RR vs DC: అంఫైర్తో పాంటింగ్, గంగూలీ వాగ్వాదం.. కాసేపు ఆగిన మ్యాచ్.. ఇంతకీ ఏమైందంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2024లో భాగంగా.. రాజస్థాన్-ఢిల్లీ మధ్య గురువారం మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 184 పరుగులు చేసింది. రాజస్థాన్ తరుఫున రియాన్ పరాగ్ (84) పరుగులు చేసి జట్టుకు స్కోరును అందించాడు. కాగా.. 185 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్.. రెండు బంతులు పడగానే ఢిల్లీ కోచ్ రికీ పాంటింగ్, క్రికెట్ డైరెక్టర్ సౌరవ్ గంగూలీ ఫోర్త్ అంపైర్తో వాగ్వాదానికి దిగారు. దీంతో.. కాసేపు మ్యాచ్ ను నిలిపివేశారు.
Steve Smith: ప్రపంచంలో అతనే బెస్ట్ ప్లేయర్.. ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ కీలక వ్యాఖ్యలు
Also Read
- IPL 2027: కోహ్లీ, రోహిత్తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
- రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
- Hardik Pandya: ఐపీఎల్ ట్రేడ్ హీట్.. హార్దిక్ పాండ్యా ఢిల్లీకా? చెన్నైకా? భారత మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
ఇంతకీ ఏం జరిగిందంటే.. రాజస్థాన్ రోవ్మన్ పావెల్ను రంగంలోకి దించడంతో గందరగోళం ఏర్పడింది. డగౌట్లో ఉన్న పాంటింగ్ ఇది చూసి చేతులు పైకెత్తి అంపైర్ వైపు చూపించాడు. ఆ సమయంలో నాలుగో అంపైర్ పాంటింగ్ వద్దకు వెళ్లి పరిస్థితిని వివరిస్తూ కనిపించాడు. అంపైర్ పాంటింగ్కు నిబంధనలను వివరించేందుకు ప్రయత్నిస్తుండగా, గంగూలీ కూడా వచ్చి అంపైర్తో నిబంధనలను చర్చిస్తూ కనిపించాడు. నిజానికి.. ఇంపాక్ట్ ప్లేయర్ నియమం గురించి పాంటింగ్ అయోమయంలో ఉన్నాడు. ఆతిథ్య జట్టు బట్లర్, షిమ్రాన్ హెట్మెయర్, ట్రెంట్ బౌల్ట్ రూపంలో ప్లేయింగ్ ఎలెవెన్లో ముగ్గురు విదేశీ ఆటగాళ్లను మాత్రమే ఉంచింది. ఈ క్రమంలో.. జట్టు ఒక విదేశీ ఆటగాడిని ఇంపాక్ట్ ప్లేయర్గా ఉంచవచ్చు. రాజస్థాన్ రాయల్స్ కూడా అదే చేసింది. రాజస్థాన్ ఇంపాక్ట్ ప్లేయర్ నాంద్రే బెర్గర్. కానీ అతను ఫీల్డింగ్ కోసం రోవ్మన్ పావెల్ను రంగంలోకి దించింది. రియాన్ పరాగ్ స్థానంలో అతను ప్రత్యామ్నాయంగా వచ్చాడు. రాజస్థాన్ ఐదుగురు విదేశీ ఆటగాళ్లను రంగంలోకి దింపిందని పాంటింగ్ భావించాడు. దీనిపై తీవ్ర స్థాయిలో అంపైర్తో వాగ్వాదానికి దిగాడు.
Chandrababu: ఎన్టీఆర్ టీడీపీని ప్రారంభించిన గొప్ప రోజు ఇది..
ఐపీఎల్ నిబంధనల ప్రకారం.. మ్యాచ్ సమయంలో నలుగురు విదేశీ ఆటగాళ్లు ఒక జట్టులోని పదకొండు మందిలో ఆడవచ్చు. ఆ సమయంలో.. రాజస్థాన్ మ్యాచ్లో బర్గర్ను ఇంపాక్ట్ ప్లేయర్గా చేర్చుకుంది. కానీ ఫీల్డ్కి ఫీల్డ్కి రాలేదు. అటువంటి పరిస్థితిలో ఫీల్డింగ్ సమయంలో ముగ్గురు విదేశీ ఆటగాళ్లు మాత్రమే మైదానంలో ఉన్నారు. అటువంటి పరిస్థితిలో, ఢిల్లీ ఫీల్డింగ్ కోసం పావెల్ను మైదానంలోకి పిలిచింది. ఆ తర్వాత.. ఫోర్త్ అంపైర్ మదగోపాల్ కుప్పురాజ్ మళ్లీ పాంటింగ్కు టీమ్ షీట్ చూపించాడు. బర్గర్ ఒక ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చాడు.. పావెల్ కాదని చెప్పాడు. రాజస్థాన్ బర్గర్ను ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకున్నప్పటికీ అతను గ్రౌండ్ లోకి రాలేదు. అప్పుడు రాజస్థాన్ తరపున ముగ్గురు విదేశీ ఫీల్డర్లు మాత్రమే రంగంలో ఉన్నారు. ఈ విషయంలో ఢిల్లీ కోచ్ తొందరపడి అంఫైర్ తో వాగ్వాదానికి దిగాడు.
https://twitter.com/NihariVsKorma/status/1773519361552036193
తాజావార్తలు
-
NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
-
Off The Record: ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ వార్నింగ్..?
-
AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్పై ఈడీ కీలక ప్రకటన
-
Chairmans Desk : కాంగ్రెస్లో పాతకథ పునరావృతమౌతోందా.. రేవంత్ తక్షణ కర్తవ్యమేంటి..?
-
OTR: ప్రభాకర్ చౌదరి ఆరోపణలకు స్పందించని ఎమ్మెల్యే దగ్గుబాటి.. కారణం ఇదేనా..?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!