MLC Jeevan Reddy: ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLC Jeevan Reddy: కాంగ్రెస్ ప్రభుత్వం తాగునీరు, సాగు నీరు, విద్యుత్పై ప్రత్యేక దృష్టి పెట్టిందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై, భద్రాద్రి, యాదాద్రి పవర్ ప్లాంట్ల అవినీతిపై విచారణ చేపడితే కేసీఆర్కు వణుకు పుడుతోందని ఆయన విమర్శించారు. కాళేశ్వరంపై టీవీ ముందుకు వస్తా అంటారని.. ఆ ప్రాజెక్టులో 20 కంపోనెంట్లు ఉన్నాయని, మేడిగడ్డలో ఒకటి రెండు పిల్లర్లు కుంగితే రాద్ధాంతం అంటున్నారని కేసీఆర్పై మండిపడ్డారు. టీవీ ముందుకు వస్తే మంచిదే.. వాస్తవాలు తెలుస్తాయన్నారు. బీజేపీ జాతీయ స్థాయిలో తుడిచిపెట్టుకొని పోతుందన్నారు.
బీజేపీ అధికారంలోకి వస్తే నల్లధనాన్ని వెలికితీసి పేద ప్రజలకు ఆర్థిక సహాయం చేస్తామని మోడీ అన్నారని.. వెలికి తీసిన నల్లధనం ఎక్కడ అంటూ ఆయన ప్రశ్నించారు. మోడీ హామీ ప్రకారం 10 ఏండ్లలో 20కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. కానీ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో బీజేపీ కిషన్ రెడ్డి చెప్పాలన్నారు. మోడీ కూడా మరో కేసీఆర్ అయ్యారంటూ విమర్శించారు. ఎలక్టోరల్ బాండ్స్ విషయంలో సుప్రీంకోర్టు మొట్టికాయ వేసిందన్నారు.
Also Read
- Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ 'బ్రెడ్ పకోడా'.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
- IND vs ENG: సిక్సర్ల వేటలో జోస్ బట్లర్కు సవాల్ విసురుతున్న అభిషేక్ శర్మ.. టాప్-5 బ్యాటర్ల లిస్ట్ ఇదే!
- Tamil Nadu: సీఎం విజయ్ కీలక నిర్ణయం.. ఇకపై ఏసీ ప్రభుత్వ బస్సులే ఉంటాయని ప్రకటన
- Mumbai: ముంబైలో ఘోరం.. స్కూల్ వ్యాన్పై కూలిన భారీ వృక్షం.. 11 ఏళ్ల విద్యార్థి మృతి
Read Also: Hyderabad: నాలుగు రాళ్లు వెనకేసుకోమంటే 418 రాళ్లు వేసుకున్నాడు.. షాకైన డాక్టర్లు!
ఆర్బీఐ అమిత్ షా అండర్లో పని చేస్తోందని ఆయన ఆరోపించారు. దేశంలో మతపరమైన రిజర్వేషన్లు కల్పించాలని అమిత్ షా అంటున్నారని.. మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లు తీసి వేస్తారని ఆరోపణలు చేశారు. ఓబీసీ పేరుతో మోడీ అధికారంలోకి వచ్చాడని, వాళ్ళను పట్టించుకోలేదన్నారు. రాహుల్ గాంధీ జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని కోరుకుంటున్నారన్నారు. ఇండియా కూటమి అధికారంలోకి రాగానే రాజ్యాంగ సవరణ చేసి జనాభా దామాషా ప్రకారం బలహీన వర్గాలకు రిజర్వేషన్లు కలిపిస్తామన్నారు. తెలంగాణలో మార్పు ఏవిధంగా వచ్చిందో, దేశంలో కూడా రాబోతుంది, ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.
తాజావార్తలు
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IND vs ENG: సిక్సర్ల వేటలో జోస్ బట్లర్కు సవాల్ విసురుతున్న అభిషేక్ శర్మ.. టాప్-5 బ్యాటర్ల లిస్ట్ ఇదే!
-
Tamil Nadu: సీఎం విజయ్ కీలక నిర్ణయం.. ఇకపై ఏసీ ప్రభుత్వ బస్సులే ఉంటాయని ప్రకటన
-
Alpha Movie Remunerations: హీరోల రేంజ్లో ఆలియా రెమ్యూనరేషన్.. అక్షరాల ఎన్ని కోట్లో తెలుసా?
-
TG Cabinet Meeting : జూలై 2న తెలంగాణ కేబినెట్ కీలక సమావేశం.!
ట్రెండింగ్
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!
-
Weight Loss Dosa : నూనె తక్కువ, ప్రోటీన్ ఎక్కువ..! ఆరోగ్యకరమైన మసూర్ బెలే దోస రెసిపీ
-
Black Jamun: నేరేడు పండు.. చిన్న పండులో బోలెడు ఆరోగ్య రహస్యాలు.. పోషకాలు మెండు కూడా.!