TSRTC: టీ-24 టికెట్ ధరలు పెంపు.. ధరలు జూన్ 16 నుంచి అమలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TSRTC బస్సు ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్ చెప్పింది. టీఎస్ఆర్టీసీ టికెట్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ పెరిగిన టికెట్ ధరలు అన్ని బస్సుల్లో లేవు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సిటీ బస్సుల్లో 24 గంటల పాటు ప్రయాణించేందుకు వెసులుబాటు కల్పించే T-24 టికెట్ ధరలు పెరిగాయి. ఈ టికెట్ ధర సాధారణ ప్రయాణికులకు రూ.90 నుంచి రూ.100కి పెంచారు. ఇక సీనియర్ సిటిజన్లకు టికెట్ ధర ప్రస్తుతం రూ.80 నుంచి రూ.90కి పెంచారు. ఈ మేరకు ఆర్టీసీ ఈడీ ఉత్తర్వులు జారీ చేసింది. పెరిగిన ధరలు జూన్ 16 నుంచి జూలై 31 వరకు అమల్లో ఉంటాయని టీఎస్ఆర్టీసీ అధికారులు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గతంలో సాధారణ ప్రయాణికులకు రూ.100గా ఉన్న టీ-24 టికెట్ ధర ఏప్రిల్ 26న రూ.90కి తగ్గించారు.80 సీనియర్ సిటిజన్స్ కోసం. తాజా నిర్ణయంతో పాత ధరలు అమల్లోకి రానున్నాయి.
Read also: Kakani Govardhan Reddy: నెల్లూరులో అడుగుపెట్టేసరికి యువగళం అట్టర్ ఫ్లాప్.. కాకాని కీలక వ్యాఖ్యలు
Also Read
- Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
- IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
- Supreme Court: సెప్టెంబర్ 5న ఢిల్లీలో సీజేపీ నిరసన మార్చ్.. అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
- Vijayawada to Amaravati: విజయవాడ నుంచి అమరావతికి రాజబాట.. రూ.1000 కోట్లతో మరో బ్రిడ్జి..
కాగా.. ప్రయాణికులకు చేరువయ్యేందుకు టీఎస్ఆర్టీసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్డినరీ బస్సుల్లోనూ వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్ (వీటీఎస్) అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తోంది. ఈ సదుపాయాన్ని తీసుకోవడం ద్వారా ప్రయాణికులు బస్సు వచ్చే సమయాన్ని సులభంగా తెలుసుకోవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా తిరిగే 900 మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఈ విధానాన్ని ఇప్పటికే ప్రవేశపెట్టారు. ఇప్పుడు అన్ని సిటీ ఆర్డినరీ బస్సుల్లో తీసుకొచ్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ వ్యవస్థ అందుబాటులోకి వస్తే మొబైల్ యాప్ ద్వారా ప్రయాణికులు బస్సు సమయాలు, వివరాలు, బస్టాప్కు చేరుకోవడానికి ఎంత సమయం పడుతుందో ముందుగానే తెలుసుకోవచ్చు. ఈ వ్యవస్థ ప్రయాణికులు తమ ప్రయాణాన్ని ముందుగానే ప్లాన్ చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. తద్వారా బస్టాప్ల వద్ద వేచి ఉండాల్సిన అవసరం లేదు. అయితే త్వరలో ఈ వ్యవస్థ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
Amit shah Tour: అమిత్ షా పర్యటనకు తుఫాన్ ఎఫెక్ట్.. రద్దయ్యే అవకాశం..?
తాజావార్తలు
-
Allu Arjun : రాకా హైప్ ఓకే.. కంటెంట్ ఆ రేంజ్ లో లేక పోతే?
-
CM Revanth Reddy : హైదరాబాద్కు కొత్త రూపు.. మూడు కార్పొరేషన్ల లోగోలు
-
Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
-
IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
-
Kavitha : నిజామాబాద్ సభలో కవిత కన్నీళ్లు.. ఆ మాటలేంటి.?
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!