Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • Pahalgam Terror Attack
  • Story Board
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Question Hour With Sajjala Ramakrishna Reddy

Sajjala Ramakrishna Reddy: కూటమి మేనిఫెస్టోపై మోడీ ఫోటో ఎందుకు పెట్టలేదు?

NTV Telugu Twitter
Published Date :April 30, 2024 , 9:58 pm
By Mahesh Jakki
Sajjala Ramakrishna Reddy: కూటమి మేనిఫెస్టోపై మోడీ ఫోటో ఎందుకు పెట్టలేదు?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Sajjala Ramakrishna Reddy: కూటమి మేనిఫెస్టో మమ్మల్ని అనుకరించినట్లుందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి పేర్కొన్నారు. కూటమి మేనిఫెస్టోలో కొత్తదనం ఏమీ లేదన్నారు. వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నవరత్నాలకు మాత్రమే జనం ఆకర్షితులు కాలేదని.. జగన్ జర్నీని ప్రజలంతా గమనించారన్నారు. 2019లో జగన్ ఇచ్చిన హామీలపై ప్రజల్లో నమ్మకం కుదిరిందన్నారు. చెప్పింది చేస్తారన్న నమ్మకం ప్రజల్లో కుదరాలన్నారు. సీపీఎస్‌ను ఇప్పటికీ వదిలేయలేదన్నారు. ప్రత్యేక హోదా, మద్యపాన నిషేధం, సీపీఎస్‌ విషయంలో మేమే ఒప్పుకుంటున్నామన్నారు. అందుకే 99 శాతం హామీలను నెరవేర్చామని చెబుతున్నామన్నారు. జస్ట్‌ మాట చెప్పడమే అయితే ఇంకా లక్ష కోట్లు ప్రకటించుకోవచ్చన్నారు. కేంద్రంతో గొడవలు వద్దన్నదే మా ఆలోచన అని ఆయన తెలిపారు. 2014లో రుణమాఫీ చేస్తామని చెప్పుంటే ఆ రోజే అధికారంలోకి వచ్చేవాళ్లమన్నారు. ఏం చేయగలమో అదే చెప్పాం, చెబుతున్నామన్నారు. మాది రిస్క్ కాదు, ప్రజలపై నమ్మకమన్నారు. జగన్‌పై ప్రజలకు, ప్రజలపై జగన్‌కు ఉన్న నమ్మకం గెలిపిస్తుందన్నారు. పింఛన్ల విషయంలోనూ విడతల వారీగా పెంచుతున్నామని క్లియర్‌గా చెప్పామన్నారు. ఉన్నంతలో పర్‌ఫెక్ట్‌ టీమ్‌ను పెట్టామని.. ఎవరినో ఒకరిని నిలబెట్టి ఓటు వెయ్యమని అడగలేమని సజ్జల తెలిపారు.

Read Also: Perni Nani: కూటమి మేనిఫెస్టోపై పేర్ని నాని సెటైర్లు

రైతు భరోసా విషయంలో ఒక ప్రణాళిక పెట్టుకున్నాం.. రైతుభరోసా కేంద్రాలు కూడా అన్నదాతల కోసమే.. ఓట్ల కోసమే అనుకుంటే రైతు రుణమాఫీ కూడా చెప్పేవాళ్లం.. సొంతకాళ్లపై రైతులు నిలబడాలన్నదే మా తాపత్రయమని సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. విద్య, వైద్యంపై పూర్తిగా ఫోకస్‌ పెట్టామని ఆయన చెప్పారు. అప్పులు చేసి శ్రీలంకను చేశారన్న వ్యక్తి ఇప్పుడేం చెబుతారని ప్రశ్నించారు. చంద్రబాబు పాలనలో సంపద సృష్టి జరగలేదన్నారు. చంద్రబాబు అనుకున్న రాజధాని ఎందుకు కట్టలేదని అడిగారు. జగన్‌ అధికారంలోకి వచ్చాకే విజయవాడలో ఫ్లైఓవర్ పూర్తి చేయాల్సి వచ్చిందన్నారు. చంద్రబాబు వర్చువల్‌గా తప్ప రియల్‌గా ఏదైనా చేశారా అని ప్రశ్నించారు. ఆయన సంపద పెంచుకున్నారు తప్ప, సంపద సృష్టి జరగలేదన్నారు. కూటమి మేనిఫెస్టోపై మోడీ ఫోటో ఎందుకు పెట్టలేదని అడిగారు. బీజేపీ నేత కనీసం మేనిఫెస్టోను పట్టుకోవడానికి కూడా ఇష్టపడలేదన్నారు. 2014లో మోడీ ఫోటో పెట్టారు కదా.. ఇప్పుడేమైందన్నారు.

Read Also: Narendra Modi : కాంగ్రెస్‌ మళ్లీ పాతరోజులు తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది

ధాన్యం సేకరణలో గన్నీ బ్యాగ్స్, లేబర్స్‌ ఛార్జీలు ఇస్తున్నామని సజ్జల రామకృష్ణా రెడ్డి తెలిపారు. ఇవి చేయడం బాధ్యత అని జగన్ అనుకుంటారని ఆయన వెల్లడించారు. కానీ చంద్రబాబు దానికి అందమైన పేరు పెట్టి స్కీమ్ అని చెప్పుకుంటారని ఎద్దేవా చేశారు. కొవిడ్ సంక్షోభంలోనూ సంక్షేమాన్ని ఆపలేదన్నారు. 40 నుంచి 45 శాతం వైసీపీకి కోర్‌ ఓటు బ్యాంకు ఉందన్నారు. బస్సు ఛార్జీలు పెంచలేదని, కరెంట్‌ ఛార్జీలు తప్పనిసరిగా పెంచాల్సి వచ్చిందని చెప్పారు. ల్యాండ్‌ టైటిలింగ్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఏదైనా భూమిని ప్రభుత్వం కబ్జా చేయడానికి కుదురుతుందా అని ప్రశ్నించారు. ల్యాండ్‌ టైటిలింగ్ యాక్ట్ మేము తయారు చేసింది కాదన్నారు. కేంద్రం తయారు చేసి పంపించిందన్నారు. ఈ యాక్ట్‌పై అపోహలు సృష్టిస్తున్నారన్నారు. 30 వేల మంది మాయమయ్యారని అన్నారు, వివరాలు అడిగితే చెప్పలేదని సజ్జల తెలిపారు. చంద్రబాబు ఎప్పుడు ఒకటో తారీఖున జీతాలు ఇవ్వలేదన్నారు. రూ.14 లక్షల కోట్ల అప్పుందని చెబుతున్నారు.. మరి వారు అధికారంలోకి వస్తే హామీలను ఎలా నెరవేరుస్తారని ప్రశ్నించారు. సచివాలయం తాకట్టు అన్నది అబద్ధమన్నారు.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • AP Elections 2024
  • question hour
  • sajjala ramakrishna reddy
  • telugu news

తాజావార్తలు

  • Jogi Ramesh : వైసీపీ ఓటమికి అమరావతి ఒక కారణమే.. మాజీ మంత్రి జోగి రమేశ్ కామెంట్స్

  • Mohan Babu : బావ, దీనికి నువ్వు రావాలా? అని ప్రభాస్ అడిగాడు!

  • Mohan Babu: కన్నప్ప కోసం నా బిడ్డ ఎలా కష్టపడ్డాడు అనేది నేను చెప్పదలచుకోలేదు!

  • GHMC Mayor: మేయర్ గద్వాల విజయలక్ష్మీకి ఫోన్లో వేధింపులు..

  • Kakani Goverdhan Reddy : ముగిసిన కాకాణి గోవర్ధన్ రెడ్డి రెండో రోజు విచారణ..

ట్రెండింగ్‌

  • PhonePe: ఫీచర్‌ ఫోన్ల వినియోగదారుల కోసం యూపీఐ సేవలతో ఫోన్‌పే కొత్త అడుగు..!

  • SBI Alert: ఎస్‌బీఐ కస్టమర్స్‌కు అలర్ట్.. ఇకపై ఆ నంబర్ల నుంచే అధికారిక కాల్స్‌..!

  • 2025 Yezdi Adventure: ఫీచర్లు, డిజైన్‌లో భారీ మార్పులతో యెజ్డీ అడ్వెంచర్ లాంచ్..!

  • Motorola edge 60: 50MP ట్రిపుల్ కెమెరా, IP68 + IP69 రెసిస్టెంట్‌తో లాంచ్ కాబోతున్న మోటరోలా ఎడ్జ్ 60..!

  • REDMAGIC Tablet 3 Pro: 8200mAh బ్యాటరీ, గేమింగ్‌కి హై స్పీడ్ గ్యారంటీతో రాబోతున్న REDMAGIC టాబ్లెట్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions