Chandrababu: ఎన్టీఆర్ టీడీపీని ప్రారంభించిన గొప్ప రోజు ఇది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandrababu: వచ్చే ఎన్నికల్లో వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించాలని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఎన్డీఏ అన్ స్థాపబుల్ అని.. ఎక్కడ చూసినా ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోందన్నారు. నెల్లూరు జిల్లా కావలిలో నిర్వహించిన ‘ప్రజాగళం’ సభలో చంద్రబాబు ప్రసంగించారు. తెలుగు జాతికి ఈ రోజు ఎంతో గొప్పరోజు అన్న ఆయన.. బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారన్నారు. ప్రజలకు జరిగిన అన్యాయాన్ని వివరించేందుకు వచ్చానన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. జగన్ వచ్చినప్పటి నుంచి బాదుడే బాదుడు అని.. నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదని ఆయన విమర్శించారు. జాబు రావాలంటే బాబు రావాలన్నారు. డీఎస్సీని పూర్తిగా ఇవ్వలేదన్న ఆయన.. ఐదేళ్లలో అందరూ నష్టపోయారన్నారు.
Read Also: MP Nandigam Suresh: పేదల పట్ల ఎప్పుడూ చంద్రబాబుకు ప్రేమ లేదు..
Also Read
- Sitanshu Kotak: "వైభవ్ కోసం పాతోళ్లను తీసేయలేం".. బుడ్డోడి ప్లేయింగ్-11 ఛాన్స్పై కోచ్ సంచలన ప్రకటన..
- Nandini Reddy: ‘మా ఇంటి బంగారం’ షూటింగ్లోనే సమంత ప్రెగ్నెంట్.. ఆ సీక్రెట్ నాకు మాత్రమే తెలుసు!
- Varanasi: వారణాసిపై ఒక్క హింట్ కూడా ఇవ్వలేదు బాబోయ్.. నెట్ఫ్లిక్స్ వీపీ మోనికా ఆసక్తికర వ్యాఖ్యలు!
- BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
టీడీపీ వల్లే ప్రజలకు భవిష్యత్ ఉంటుందన్నారు. 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని.. చాలా కాలం రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేశానని.. కానీ ఇలాంటి ముఖ్యమంత్రిని మాత్రం చూడలేదన్నారు. ప్రజాస్వామ్యంపై జగన్కు నమ్మకం లేదని.. అన్ని వ్యవస్థలను నాశనం చేశారన్నారు. ఎవరైనా ఎదురు తిరిగితే పోలీసులు, సీఐడీ ద్వారా కేసులు పెట్టిస్తున్నారన్నారు. చంద్రబాబు మాట్లాడుతూ.. ‘చాలా మంది భయపడుతున్నారు. స్వేచ్ఛగా బతికే పరిస్థితి లేదు. నంద్యాలలో అబ్దుల్ను హింసించారు. కావలిలో ఎమ్మెల్యే ఆగడాలు భరించలేక కరుణాకర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆ కుటుంబాన్ని టీడీపీ ఆదుకుంది. బాబాయ్ని చంపిన వ్యక్తికి ఓటు వేయాలని కోరుతున్నారు ప్రతి చోటా అరాచకాలే.. ఎవరికీ రక్షణ లేదు” అని చంద్రబాబు ఆరోపించారు.
టీడీపీ అధికారంలోకి వస్తే పోలీస్ రిక్రూట్మెంట్ను కూడా నిర్వహిస్తామని చంద్రబాబు హామీలు గుప్పించారు. ప్రజల కోసమే జనసేన, బీజేపీతో పొత్తు పెట్టుకున్నామన్నారు. రాష్ట్రాన్ని అప్పులమయం చేశారన్నారు. మైనారిటీలకు న్యాయం చేసిన పార్టీ టీడీపీ అని ఆయన తెలిపారు. ఇప్పుడు మాపై దుష్ప్రచారం చేస్తున్నారన్నరు. అవినీతి పరుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని ఢీ కొట్టేందుకే కావ్య కృష్ణా రెడ్డిని రంగంలోకి దింపామన్నారు. ఆయన విజయం ఖాయమన్నారు. మత్స్యకారులను ఆదుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు.
తాజావార్తలు
-
Samsung Galaxy A27 5G: సామ్ సంగ్ గెలాక్సీ A27 5G రిలీజ్.. 5,000mAh బ్యాటరీ, 6.7-ఇంచెస్ AMOLED డిస్ప్లే
-
Sitanshu Kotak: “వైభవ్ కోసం పాతోళ్లను తీసేయలేం”.. బుడ్డోడి ప్లేయింగ్-11 ఛాన్స్పై కోచ్ సంచలన ప్రకటన..
-
Nandini Reddy: ‘మా ఇంటి బంగారం’ షూటింగ్లోనే సమంత ప్రెగ్నెంట్.. ఆ సీక్రెట్ నాకు మాత్రమే తెలుసు!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
Varanasi: వారణాసిపై ఒక్క హింట్ కూడా ఇవ్వలేదు బాబోయ్.. నెట్ఫ్లిక్స్ వీపీ మోనికా ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!