Indigo flight: విమానం 2 గంటలు ఆలస్యం.. ఏసీ పనిచేయక అల్లాడిపోయని ప్రయాణికులు
- ఢిల్లీలో విమానం 2 గంటలు ఆలస్యం
- ఏసీ పనిచేయక అల్లాడిపోయని ప్రయాణికులు
- ఇండిగో విమాన సంస్థపై ప్యాసింజర్స్ ఆగ్రహం
- క్షమాపణ చెప్పిన విమానయాన సంస్థ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అసలే హస్తినలో అధిక ఉష్ణోగ్రతలు.. ఇంకోవైపు కరెంట్ కోతలు.. మరోవైపు తాగునీటి కష్టాలు.. ఇలా దేశ రాజధాని ఢిల్లీలో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో విమానం రెండు గంటలు ఆగిపోయింది. ఒకవైపు ఉక్కపోత.. ఇంకోవైపు వేడిగాలులు. దీంతో విమానం లోపల ఏసీ లేక ప్రయాణికులు ఉక్కపోతతో అల్లాడిపోయారు. ఇక పిల్లలు, వృద్ధులైతే హడలెత్తిపోయారు. ఈ బాధలను భరించలేక ప్రయాణికులు మొబైల్లో వీడియోలు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

Also Read
- School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
- Jantar Mantar Protest: ప్రధాని మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో బిగ్ ట్విస్ట్
- AP Cabinet Meeting: రేపు ఏపీ కేబినెట్ భేటీ.. అజెండాలో అమరావతి.. కీలక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్..!
- SpaceX Rocket: చంద్రుడిని ఢీకొట్టిన స్పేస్ఎక్స్ రాకెట్! శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే..!
ఢిల్లీ నుంచి బెంగాల్లోని బాగ్డోగ్రా వెళ్లాల్సిన ఇండిగో విమానం 2 గంటలు ఆలస్యం అయింది. విమానం మధ్యాహ్నం 2:10 గంటలకు బయలుదేరి 4:10 గంటలకు ల్యాండ్ కావాల్సి ఉంది. అయితే విమానం విమానాశ్రయంలోని టార్మాక్పై రెండు గంటలు నిలిచిపోయింది. లోపలేమో ఏసీ లేదు. దీంతో ఉక్కపోతతో ఊపిరాడక ప్యాసింజర్స్ అల్లాడిపోయారు. ఇదిలా ఉంటే బెంగాల్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. కాంచన్జంగా ఎక్స్ప్రెస్ను మరో గూడ్స్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదం జరిగిన దగ్గరలోనే బాగ్డోగ్రా ఎయిర్పోర్టు ఉంది. సాంకేతిక కారణంతోనే ఫ్లైట్ ఆలస్యం అయిందని సిబ్బంది పేర్కొ్న్నారు. ఒకసారి ఇంజన్ సమస్య అని.. ఇంకోసారి ఇంధన సమస్య అని చెప్పారు. ఇలా సిబ్బంది తికమక సమాధానాలతో ప్రయాణికులు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బాగ్డోగ్రా విమానాశ్రయం పశ్చిమ బెంగాల్లోని సిలిగురి సమీపంలో ఉంది.
ఇది కూడా చదవండి: Yuva Rajkumar: యువ రాజ్కుమార్కి లైంగిక సమస్యలు.. హోటల్లో నటితో రెడ్ హ్యాండెడ్ గా దొరికి?
ఇక ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి విమానయాన సంస్థ క్షమాపణ చెప్పింది. అసౌకర్యానికి చింతిస్తున్నామని పేర్కొంది. గమ్యానికి చేరేందుకు ఏర్పాట్లు చేస్తామని తెలిపింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి: Gujarat: రైల్వే ట్రాక్పై సింహాలు.. ట్రైన్ ఆపి రక్షించిన లోకో పైలట్
తాజావార్తలు
-
School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
-
Jantar Mantar Protest: ప్రధాని మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో బిగ్ ట్విస్ట్
-
AP Cabinet Meeting: రేపు ఏపీ కేబినెట్ భేటీ.. అజెండాలో అమరావతి.. కీలక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్..!
-
Kitchen Hacks: ఫ్రిజ్లో పెట్టిన కొత్తిమీర త్వరగా పాడవుతోందా? ఇలా చేస్తే వారాల తరబడి ఫ్రెష్గా ఉంటుంది!
-
SpaceX Rocket: చంద్రుడిని ఢీకొట్టిన స్పేస్ఎక్స్ రాకెట్! శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే..!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!