Gujarat: రైల్వే ట్రాక్పై సింహాలు.. ట్రైన్ ఆపి రక్షించిన లోకో పైలట్
- రైల్వే ట్రాక్పై పడుకున్న సింహాలు
- అప్రమత్తతో ట్రైన్ ఆపిన లోక్ పైలట్
- ట్రాక్ పై నిద్రిస్తున్న 10 సింహాలు
- సింహాల ప్రాణాలు రక్షించిన లోకో పైలట్ పై ప్రశంసలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రైల్వే ట్రాక్పై పడుకున్న సింహాలను చూసి లోక్ పైలట్ అప్రమత్తతో ట్రైన్ ఆపి వాటి ప్రాణాలను కాపాడాడు. దాదాపు 10 సింహాలు ట్రాక్ పై నిద్రిస్తుండగా.. అది చూసిన లోకో పైలట్ సడన్ గా బ్రేకులు వేశాడు. దీంతో వాటి ప్రాణాలను రక్షించాడు. ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున గుజరాత్లోని పిపావావ్ పోర్ట్ సమీపంలో జరిగింది. లోకో పైలట్ ముఖేష్ కుమార్ మీనా గూడ్స్ రైలును పిపావావ్ పోర్ట్ స్టేషన్ నుండి ప్రధాన కారిడార్ పక్కన ఒక చిన్న ట్రాక్ పై వస్తున్నాడు. అయితే.. “ట్రాక్లపై విశ్రాంతి తీసుకుంటున్న 10 సింహాలను గుర్తించిన వెంటనే మీనా ఎమర్జెన్సీ బ్రేకులు వేసి రైలును ఆపాడు. అంతేకాకుండా.. సింహాలు లేచి పట్టాలపై నుంచి వెళ్లే వరకు వేచి ఉండి.. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే.. లోకో పైలట్ చేసిన ఈ పనిపై పలువురు అధికారులు ప్రశంసిస్తున్నారు.
Kishan Reddy : జమ్మూ & కాశ్మీర్కు బీజేపీ ఇంచార్జ్ గా కిషన్ రెడ్డి..
Also Read
- PM Modi: ‘‘సరిహద్దుల్లో శాంతి తప్పనిసరి’’.. జిన్పింగ్కు తేల్చి చెప్పిన మోడీ..
- Suvendu Adhikari: చిన్మోయ్ కృష్ణదాస్ కన్నీరు.. హిందువుల పరిస్థితిపై బెంగాల్ సీఎం కామెంట్స్..
- PM Modi-Xi Jinping: ఒకరి నుంచి మరొకరం నేర్చుకోవచ్చు: మోడీతో భేటీలో జిన్పింగ్..
- BRICS: బ్రిక్స్లో కీలక పరిణామం.. యుద్ధం వేళ, ఇరాన్-యూఏఈ చర్చలు..
కాగా.. సింహాలతో సహా వన్యప్రాణుల భద్రత కోసం భావ్నగర్ డివిజన్ అనేక చర్యలు చేపడుతుంది. ఈ మార్గంలో వెళ్లే.. లోకో పైలట్లు అప్రమత్తంగా ఉంటారు.. అంతేకాకుండా.. నిర్దేశించిన వేగ పరిమితి ప్రకారం రైళ్లను నడుపుతారని రైల్వే అధికారులు తెలిపారు. కాగా.. ఈ రైలు మార్గంలో గత కొన్నేళ్లుగా అనేక సింహాలు చనిపోయాయి. అభయారణ్యం చాలా దూరంలో ఉన్నప్పటికీ, ఈ ప్రాంతంలో పులులు తిరుగుతాయని అధికారులు తెలిపారు.
Payyavula Keshav: రాష్ట్రానికి మంత్రి అయినా జిల్లాకు కూలీగా పని చేస్తా..
మరోవైపు.. సింహాలను రైళ్లు ఢీకొట్టకుండా కాపాడేందుకు రాష్ట్ర అటవీ శాఖ నిర్ణీత వ్యవధిలో ట్రాక్పై కంచెలను ఏర్పాటు చేసింది. ఇటీవలి కాలంలో.. గుజరాత్ హైకోర్టు, అసహజ కారణాల వల్ల ఆసియాటిక్ సింహాలు మృతి చెందడంపై దాఖలైన స్వయంప్రతిపత్తి పిల్ను విచారిస్తూ.. రైళ్లలో సింహాలు ఢీకొనకుండా కాపాడేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం, రైల్వే శాఖను కోరింది. కాగా.. 2020 జూన్ లో నిర్వహించిన సింహాల సంఖ్య.. గుజరాత్ లో 674 సింహాలు ఉన్నట్లు తెలిపింది.
తాజావార్తలు
-
Nehal Vadoliya : ప్రాణాలకు ముప్పు ఉంది.. తమన్నా మాజీ ప్రియుడు విజయ్ వర్మపై నటి సంచలన ఆరోపణలు!
-
PM Modi: ‘‘సరిహద్దుల్లో శాంతి తప్పనిసరి’’.. జిన్పింగ్కు తేల్చి చెప్పిన మోడీ..
-
WTC Points: పాకిస్థాన్ను క్లీన్స్వీప్ చేసిన ఇంగ్లండ్.. మారిపోయిన WTC పాయింట్ల పట్టిక.. భారత్ స్థానం ఎంతంటే..
-
Zomato: ఫుడ్ లవర్స్కు జొమాటో షాక్.. ఇకపై ఇలా చేస్తే జేబు ఖాళీ!
-
Ponguleti Srinivas Reddy : రాజీనామా చేయాల్సింది నేనా.. కేసీఆర్నా? పొంగులేటి ఫైర్
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!