Hyderabad: నాలుగు రాళ్లు వెనకేసుకోమంటే 418 రాళ్లు వేసుకున్నాడు.. షాకైన డాక్టర్లు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జీవితంలో నాలుగు రాళ్లు వెనకేసుకోవాలంటారు పెద్దలు. ఒకరి మీద ఆధారపడకుండా ఉండాలంటే అవకాశం ఉన్నప్పుడే డబ్బు పొదుపు చేసుకోవాలని సూచిస్తుంటారు. భవిష్యత్లో జీవితంగా సాఫీగా ఉంటుందని పెద్దలు సలహాలు ఇస్తుంటారు. కానీ ఓ వ్యక్తికి ఏమర్థమైందో.. ఏంటో తెలియదు గానీ.. ఏకంగా కడుపులో 418 రాళ్లు వెనకేసుకున్నాడు. ఇదేదో వింతగా అనిపించడంలేదు. మీరు చదువుతున్నది నిజమే. షాకింగ్ న్యూస్గా అనిపిస్తుందా? మీరే కాదు.. పరీక్షించిన వైద్యులకే కళ్లు బైర్లు కమ్మాయి. అసలు ఈ రాళ్లేంటో.. ఆ పేషెంట్ కథేంటో తెలియాలంటే ఈ వార్త చదవండి.
హైదరాబాద్లో 60 ఏళ్ల వృద్ధుడు కిడ్నీ సమస్యతో ఆస్పత్రిలో చేరాడు. ఆయా పరీక్షలు నిర్వహించిన తర్వాత మూత్రపిండాల్లో భారీగా స్టోన్స్ ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆసియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (AINU)లో నిపుణులైన వైద్యుల బృందం రంగంలోకి దిగింది. అనంతరం శస్త్ర చికిత్స ద్వారా మొత్తం 418 రాళ్లను విజయవంతంగా తొలగించారు. ప్రస్తుతం రోగి కిడ్నీలు 27 శాతమే పని చేస్తున్నాయని డాక్టర్లు తెలిపారు.
Also Read
- BCCI: టీమ్ ఇండియా కోచింగ్ టీమ్లో మార్పులు..! గంభీర్ సహాయకుల్లో ఇద్దరిని తొలగిస్తారా..?
- Virat Kohli: లండన్లో ఆ ప్లేయర్తో విరాట్ సీక్రెట్ మీటింగ్.. రెండు గంటల్లోనే వైరల్ ఫొటోలు చూసి కోహ్లీ షాక్!
- Pawan Kalyan Health Update: పవన్ కల్యాణ్కు శస్త్రచికిత్స విజయవంతం.. ప్రస్తుతం ఆరోగ్యం ఎలా ఉందంటే..?
- New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!
ఇలా శస్త్ర చికిత్స ద్వారా ఇన్ని రాళ్లు తొలగించడం వైద్య విధానంలో ఇదొక గణనీయమైన పురోగతిగా వైద్యులు చెప్పుకొస్తున్నారు. ఒక సూక్ష్మ కెమెరా మరియు లేజర్ ప్రోబ్స్, ప్రత్యేక పరికరాలను ఉపయోగించారు.
ఇదిలా ఉంటే ఎలాంటి సర్జికల్ ఓపెనింగ్స్ లేకుండానే ఈ రాళ్లను తొలగించారు. దీంతో గాయం మానడానికి.. అలాగే రోగి కూడా త్వరగా కోలుకోవడానికి అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. దాదాపు రెండు గంటల పాటు శ్రమించి ఈ రాళ్లను తొలగించారు. అధునాతన మైన ఇమేజింగ్ టెక్నాలజీతో పాటు అత్యాధునికి పరికారాలు ఉపయోగించి ఈ శస్త్ర చికిత్సను నిర్వహించారు.
మూత్ర పిండాల్లో రాళ్ల సమస్యతో బాధపడుతున్న రోగులకు ఇదొక ఆశాజ్యోతిగా ఉంటుందని వైద్యులు చెప్పుకొస్తున్నారు. ఈ ఆపరేషన్లో డా. కె. పూర్ణ చంద్ర రెడ్డి, డాక్టర్. గోపాల్ ఆర్. డాక్టర్. దినేష్ నేతృత్వంలోని బృందం పాల్గొంది.
తాజావార్తలు
-
VIDA VX2 Plus: 187KM రేంజ్తో హీరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫాస్ట్ ఛార్జింగ్, రిమూవబుల్ బ్యాటరీ
-
Vinayakan: చిన్నారి ఫోటో పోస్ట్ వివాదం.. ‘జైలర్’ విలన్ వినాయకన్పై మరో కేసు
-
BCCI: టీమ్ ఇండియా కోచింగ్ టీమ్లో మార్పులు..! గంభీర్ సహాయకుల్లో ఇద్దరిని తొలగిస్తారా..?
-
Virat Kohli: లండన్లో ఆ ప్లేయర్తో విరాట్ సీక్రెట్ మీటింగ్.. రెండు గంటల్లోనే వైరల్ ఫొటోలు చూసి కోహ్లీ షాక్!
-
Wedding Fight: మటన్ పెడతామని ఒప్పుకొని.. చికెన్ పెడతారా?.. పెళ్లి విందులో పొట్టు పొట్టు తన్నుకున్న వైనం
ట్రెండింగ్
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!
-
మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, HD+ డిస్ప్లే, IR బ్లాస్టర్తో రాబోతున్న Itel Zeno 100 Pro.!
-
డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!
-
IND vs ENG: భారత్తో సిరీస్లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!