MLC Jeevan Reddy: ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLC Jeevan Reddy: కాంగ్రెస్ ప్రభుత్వం తాగునీరు, సాగు నీరు, విద్యుత్పై ప్రత్యేక దృష్టి పెట్టిందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై, భద్రాద్రి, యాదాద్రి పవర్ ప్లాంట్ల అవినీతిపై విచారణ చేపడితే కేసీఆర్కు వణుకు పుడుతోందని ఆయన విమర్శించారు. కాళేశ్వరంపై టీవీ ముందుకు వస్తా అంటారని.. ఆ ప్రాజెక్టులో 20 కంపోనెంట్లు ఉన్నాయని, మేడిగడ్డలో ఒకటి రెండు పిల్లర్లు కుంగితే రాద్ధాంతం అంటున్నారని కేసీఆర్పై మండిపడ్డారు. టీవీ ముందుకు వస్తే మంచిదే.. వాస్తవాలు తెలుస్తాయన్నారు. బీజేపీ జాతీయ స్థాయిలో తుడిచిపెట్టుకొని పోతుందన్నారు.
బీజేపీ అధికారంలోకి వస్తే నల్లధనాన్ని వెలికితీసి పేద ప్రజలకు ఆర్థిక సహాయం చేస్తామని మోడీ అన్నారని.. వెలికి తీసిన నల్లధనం ఎక్కడ అంటూ ఆయన ప్రశ్నించారు. మోడీ హామీ ప్రకారం 10 ఏండ్లలో 20కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. కానీ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో బీజేపీ కిషన్ రెడ్డి చెప్పాలన్నారు. మోడీ కూడా మరో కేసీఆర్ అయ్యారంటూ విమర్శించారు. ఎలక్టోరల్ బాండ్స్ విషయంలో సుప్రీంకోర్టు మొట్టికాయ వేసిందన్నారు.
Also Read
- Parvathipuram Manyam: పామాయిల్, జీడి తోటల్లో ఏనుగుల బీభత్సం.. భయంతో వణికిపోతున్న రైతులు.!
- AFG vs IND: మనవ్ సుతార్ అరంగేట్రం.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గిల్ సేన.!
- Vinukonda: అత్యాచారం చేశాడంటూ ఫిర్యాదు.. పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన మాజీ సీఐ చినమల్లయ్య.!
- Abhijeet Dipke: అమెరికా నుంచి ఢిల్లీ చేరుకున్న కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు.. నేటి నుంచి నిరసనలు
Read Also: Hyderabad: నాలుగు రాళ్లు వెనకేసుకోమంటే 418 రాళ్లు వేసుకున్నాడు.. షాకైన డాక్టర్లు!
ఆర్బీఐ అమిత్ షా అండర్లో పని చేస్తోందని ఆయన ఆరోపించారు. దేశంలో మతపరమైన రిజర్వేషన్లు కల్పించాలని అమిత్ షా అంటున్నారని.. మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లు తీసి వేస్తారని ఆరోపణలు చేశారు. ఓబీసీ పేరుతో మోడీ అధికారంలోకి వచ్చాడని, వాళ్ళను పట్టించుకోలేదన్నారు. రాహుల్ గాంధీ జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని కోరుకుంటున్నారన్నారు. ఇండియా కూటమి అధికారంలోకి రాగానే రాజ్యాంగ సవరణ చేసి జనాభా దామాషా ప్రకారం బలహీన వర్గాలకు రిజర్వేషన్లు కలిపిస్తామన్నారు. తెలంగాణలో మార్పు ఏవిధంగా వచ్చిందో, దేశంలో కూడా రాబోతుంది, ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.
తాజావార్తలు
-
Parvathipuram Manyam: పామాయిల్, జీడి తోటల్లో ఏనుగుల బీభత్సం.. భయంతో వణికిపోతున్న రైతులు.!
-
The Odyssey Ticket Price : రికార్డులు బద్దలు కొడుతున్న విజువల్ వండర్.. టికెట్ రేటు ఒక్కోటి ఒకటిన్నర లక్ష.!
-
Prakash Raj: నాగబాబుకు ప్రకాష్ రాజ్ స్ట్రాంగ్ కౌంటర్.. “మేము గొర్రెలం కాదు..!”
-
Devara 2 Update : ‘వర’కు ఏమైంది ?… జాన్వీ ప్రశ్నపై తారక్ సీరియస్
-
AFG vs IND: మనవ్ సుతార్ అరంగేట్రం.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గిల్ సేన.!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!