౌంటర్..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!