Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Daggubati Purandeswari Says Only Bjp Fights On Public Issues In Ap

Daggubati Purandeswari: రాష్ట్రంలోని ప్రజా సమస్యలపై బీజేపీ మాత్రమే పోరాటం చేస్తుంది: పురందేశ్వరి

Published Date :February 29, 2024 , 1:08 pm
By Sampath Kumar
Daggubati Purandeswari: రాష్ట్రంలోని ప్రజా సమస్యలపై బీజేపీ మాత్రమే పోరాటం చేస్తుంది: పురందేశ్వరి
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజా సమస్యలపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మాత్రమే పోరాటం చేస్తుందని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. ఎన్నికలు ఇంకా ఎంతో దూరంలో లేవని, ఎన్నికలు అనంతరం బీజేపీ బలీయమైన శక్తిగా అవతరిస్తుందన్నారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీ మాత్రమే పని చేస్తోందని, ప్రతి సమస్యపై బీజేపీ గళం విప్పిందని పురందేశ్వరి పేర్కొన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతోందంటే దానికి కేంద్ర ప్రభుత్వం తోడ్పాటే కారణమని, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఏం చేయడం లేదనే అపోహను తొలగించాలన్నారు. పేదలకు సంక్షేమం అందించాలన్నదే కేంద్ర ప్రభుత్వ ధ్యేయమని ఆమె చెప్ప్పుకొచ్చారు.

బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఈరోజు అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ… ’50 రోజుల్లో ఎన్నికలకు వెళ్తున్నాం. ఎన్నికలు ఇంకా ఎంతో దూరంలో లేవు. ఎన్నికలు అనంతరం బీజేపీ బలీయమైన శక్తిగా అవతరిస్తుంది. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీ మాత్రమే పని చేస్తోంది. ప్రతి సమస్యపై బీజేపీ గళం విప్పింది. రాబోయే ఎన్నికల్లో అధికార ప్రతినిధులే ప్రధాన భూమిక పోషించాలి. జాతీయ స్థాయిలో బీజేపీ చేసిన అభివృద్ధి పనులు ప్రజల దగ్గరికి తీసుకెళ్లాలి. రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతోందంటే దానికి కేంద్ర ప్రభుత్వం తోడ్పాటే కారణం. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఏం చేయడం లేదని అపోహను తొలగించాలి. కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందనేది ప్రజల్లోకి తీసుకెళ్లాలి’ అని కార్యకర్తను ఉద్దేశించి అన్నారు.

Also Read: Chiranjeevi: రమణ గాడి ఇంటికి విశ్వంభర

‘రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయింది. పేదలకు సంక్షేమ అందించాలన్నదే కేంద్ర ప్రభుత్వ ధ్యేయం. సంక్షేమం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం పేదల సొమ్మును దోచుకుంటుంది. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పాత్ర బీజేపీ పోషిస్తుంది. కేవలం ఒక తిరుపతి నియోజకవర్గంలోనే 30 వేల దొంగ ఓట్లున్నాయి. ప్రజా సమస్యలపై రాష్ట్రంలో బీజేపీ పోరాటం చేస్తుంది. రాష్ట్రంలో బీజేపీ ఒక బలమైన పార్టీగా ఎదుగుతుంది. కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం ఏకకాలంలో అమలు చేస్తోంది’ అని పురందేశ్వరి పేర్కొన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ap
  • bjp
  • Daggubati Purandeswari
  • Daggubati Purandeswari Press Meet

తాజావార్తలు

  • డబ్బులే.. డబ్బులు.. Women’s T20 World Cup 2026కు భారీ ప్రైజ్ మనీ ప్రకటించిన ICC..!

  • Siraj-Zanai Bhosle: జనై భోస్లేను దగ్గరకు తీసుకుని ఓదార్చిన మహమ్మద్ సిరాజ్.. వీడియో వైరల్

  • Lenovo: లెనోవా కొత్త గేమింగ్ ల్యాప్‌టాప్ లెకూ బెల్లేటర్ 7000 విడుదల.. ధర తక్కువ, పెర్ఫార్మెన్స్ హై!

  • Anna Canteens: మరింత చేరువుగా ‘అన్నక్యాంటీన్స్’.. మరో 62 గ్రామీణ అన్న క్యాంటీన్లు అందుబాటులోకి.!

  • Mamata Banerjee: ఒక్క ఆడదానిపై 19 రాష్ట్రాలు, కేంద్రం పని చేస్తున్నాయి.. యోధురాలిగా పోరాడతానన్న మమత

ట్రెండింగ్‌

  • ఒక్కసారి ఛార్జ్ చేస్తే 320 కి.మీ రేంజ్​.. OLA ‘S1 X+’ లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా..!

  • 144Hz AMOLED డిస్‌ప్లే, Snapdragon 7s Gen 4, భారీ 6500mAh బ్యాటరీతో Infinix NOTE 60 Pro లాంచ్.. ధర ఎంతంటే?

  • Home Hacks: సాలెగూళ్లకు ‘చెక్’ పెట్టే మ్యాజిక్.. మీ వంటింట్లోనే ఉంది.!

  • Super Juice: వేసవి వేడికి ఈ పండు రసమే ‘రామబాణం’.. బరువు తగ్గడమే కాదు, ముఖం కూడా మెరిసిపోతుంది.!

  • అమృతం ఎక్కడో లేదు.. మీ వంటింట్లోనే ఉంది..! వేసవిలో ఈ ఒక్క గ్లాసు పానీయం చేసే మ్యాజిక్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions