Gujarat: రైల్వే ట్రాక్పై సింహాలు.. ట్రైన్ ఆపి రక్షించిన లోకో పైలట్
- రైల్వే ట్రాక్పై పడుకున్న సింహాలు
- అప్రమత్తతో ట్రైన్ ఆపిన లోక్ పైలట్
- ట్రాక్ పై నిద్రిస్తున్న 10 సింహాలు
- సింహాల ప్రాణాలు రక్షించిన లోకో పైలట్ పై ప్రశంసలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రైల్వే ట్రాక్పై పడుకున్న సింహాలను చూసి లోక్ పైలట్ అప్రమత్తతో ట్రైన్ ఆపి వాటి ప్రాణాలను కాపాడాడు. దాదాపు 10 సింహాలు ట్రాక్ పై నిద్రిస్తుండగా.. అది చూసిన లోకో పైలట్ సడన్ గా బ్రేకులు వేశాడు. దీంతో వాటి ప్రాణాలను రక్షించాడు. ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున గుజరాత్లోని పిపావావ్ పోర్ట్ సమీపంలో జరిగింది. లోకో పైలట్ ముఖేష్ కుమార్ మీనా గూడ్స్ రైలును పిపావావ్ పోర్ట్ స్టేషన్ నుండి ప్రధాన కారిడార్ పక్కన ఒక చిన్న ట్రాక్ పై వస్తున్నాడు. అయితే.. “ట్రాక్లపై విశ్రాంతి తీసుకుంటున్న 10 సింహాలను గుర్తించిన వెంటనే మీనా ఎమర్జెన్సీ బ్రేకులు వేసి రైలును ఆపాడు. అంతేకాకుండా.. సింహాలు లేచి పట్టాలపై నుంచి వెళ్లే వరకు వేచి ఉండి.. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే.. లోకో పైలట్ చేసిన ఈ పనిపై పలువురు అధికారులు ప్రశంసిస్తున్నారు.
Kishan Reddy : జమ్మూ & కాశ్మీర్కు బీజేపీ ఇంచార్జ్ గా కిషన్ రెడ్డి..
Also Read
- Operation Sindoor: పాకిస్తాన్ వేడుకున్నా దాడి చేశాం: మాజీ సీడీఎస్ అనిల్ చౌహాన్..
- Operation Sindoor: పాక్ అణుకేంద్రం ‘‘కిరాణా హిల్స్’’పై దాడి.. సంచలన నిజం చెప్పిన మాజీ CDS..
- Rahul Gandhi: కృతి సనన్ రక్షాబంధన్ యాడ్పై కంగనా విమర్శలు.. ఆమె ఇష్టమని రాహుల్గాంధీ మద్దతు
- IISc Study: ఆవు ఎంజైమ్తో ప్రమాదకర బ్యాక్టీరియాకు చెక్.. IISc సంచలన పరిశోధన
కాగా.. సింహాలతో సహా వన్యప్రాణుల భద్రత కోసం భావ్నగర్ డివిజన్ అనేక చర్యలు చేపడుతుంది. ఈ మార్గంలో వెళ్లే.. లోకో పైలట్లు అప్రమత్తంగా ఉంటారు.. అంతేకాకుండా.. నిర్దేశించిన వేగ పరిమితి ప్రకారం రైళ్లను నడుపుతారని రైల్వే అధికారులు తెలిపారు. కాగా.. ఈ రైలు మార్గంలో గత కొన్నేళ్లుగా అనేక సింహాలు చనిపోయాయి. అభయారణ్యం చాలా దూరంలో ఉన్నప్పటికీ, ఈ ప్రాంతంలో పులులు తిరుగుతాయని అధికారులు తెలిపారు.
Payyavula Keshav: రాష్ట్రానికి మంత్రి అయినా జిల్లాకు కూలీగా పని చేస్తా..
మరోవైపు.. సింహాలను రైళ్లు ఢీకొట్టకుండా కాపాడేందుకు రాష్ట్ర అటవీ శాఖ నిర్ణీత వ్యవధిలో ట్రాక్పై కంచెలను ఏర్పాటు చేసింది. ఇటీవలి కాలంలో.. గుజరాత్ హైకోర్టు, అసహజ కారణాల వల్ల ఆసియాటిక్ సింహాలు మృతి చెందడంపై దాఖలైన స్వయంప్రతిపత్తి పిల్ను విచారిస్తూ.. రైళ్లలో సింహాలు ఢీకొనకుండా కాపాడేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం, రైల్వే శాఖను కోరింది. కాగా.. 2020 జూన్ లో నిర్వహించిన సింహాల సంఖ్య.. గుజరాత్ లో 674 సింహాలు ఉన్నట్లు తెలిపింది.
తాజావార్తలు
-
Operation Sindoor: పాకిస్తాన్ వేడుకున్నా దాడి చేశాం: మాజీ సీడీఎస్ అనిల్ చౌహాన్..
-
Homemade Rose Water: లేడీస్ స్పెషల్.. పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే రోజ్ వాటర్! గ్లోయింగ్ స్కిన్కు సింపుల్ సీక్రెట్ ఇదే..
-
Operation Sindoor: పాక్ అణుకేంద్రం ‘‘కిరాణా హిల్స్’’పై దాడి.. సంచలన నిజం చెప్పిన మాజీ CDS..
-
Rahul Gandhi: కృతి సనన్ రక్షాబంధన్ యాడ్పై కంగనా విమర్శలు.. ఆమె ఇష్టమని రాహుల్గాంధీ మద్దతు
-
IISc Study: ఆవు ఎంజైమ్తో ప్రమాదకర బ్యాక్టీరియాకు చెక్.. IISc సంచలన పరిశోధన
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!