గన్నవరం ఎయిర్పోర్ట్లో ఇండిగో విమానం అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది.. 222 మంది ప్రయాణికులతో బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి.. దీంతో, గన్నవరం ఎయిర్పోర్ట్లో అత్యవసరంగా విమానాన్ని ల్యాండ్ చేశాడు పైలెట్.. విమానంలో ఒక్కసారిగా సాంకేతిక లోపం తలెత్తడంతో ఈ పరిస్థితి వచ్చిందంటున్నారు..
దేశ రాజధాని ఢిల్లీలో దుమ్ము తుఫాన్ సృష్టించిన బీభత్సానికి ఇండిగో విమానం అల్లకల్లోలానికి గురైంది. దీంతో ప్రయాణికులంతా బెంబేలెత్తిపోయారు. ప్రాణ భయంతో కేకలు వేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తతల వేళ కోల్కతా ఎయిర్పోర్టుకు బాంబు బెదిరింపు వచ్చింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు.. పరిసర ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు.
వైద్యులు.. దేవుడితో సమానం అంటారు. దేవుడు మనిషిని చేస్తే.. వైద్యం చేసి ప్రాణాలు నిలబెట్టేది డాక్టర్లు. అందుకే రోగులు.. వైద్యులకు దండాలు పెడతారు. దేవుడితో సమానంగా చూస్తారు కాబట్టే.. అంతగా వారిని గౌరవిస్తారు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటారా? అయితే ఈ వార్త చదవాల్సిందే.
భారతీయ రైళ్లలో విక్రేతలు తిరుగుతూ.. ప్రయాణికులకు టీ అమ్మడం చూసే ఉంటాం. తాజాగా ఇలాంటి ఘటన ఇండిగో విమానంలో వెలుగు చూసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఓ వ్యక్తి విమానంలో తిరిగి ప్రయాణికులకు డిస్పోజబుల్ గ్లాసుల్లో టీ అందిస్తున్నాడు. అంతే కాకుండా రైళ్లో మాదిరిగానే "చాయ్.. చాయ్.." అంటూ అరుస్తున్నాడు.
ఢిల్లీ నుంచి సౌదీ అరేబియాలోని జెడ్డా వెళ్తున్న ఇండిగో విమానం కరాచీ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. సమాచారం ప్రకారం.. విమానంలో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణీకుడి ఆరోగ్యం క్షీణించింది.
Air Hostess: విమానాల్లో ప్రయాణీకులు, విమాన సిబ్బంది, పైలట్ల ప్రవర్తన ఇటీవలి కాలంలో వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. విమానాల్లో సీట్లపై ఉన్న ప్రయాణికులపై మూత్ర విసర్జన చేయడం వంటి ఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.
శుక్రవారం ఉదయం పొగమంచు కారణంగా దృశ్యమానత తక్కువగా ఉండటంతో లక్నో విమానాశ్రయంలో ఐదు విమానాలు ల్యాండ్ కాలేదు. హైదరాబాద్, జైపూర్, బెంగళూరు, ఇండోర్ నుంచి వచ్చే విమానాలు గాలిలో చక్కర్లు కొట్టడంతో వాటిని దారి మళ్లించారు. ఇదిలా ఉండగా.. పట్నాలోని జయప్రకాశ్ నారాయణ విమానాశ్రయంలో ఇండిగో విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. రన్వేపై ట్రాక్టర్ మోరాయించడంతో ఇండిగో విమానం దాదాపు 40 నిమిషాలు గాల్లోనే చక్కర్లు కొట్టింది.
Hoax Bomb Threat: విమానాలకు నకిలీ బాంబు బెదిరింపులు ఎదురవుతూనే ఉన్నాయి. గత నెల కాలంగా దేశంలోని పలు ఎయిర్ లైన్ సంస్థలకు బెదిరింపులు వస్తూనే ఉన్నాయి. తాజాగా నాగ్పూర్ నుంచి కోల్కతా వెళ్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు రావడంతో అత్యవసరంగా ల్యాండింగ్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఒక ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నారు. Read Also: Ranji Trophy: మెగా వేలానికి ముందు వీర బాదుడు.. ట్రిపుల్ సెంచరీ సాధించిన లోమ్రోర్ 187…