Election Campaign: ప్రచారానికి ఇంకా 2 రోజులే.. దూకుడు పెంచిన పార్టీలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Election Campaign: తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారానికి ఇంకా 2 రోజులే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో అన్ని అస్త్రాలను ప్రయోగిస్తున్నాయి పార్టీలు. ప్రత్యర్థులపై పైచేయి సాధించడానికి విమర్శలతో అభ్యర్థులు విరుచుకుపడుతున్నారు. రేపు సాయంత్రం వరకు విమర్శలు, ప్రతివిమర్శలు, కౌంటర్లు, పంచ్లతో తెలుగు రాష్ట్రాలు మార్మోగే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల సమయం సమీపించడంతో అభ్యర్థులు వేగం పెంచారు. శనివారం సాయంత్రం 5 గంటలకు ప్రచారపర్వానికి తెరపడనుంది. దీంతో నువ్వా నేనా అన్నట్లుగా ప్రచారం నిర్వహిస్తున్నారు.
Read Also: KCR: నేటితో ముగియనున్న కేసీఆర్ బస్సు యాత్ర.. సిద్దిపేటలో బహిరంగ సభ
Also Read
- YS Jagan: సాయికృష్ణ కేసులో కవర్అప్ జరిగిందా? జగన్ సంచలన ఆరోపణలు
- KTR-Prabhas: రచ్చ రచ్చే.. లైవ్లో రెబల్ స్టార్ ప్రభాస్కు ఫోన్ చేసిన కేటీఆర్ (వీడియో)
- YS Jagan: పీఎస్కు వెళ్లాలంటే భయపడే పరిస్థితి.. జగన్ సంచలన వ్యాఖ్యలు
- Ayodhya: "వాష్రూమ్లలో డబ్బు దాచాం".. అయోధ్య కేసులో నిందితుడు బయటపెట్టిన సంచలన నిజాలు
ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీతో పాటు లోక్సభకు ఎన్నికలు జరుగుతున్నాయి. అధికార వైసీపీ, విపక్ష ఎన్డీయే కూటమి మధ్య ప్రధాన పోటీ ఉంది. ఇరు పక్షాలు గెలుపే లక్ష్యంగా హోరాహోరీగా ప్రచారం చేస్తు్న్నాయి. విమర్శలు, ఆరోపణలతో ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నాయి. మరోవైపు ఎన్నికల మేనిఫెస్టోలో తాము పెట్టిన అంశాలను వివరిస్తున్నాయి. గతంలో ఇచ్చిన హామీలను ఎలా నెరవేర్చామో చెబుతున్నాయి. మరోవైపు ప్రత్యర్థుల లోపాలను ఎత్తిచూస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు.
తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో త్రిముఖ పోటీ నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన కాంగ్రెస్.. రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తోంది. లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలుస్తామని కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో డీలా పడిన బీఆర్ఎస్.. పార్లమెంట్ ఎన్నికల్లో పుంజుకునే ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు బీజేపీ కూడా తెలంగాణలో మరింత బలం పుంజుకోవాలని పట్టుదలగా ఉంది. డబుల్ డిజిట్ సీట్లు టార్గెట్గా పెట్టుకుంది కమలం పార్టీ. అగ్రనేతలంతా అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తున్నారు. మొత్తానికి ఇంకా రెండు రోజులే ప్రచారానికి గడువు ఉండడంతో జోరు పెంచారు నేతలు. రోడ్ షో, కార్నర్ మీటింగ్లతో పాటు ఇంటింటి ప్రచారాలు ఊపందుకున్నాయి.
తాజావార్తలు
-
Queen 2:13 ఏళ్ల తర్వాత కంగనా సెన్సేషన్.. షూటింగ్ పూర్తి, రిలీజ్పై ఆసక్తి
-
Toxic : ‘టాక్సిక్’ లేడీస్ & లేడీస్ గ్లిమ్స్ రిలీజ్.. ఈసారి మరింత వైల్డ్గా యశ్
-
YS Jagan: సాయికృష్ణ కేసులో కవర్అప్ జరిగిందా? జగన్ సంచలన ఆరోపణలు
-
KTR-Prabhas: రచ్చ రచ్చే.. లైవ్లో రెబల్ స్టార్ ప్రభాస్కు ఫోన్ చేసిన కేటీఆర్ (వీడియో)
-
YS Jagan: పీఎస్కు వెళ్లాలంటే భయపడే పరిస్థితి.. జగన్ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!