Indigo flight: విమానం 2 గంటలు ఆలస్యం.. ఏసీ పనిచేయక అల్లాడిపోయని ప్రయాణికులు
- ఢిల్లీలో విమానం 2 గంటలు ఆలస్యం
- ఏసీ పనిచేయక అల్లాడిపోయని ప్రయాణికులు
- ఇండిగో విమాన సంస్థపై ప్యాసింజర్స్ ఆగ్రహం
- క్షమాపణ చెప్పిన విమానయాన సంస్థ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అసలే హస్తినలో అధిక ఉష్ణోగ్రతలు.. ఇంకోవైపు కరెంట్ కోతలు.. మరోవైపు తాగునీటి కష్టాలు.. ఇలా దేశ రాజధాని ఢిల్లీలో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో విమానం రెండు గంటలు ఆగిపోయింది. ఒకవైపు ఉక్కపోత.. ఇంకోవైపు వేడిగాలులు. దీంతో విమానం లోపల ఏసీ లేక ప్రయాణికులు ఉక్కపోతతో అల్లాడిపోయారు. ఇక పిల్లలు, వృద్ధులైతే హడలెత్తిపోయారు. ఈ బాధలను భరించలేక ప్రయాణికులు మొబైల్లో వీడియోలు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

Also Read
- SRH Player: 51 బంతుల్లో 111 పరుగులు.. ఓ రేంజ్లో రెచ్చిపోయిన సన్ రైజర్స్ మాజీ ఆటగాడు..
- Ram Mandir Prasad: "రామ మందిర ప్రసాద్ " అంటూ అమ్మకాలు.. అమెజాన్కు రూ. 1 లక్ష జరిమానా.!
- ED Raids: తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఈడీ సోదాలు.. ఎంపీ అవినాష్ రెడ్డి ఇంట్లోనూ తనిఖీలు!
- Weather Report: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. నేటి నుంచి ఆగస్టు 28 వరకు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
ఢిల్లీ నుంచి బెంగాల్లోని బాగ్డోగ్రా వెళ్లాల్సిన ఇండిగో విమానం 2 గంటలు ఆలస్యం అయింది. విమానం మధ్యాహ్నం 2:10 గంటలకు బయలుదేరి 4:10 గంటలకు ల్యాండ్ కావాల్సి ఉంది. అయితే విమానం విమానాశ్రయంలోని టార్మాక్పై రెండు గంటలు నిలిచిపోయింది. లోపలేమో ఏసీ లేదు. దీంతో ఉక్కపోతతో ఊపిరాడక ప్యాసింజర్స్ అల్లాడిపోయారు. ఇదిలా ఉంటే బెంగాల్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. కాంచన్జంగా ఎక్స్ప్రెస్ను మరో గూడ్స్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదం జరిగిన దగ్గరలోనే బాగ్డోగ్రా ఎయిర్పోర్టు ఉంది. సాంకేతిక కారణంతోనే ఫ్లైట్ ఆలస్యం అయిందని సిబ్బంది పేర్కొ్న్నారు. ఒకసారి ఇంజన్ సమస్య అని.. ఇంకోసారి ఇంధన సమస్య అని చెప్పారు. ఇలా సిబ్బంది తికమక సమాధానాలతో ప్రయాణికులు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బాగ్డోగ్రా విమానాశ్రయం పశ్చిమ బెంగాల్లోని సిలిగురి సమీపంలో ఉంది.
ఇది కూడా చదవండి: Yuva Rajkumar: యువ రాజ్కుమార్కి లైంగిక సమస్యలు.. హోటల్లో నటితో రెడ్ హ్యాండెడ్ గా దొరికి?
ఇక ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి విమానయాన సంస్థ క్షమాపణ చెప్పింది. అసౌకర్యానికి చింతిస్తున్నామని పేర్కొంది. గమ్యానికి చేరేందుకు ఏర్పాట్లు చేస్తామని తెలిపింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి: Gujarat: రైల్వే ట్రాక్పై సింహాలు.. ట్రైన్ ఆపి రక్షించిన లోకో పైలట్
తాజావార్తలు
-
SRH Player: 51 బంతుల్లో 111 పరుగులు.. ఓ రేంజ్లో రెచ్చిపోయిన సన్ రైజర్స్ మాజీ ఆటగాడు..
-
Iran Vs America: గేర్ మార్చిన ఇరాన్.. వణికిపోతున్న ట్రంప్.. నెక్ట్స్ జరిగేది ఇదే!
-
Mahatma Gandhi: గాంధీజీ చేతిరాత డైరీకి కళ్లు చెదిరే ధర.. రూ.16.20 కోట్లకు అమ్ముడైన డైరీ
-
America Debt:ఇంకెక్కడ సూపర్ పవర్..? అగ్రరాజ్యం నెత్తిన అప్పుల కుప్ప ఎంత ఉందంటే?
-
Ram Mandir Prasad: “రామ మందిర ప్రసాద్ ” అంటూ అమ్మకాలు.. అమెజాన్కు రూ. 1 లక్ష జరిమానా.!
ట్రెండింగ్
-
గూగుల్ బంపర్ ఆఫర్.. వారందరికీ ఏడాది పాటు Google AI Plus ఉచితం.!
-
6.7 అంగుళాల AMOLED 2x డిస్ప్లే, 50MP కెమెరాతో ఆగస్టు 27న రానున్న Samsung Galaxy S26 FE 5G..!
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!