IPL 2024: అభిమానులకు శుభవార్త.. భారత్ చేరుకున్న విరాట్ కోహ్లీ! ‘కింగ్’ వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virat Kohli Lands in India for IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 మరో 6 రోజుల్లో ఆరంభం కానుంది. మార్చి 22న చెపాక్లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగే మ్యాచ్తో మెగా టోర్నీకి తెరలేవనుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు సన్నద్ధం అవుతున్నాయి. ఈ సమయంలో ఆర్సీబీ అభిమానులకు ఓ శుభవార్త. లండన్ నుంచి టీమిండియా స్టార్ బ్యాటర్, కింగ్ విరాట్ కోహ్లీ భారత్ చేరుకున్నాడు.
ఆదివారం ఉదయం విరాట్ కోహ్లీ లండన్ నుంచి భారత్కు వచ్చాడు. ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చిన కోహ్లీ.. కారు ఎక్కి వెళ్లిపోయాడు. విరాట్ బ్లాక్ కలర్ టీషర్ట్, వైట్ కలర్ పాయింట్ వేసుకున్నాడు. ఇందుకుసంబందించిన వీడియో నెట్టింట వైరల్ అయింది. వీడియో చూసిన ఆర్సీబీ ఫాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. కింగ్ వచ్చేశాడు అని కామెంట్స్ పెడుతున్నారు.
Also Read
- UP: యూపీ ఎన్నికల వేళ కాల్పులు.. ప్రయాగ్రాజ్లో ఎస్పీ నేత హత్య
- US: విమానంలో మహిళ రచ్చరచ్చ.. నగ్నంగా తిరుగుతూ అసభ్య ప్రవర్తన
- Ambati Rambabu: అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు.. పోలీసు నోటీసులపై అంబటి ఆగ్రహం..
- UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం కీలక నిర్ణయం.. అక్టోబర్ 15 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు..
Also Read: Iceland Volcano: ఐస్లాండ్లో బద్దలైన అగ్నిపర్వతం.. మూడు నెలల్లో నాలుగోసారి!
తన సతీమణి అనుష్క శర్మ ప్రసవ సమయంలో ఆమె పక్కన ఉండేందుకు విరాట్ కోహ్లీ ఇంగ్లండ్తో జరిగిన 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ నుంచి తప్పకున్న విషయం తెలిసిందే. 2024 ఫిబ్రవరి 15న లండన్లోని ఓ ఆసుపత్రిలో అనుష్క పండంటి మగబిడ్డకు జన్మినిచ్చారు. తమ కుమారుడికి ‘అకాయ్’ అని నామకరణం చేసినట్లు విరాట్ తెలిపాడు. దాదాపు నెల రోజులుగా కోహ్లీ తన కుటుంబంతో కలిసి లండన్లో ఉన్నాడు. ఐపీఎల్ 2024 కోసం ఈరోజు భారత్ వచ్చాడు. నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో అతడు చేరనున్నాడు. మార్చి 19న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలోని ఆర్సీబీ జెర్సీ రీవీల్ కార్యక్రమంలో విరాట్ పాల్గొననున్నాడని తెలుస్తోంది.
- Tags
- india
- IPL 2024
- London
- RCB
- VIRAT KOHLI
తాజావార్తలు
-
UP: యూపీ ఎన్నికల వేళ కాల్పులు.. ప్రయాగ్రాజ్లో ఎస్పీ నేత హత్య
-
Cheyutha Pension : గుడ్న్యూస్.. చేయూత పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగింపు
-
Explainers: బాబోయ్.. ఇండియన్స్ వద్దు..!
-
US: విమానంలో మహిళ రచ్చరచ్చ.. నగ్నంగా తిరుగుతూ అసభ్య ప్రవర్తన
-
Ambati Rambabu: అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు.. పోలీసు నోటీసులపై అంబటి ఆగ్రహం..
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?