Purandeswari: మూడు పార్టీల కలయిక చారిత్రాత్మక అవసరం, త్రివేణి సంగమం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Purandeswari: టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి.. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో.. బీజేపీలో చేరారు వివిధ రంగాలు, వర్గాలకు చెందిన పలువురు వ్యక్తులు. వారికి పార్టీ కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించిన పురంధేశ్వరి.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. టీడీపీతో కలిసి వెళ్లాలని పార్టీ పెద్దలు నిర్ణయించారు.. మూడు పార్టీల కలయిక చారిత్రాత్మక అవసరం.. మూడు పార్టీల కలయిక త్రివేణి సంగమంగా అభివర్ణించారు. ఏపీలోని అరాచక ప్రభుత్వాన్ని గద్దె దించాలని పార్టీ పెద్దలు నిర్ణయం తీసుకున్నారన్న ఆమె.. పొత్తుల వల్ల పార్టీలో చాలా మంది ఆశావహులకు నిరాశ ఎదురైంది. కానీ, రాష్ట్రంలోని ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా పొత్తులు తప్పదని పార్టీ హైకమాండ్ భావించిందన్నారు.
Read Also: AP Pensions: ఏపీలో ఏప్రిల్ నెల పింఛన్లు రెండు రోజులు ఆలస్యం.. కారణం అదే..?
Also Read
- Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్... సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
- Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
- Pakistan: గర్భిణీలు, చిన్న పిల్లల్ని కూడా వదల్లేదు.. POKలో పాక్ ఆర్మీ దుర్మార్గాలు..
- Off The Record: అధికారం కోసం తప్ప పార్టీ కోసం ఎవరూ పని చేయట్లేదా..? ఆ ఉమ్మడి జిల్లా జనసేన కమిటీ మొత్తం రద్దు..
వైసీపీ ప్రభుత్వం వ్యవస్థలను తమ చేతుల్లోకి తీసుకుందని విమర్శించారు పురంధేశ్వరి. భారీ ఎత్తున దొంగ ఓట్లు నమోదు చేయించారు. అప్పులు భారీ ఎత్తున చేసేసింది ఈ ప్రభుత్వం. సెక్రటేరీయేట్టును, మద్యాన్ని, గనులను, ప్రభుత్వ భవనాలను, భూములను తనఖా పెట్టేశారని.. సెక్రటేరీయేట్టును తాకట్టు పెట్టకూడదని రాజ్యాంగంలో ఏమైనా రాశారా? అని ఓ వైసీపీ నేత కామెంట్ చేస్తున్నారు. ప్రభుత్వ ఆస్తులను తనఖా పెట్టే అధికారం ఈ ప్రభుత్వానికి ఎక్కడిది..? అంటూ మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వంలో అన్ని రంగాల్లోనూ అవినీతే అని ఆరోపించారు.. మహిళల పుస్తెలు తెగినా నాసిరకం మద్యం తాగిస్తామనే రీతిలోనే జగన్ వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: Kakarla Suresh: విభేదాలు వీడి ఐకమత్యంతో విజయం సాధిద్దాం..!
నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీలనే సీఎం జగన్.. ఆ వర్గాలకు ఏం న్యాయం చేశారు? అని ప్రశ్నించారు పురంధేశ్వరి.. ఎస్సీ, బీసీ, ఎస్టీల నిధులు దారి మళ్లించారు. ఎస్సీ యువకుడిని హత్య చేసిన ఎమ్మెల్సీని సీఎం తన పక్కన కూర్చొబెట్టుకుంటున్నారు. ఎస్సీలకు జగన్ చేసిన న్యాయం ఇదేనా..? అని మండిపడ్డారు. ఏపీ అభివృద్ధికి బీజేపీ అంకితమై పని చేస్తుందని స్పష్టం చేశారు. వైసీపీ నిరంకుశ పాలన చూస్తున్నాం. సీఎం జగన్ను గద్దె దించాలంటే మూడు పార్టీల కూటమి.. త్రివేణి సంగమం అనివార్యం అన్నారు. బీజేపీ అభ్యర్థులనే కాదు.. కూటమి అభ్యర్థుల గెలుపు కోసం పని చేయాలని పిలుపునిచ్చారు. మూడు పార్టీల జెండాలు వేరైనా.. అజెండా మాత్రం ఒక్కటే.. మూడు పార్టీల కూటమి ప్రభుత్వంలోకి వస్తేనే ఏపీలో రామరాజ్యం వస్తుందన్నారు బీజేపీ ఏపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి.
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!