CM YS Jagan: పేదల తలరాత మారాలంటే ఒక్కసారి ఆలోచించండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM YS Jagan: మరో 3 రోజుల్లో కురుక్షేత్ర మహాసంగ్రామం జరగబోతోందని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. రాబోయే ఐదేళ్ల ఇంటింటి అభివృద్ధి, పథకాల కొనసాగింపును నిర్ణయించే ఎన్నికలు ఇవి అని సీఎం అన్నారు. జగన్కు ఓటేస్తే పథకాల కొనసాగింపు అని.. పొరపాటు చంద్రబాబుకు ఓటేస్తే పథకాలకు ముగింపేనని ఆయన పేర్కొన్నారు. సాధ్యం కాని హామీలతో చంద్రబాబు మేనిఫెస్టో ఇచ్చారని సీఎం జగన్ చెప్పారు. మేనిఫెస్టోలోని 99 శాతం హామీలను నెరవేర్చామన్నారు. రూ.2లక్షల 70 వేల కోట్లు డీబీటీ ద్వారా సంక్షేమ పథకాలు అందించామన్నారు. “ఈ 59 నెలల్లో గతంలో ఎన్నడూ జరగని విధంగా మార్పులు తీసుకొచ్చాం.. ఐదేళ్లు లంచాలు, వివక్ష లేకుండా సంక్షేమ పథకాలు అందించాం.. విద్యార్థులకు ట్యాబ్లు, వసతి దీవెన, విద్యా దీవెన, అమ్మ ఒడి అందించాం.. బైలింగ్వల్ పాఠ్యపుస్తకాలు ఇస్తున్నాం.. నాడు-నేడుతో ప్రభుత్వ పాఠశాలలను బాగు చేశాం.. పేదల తలరాత మారాలంటే ఈ పథకాలు ఎంత అవసరమో ఆలోచించండి.” అని సీఎం జగన్ పేర్కొన్నారు.
Read Also: Election Campaign: ప్రచారానికి ఇంకా 2 రోజులే.. దూకుడు పెంచిన పార్టీలు
Also Read
- IND Vs IRE: టీమిండియాకు షాక్.. కొంపముంచనున్న వర్షం.. ఐర్లాండ్దే సిరీస్..
- Womens T20 World Cup: ముగిసిన టీమిండియా బ్యాటింగ్.. ఆస్ట్రేలియా టార్గెట్ ఎంతంటే..
- Vaibhav Sooryavanshi: ‘వైభవ్ సూర్యవంశీకి అన్యాయం.. రెండో టీ20లో కూడా అదే తప్పు’..
- Ben Stokes: క్రికెట్ ప్రపంచాన్ని షాక్కు గురిచేసిన బెన్ స్టోక్స్.. రిటైర్మెంట్ ప్రకటన..
గతంలో ఎప్పుడైనా ఇంటికే రేషన్, పౌరసేవలు, పెన్షన్లు అందాయా అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. స్వయం ఉపాధి రంగాల్లో ఉన్నవారికి గతంలో పథకాలు ఉండేవా అని అడిగారు. లా నేస్తం, చేదోడు, వాహనమిత్ర అందించామని సీఎం తెలిపారు. ఆరోగ్యశ్రీ కింద రూ.25 లక్షల దాకా పేదవాడికి ఉచిత వైద్యం అందిస్తున్నామన్నారు. ఫ్యామిలీ డాక్టర్, విలేజ్ క్లినిక్, ఆరోగ్య సురక్ష అందిస్తూ ప్రజలకు అండగా ఉన్నామన్నారు. రైతన్నకు పెట్టుడి సాయం, పగటి పూటనే 9 గంటల పాటు ఉచిత విద్యుత్, ఆర్బీకే వ్యవస్థను తీసుకొచ్చామని సీఎం వెల్లడించారు. 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకమైనా గుర్తుకు వస్తుందా అని ప్రశ్నించారు. మతం వర్గం, రాజకీయ పార్టీ చూడకుండా సంక్షేమ పథకాలు అమలు చేశామన్నారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.
2014లో చంద్రబాబు ఇచ్చిన మేనిఫెస్టోలో ఎన్ని హామీలు నెరవేర్చారని సీఎం జగన్ ప్రశ్నించారు. రైతు రుణమాఫీ, పొదుపు సంఘాల రుణాలను చంద్రబాబు మాఫీ చేశారా అంటూ సీఎం అడిగారు. “ఆడబిడ్డ పుడితే రూ.25 వేలు అకౌంట్లో వేస్తామన్న చంద్రబాబు ఒక్క రూపాయి అయినా వేశారా.. నిరుద్యోగ భృతిని చంద్రబాబు ఎవరికైనా ఇచ్చారా?.. అర్హులందరికీ 3 సెంట్ల స్థలం ఇస్తామన్న చంద్రబాబు.. ఒక్క సెంట్ అయినా ఇచ్చారా?.. సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తామన్న చంద్రబాబు.. ఆ హామీని నెరవేర్చారా?” అని చంద్రబాబుపై సీఎం జగన్ ప్రశ్నల వర్షం కురిపించారు.
తాజావార్తలు
-
IND Vs IRE: టీమిండియాకు షాక్.. కొంపముంచనున్న వర్షం.. ఐర్లాండ్దే సిరీస్..
-
NTR – Trivikram Movie: రేపే ఎన్టీఆర్-త్రివిక్రమ్ ‘God Of War’ అనౌన్స్మెంట్!
-
Garuda Puran: చనిపోయిన వారి బట్టలు ఇంట్లో ఉంచుతున్నారా? గరుడ పురాణంలో చెప్పిన భయంకరమైన నిజాలు ఇవే!
-
Komatireddy Venkat Reddy : రేవంత్పై కోమటిరెడ్డి ప్రశంసలు.. నల్లగొండలో 12 సీట్లు మావే.!
-
Womens T20 World Cup: ముగిసిన టీమిండియా బ్యాటింగ్.. ఆస్ట్రేలియా టార్గెట్ ఎంతంటే..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!