Ranjith Reddy: సీఎం రేవంత్ రెడ్డితో కలిసి రంజిత్ రెడ్డి రోడ్ షో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డిపై కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి ఫైరయ్యారు. చేవెళ్లలో కొండా విశ్వేశ్వర్ రెడ్డికి, తనకు చేవెళ్ళలో పోటీ ఉంటుందని.. తాను బాధ్యతాయుతమైన నేత అని ఎంపీ డాక్టర్ జి. రంజిత్ రెడ్డి పేర్కొన్నారు. బాలాపూర్, బడంగ్పేట్, సరూర్నగర్ సీఎం రేవంత్ రోడ్ షోలో రంజిత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఏనాడైనా కొండా చేవెళ్ళ ప్రజలతో కలిశారా? వారి కష్టసుఖాల్లో పాలు పంచుకున్నారా? అని ప్రశ్నించారు. యావత్ తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు కాంగ్రెస్ జై కొడుతోందని.. ఎందుకంటే, ఆరు గ్యారెంటీల్లో ఇప్పటికే నాలుగింటిని స్థానిక సర్కారు అమలు చేసిందన్నారు.
Actor Jai: అంజలితో ప్రేమాయణం.. మరో హీరోయిన్ ను పెళ్లాడిన హీరో?
Also Read
- Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
- Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
- Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
- First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
రూ.500 గ్యాస్ సిలిండర్, మహిళలకు ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల కరెంటు ఇస్తున్నామని రంజిత్ రెడ్డి వివరించారు. సీఎం రేవంత్ నాయకత్వంలో తమ ప్రభుత్వం పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామన్నారు. ఆరు గ్యారెంటీలే తమకు పంచ ప్రాణాలన్నారు. బీజేపీ మాత్రం సంక్షేమ పథకాలు మొత్తం తీసేస్తామని చెబుతోందని.. అందుకే, ఈ ఎన్నికలు పేదల సంక్షేమం వర్సెస్ నో సంక్షేమం అంటూ రంజిత్ రెడ్డి నొక్కి చెప్పారు. ఈ ఎన్నికలు రిజర్వేషన్లు వర్సెస్ నో రిజర్వేషన్లు అని స్పష్టం చేశారు. తన పోరు కొండా విశ్వేశ్వరరెడ్డితోనేనని.. ఆయన ఒక పొలిటికల్ టూరిస్టు అంటూ ఎద్దేవా చేశారు. ఈ పొలిటికల్ టూరిస్టు ఐదేండ్లు చేవెళ్ళలో కనబడలేదన్నారు. కరోనా సమయంలో ఆయన శానిటైజర్ పూసుకుని ఇంట్లో కూర్చుండని విమర్శించారు.
Sajjala Ramakrishna Reddy: కూటమి మేనిఫెస్టోపై మోడీ ఫోటో ఎందుకు పెట్టలేదు?
కొండా విశ్వేశ్వర్ రెడ్డి… ఇప్పుడు గ్రామాల్లో తిరుగుతున్నావు కదా…? ఏ గ్రామంలోనైనా తన గురించి అడగాలని, తాను చేసిన సేవల గురించి ప్రజలను అడగాలని హితవు పలికారు. వారే ఆయనకు సమాధానం చెబుతారన్నారు. తన మీద కొండా లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు. తాను ఎన్నోసార్లు సవాల్ విసిరానని, ఏ చౌరస్తాకొస్తావా? ఈ చౌరస్తాకొస్తావా? అని నిలదీశానన్నారు. కానీ ఇప్పటివరకూ సమాధానం లేదన్నారు. చెయ్యి గుర్తుకు ఓటేసి.. తనను ఎంపీగా గెలిపిస్తే, సీఎం రేవంత్కు అదనపు బలం వస్తుందన్నారు. దాంతో కేంద్రంతో కొట్లాడి నిధులు తెస్తారని, చేవెళ్లను, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారన్నారు.
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!