Election Campaign: ప్రచారానికి ఇంకా 2 రోజులే.. దూకుడు పెంచిన పార్టీలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Election Campaign: తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారానికి ఇంకా 2 రోజులే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో అన్ని అస్త్రాలను ప్రయోగిస్తున్నాయి పార్టీలు. ప్రత్యర్థులపై పైచేయి సాధించడానికి విమర్శలతో అభ్యర్థులు విరుచుకుపడుతున్నారు. రేపు సాయంత్రం వరకు విమర్శలు, ప్రతివిమర్శలు, కౌంటర్లు, పంచ్లతో తెలుగు రాష్ట్రాలు మార్మోగే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల సమయం సమీపించడంతో అభ్యర్థులు వేగం పెంచారు. శనివారం సాయంత్రం 5 గంటలకు ప్రచారపర్వానికి తెరపడనుంది. దీంతో నువ్వా నేనా అన్నట్లుగా ప్రచారం నిర్వహిస్తున్నారు.
Read Also: KCR: నేటితో ముగియనున్న కేసీఆర్ బస్సు యాత్ర.. సిద్దిపేటలో బహిరంగ సభ
Also Read
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
- Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
- Veligonda Project: నేడే సీఎం చంద్రబాబు చేతులమీదుగా వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభం.!
- క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీతో పాటు లోక్సభకు ఎన్నికలు జరుగుతున్నాయి. అధికార వైసీపీ, విపక్ష ఎన్డీయే కూటమి మధ్య ప్రధాన పోటీ ఉంది. ఇరు పక్షాలు గెలుపే లక్ష్యంగా హోరాహోరీగా ప్రచారం చేస్తు్న్నాయి. విమర్శలు, ఆరోపణలతో ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నాయి. మరోవైపు ఎన్నికల మేనిఫెస్టోలో తాము పెట్టిన అంశాలను వివరిస్తున్నాయి. గతంలో ఇచ్చిన హామీలను ఎలా నెరవేర్చామో చెబుతున్నాయి. మరోవైపు ప్రత్యర్థుల లోపాలను ఎత్తిచూస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు.
తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో త్రిముఖ పోటీ నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన కాంగ్రెస్.. రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తోంది. లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలుస్తామని కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో డీలా పడిన బీఆర్ఎస్.. పార్లమెంట్ ఎన్నికల్లో పుంజుకునే ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు బీజేపీ కూడా తెలంగాణలో మరింత బలం పుంజుకోవాలని పట్టుదలగా ఉంది. డబుల్ డిజిట్ సీట్లు టార్గెట్గా పెట్టుకుంది కమలం పార్టీ. అగ్రనేతలంతా అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తున్నారు. మొత్తానికి ఇంకా రెండు రోజులే ప్రచారానికి గడువు ఉండడంతో జోరు పెంచారు నేతలు. రోడ్ షో, కార్నర్ మీటింగ్లతో పాటు ఇంటింటి ప్రచారాలు ఊపందుకున్నాయి.
తాజావార్తలు
-
Sai Abhyankkar : హీరో కావాలన్న కోరికను ఇండి ఆల్బమ్స్తో తీర్చుకుంటున్నాడా..?
-
Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
-
Toxic: నా కొడుకు ఉగ్రవాది కాదు.. ‘KGF’కు ముందే స్టార్.. ట్రోలర్స్ కు ఇచ్చిపడేసిన యష్ తల్లి
-
Deepti Sharma: దీప్తి శర్మ ప్రపంచ రికార్డు.. 7 బంతుల్లో 3 వికెట్లు, టీ20లో నంబర్-1 బౌలర్గా..
-
Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!