Congress: ఐటీ నోటీసులపై దేశ వ్యాప్త ఆందోళనలకు కాంగ్రెస్ పిలుపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐటీ శాఖ నోటీసులపై కాంగ్రెస్ మండిపడుతోంది. సార్వత్రిక ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసేందుకు బీజేపీ కుట్ర పన్నిందని ఆ పార్టీ నేతలు భగ్గుమంటున్నారు. తమపై ఐటీ చర్యలను నిలిపివేయాలంటూ కాంగ్రెస్ పార్టీ వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టేసిన వెంటనే.. కాంగ్రెస్కు ఐటీ నోటీసులు జారీ చేసింది. 2017-18, 2020-21 మదింపు సంవత్సరాలకు సంబంధించి పెనాల్టీ, వడ్డీ వసూలుకు రూ.1823 కోట్లు చెల్లించాలని నోటీసులు ఇచ్చింది. ఇప్పటికే ఎన్నికల్లో డబ్బు లేదని ఆ పార్టీ నేతలు గగ్గోలు పెడుతున్న సమయంలో మరోసారి ఐటీ నోటీసులు ఇవ్వడంపై సీనియర్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: RR vs DC: అంఫైర్తో పాంటింగ్, గంగూలీ వాగ్వాదం.. కాసేపు ఆగిన మ్యాచ్.. ఇంతకీ ఏమైందంటే..!
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
ఐటీ శాఖ నోటీసులను నిరసిస్తూ కాంగ్రెస్ హైకమాండ్ నిరసనలకు పిలుపునిచ్చింది. శనివారం దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు నిరసనలు చేపట్టాలని పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ. వేణుగోపాల్ పిలుపునిచ్చారు. అన్ని రాష్ట్ర విభాగాలను కోరారు. పీసీసీ ప్రధాన కార్యాలయాల దగ్గర, జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యాలయాల దగ్గర ధర్నా చేయాలని అధిష్టానం ఆదేశించింది. లోక్సభ ఎన్నికల్లో పార్టీని ఆర్థికంగా దెబ్బతీసేందుకే కేంద్రం ఇలా పన్ను ఉగ్రవాదానికి పాల్పడుతోందని కాంగ్రెస్ మండిపడింది.
ఇది కూడా చదవండి: Chandrababu: ఎన్టీఆర్ టీడీపీని ప్రారంభించిన గొప్ప రోజు ఇది..
2017 నుంచి 2021 మధ్య కాలానికి ఆదాయపు పన్ను విభాగం చేపట్టిన పునఃపరిశీలన ప్రక్రియను నిలిపివేయాలంటూ కాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్లను గురువారం ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది. దీంతో శుక్రవారం 2017-18, 2020-21 మదింపు సంవత్సరాలకు సంబంధించి పెనాల్టీ, వడ్డీ వసూలుకు రూ.1800 కోట్లకుపైగా డిమాండ్ నోటీసులను ఐటీ పంపించింది.
మరోవైపు కేజ్రీవాల్ అరెస్ట్కు మద్దతుగా ఆదివారం ఢిల్లీలో ఇండియా కూటమి మహా ర్యాలీకి సిద్ధపడింది. దీనికి కేంద్ర ఎన్నికల సంఘం, పోలీసుల నుంచి అనుమతి లభించినట్లు సమాచారం. అన్ని పార్టీలకు చెందిన నేతలు ఈ ర్యాలీలో పాల్గొననున్నారు. ఇదిలా ఉంటే కేజ్రీవాల్ అరెస్ట్ను అమెరికా సహా ఐక్యరాజ్యసమితి తప్పుపట్టింది. ఇక తమ దేశ విషయాల్లో జోక్యం చేసుకోవద్దని కేంద్రం స్పష్టం చేసింది.

తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!