CM Revanth Reddy: హిందూ, ముస్లింలు తెలంగాణ ప్రభుత్వానికి రెండు కళ్లు
- కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకురావడంలో మైనారిటీలు పాత్ర కీలకం
- హిందూ.. ముస్లింలు తెలంగాణ ప్రభుత్వానికి రెండు కళ్లు
- దేశంలో ఉన్నవి రెండే పరివార్లు
- ఒకటి మోడీ పరివార్
- రెండోది గాంధీ పరివార్
- రవీంద్రభారతిలో కార్యక్రమంలో సీఎం రేవంత్ వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రంలో కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకురావడంలో మైనారిటీలు కీలక పాత్ర పోషించారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హిందూ, ముస్లింలు తెలంగాణ ప్రభుత్వానికి రెండు కళ్లలాంటి వారన్నారు. రవీంద్రభారతిలో జాతీయ విద్యా దినోత్సవ& మైనారిటీ సంక్షేమ దినోత్సవ వేడుకలకు హాజరైన సీఎం ప్రసంగించారు. “మీరంతా అండగా ఉంటే విద్య, వైద్యం, ఉపాధి విషయంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపించుకుందాం. దేశంలో ఉన్నవి రెండే పరివార్లు. ఒకటి మోడీ పరివార్.. రెండోది గాంధీ పరివార్.. ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టేందుకు మోడీ పరివార్ పనిచేస్తోంది. దేశ సమైక్యతకు గాంధీ పరివార్ కృషి చేస్తోంది. దేశ ప్రజలకు మెరుగైన విద్య అందించేందుకు ఆనాడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకొచ్చారు. ముస్లింలను మేం ఓటర్లుగా చూడటం లేదు.. సోదరులుగా, కుటుంబ సభ్యులుగా భావిస్తున్నాం. అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క మైనారిటీని కూడా ఎమ్మెల్యేగా గెలిపించుకోలేదు.. అందుకే మైనారిటీ మంత్రి ఇచ్చే అవకాశం లేకుండా పోయింది. కానీ షబ్బీర్ అలీని ప్రభుత్వ సలహాదారులుగా చేశాం. అమీర్ అలీ ఖాన్ కు ఎమ్మెల్సీ ఇచ్చాం.” అని సీఎం వ్యాఖ్యానించారు.
READ MORE: Cricketer Son: షాకింగ్.. అమ్మాయిగా మారిన టీమిండియా మాజీ క్రికెటర్ కొడుకు!
Also Read
- EPFO: పీఎఫ్ ఖాతాదారులకు పండగలాంటి న్యూస్.. ఇకపై నిమిషాల్లోనే జేబుల్లోకి క్యాష్!
- Bank Licence Cancelled: ఆ బ్యాంక్కు బిగ్ షాక్ ఇచ్చిన ఆర్బీఐ.. లైసెన్స్ రద్దు.. ఖాతాదారుల పరిస్థితి ఏంటి..?
- PM Modi: భారత్-నార్వే ప్రపంచ శాంతిని కోరుకుంటున్నాయి.. ఉగ్రవాదం విషయంలో రాజీపడబోమన్న మోడీ
- RR vs LSG: ప్లేఆఫ్ స్థానం కోసం రాజస్థాన్.. పరువు కోసం లఖ్నవూ సూపర్ జెయింట్స్.. గెలిచేదెవరో.?
కార్పొరేషన్లలో ముస్లింలకు అవకాశం ఇచ్చామని ముఖ్యమంత్రి తెలిపారు. వైఎస్ తరువాత ఇప్పటి వరకు సీఎంఓ లో మైనారిటీ అధికారిని నియమించలేదని మండిపడ్డారు. “మన ప్రభుత్వంలో సీఎంఓలో ఒక మైనారిటీ అధికారిని నియమించాం. దేశంలో మైనారిటీలకు ముఖ్యమంత్రులుగా, మంత్రులుగా కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది. మోడీ పరివార్ తో ఉండాలో గాంధీ పరివార్ తో ఉండాలో మీరే నిర్ణయించుకోండి. మహారాష్ట్రలో కాంగ్రెస్ అధికారంలోకి తీసుకొచ్చేందుకు మైనారిటీలు కృషి చేయాలి. దేశంలో కాంగ్రెస్ తోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుంది. మహారాష్ట్రలో మహావికాస్ అగాదీ కూటమిని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేయండి. దేశంలో మోడీని ఓడించి రాహుల్ గాంధీని ప్రధానిగా చూసే వరకు విశ్రమించొద్దు.” అని సీఎం పిలుపునిచ్చారు.
తాజావార్తలు
-
EPFO: పీఎఫ్ ఖాతాదారులకు పండగలాంటి న్యూస్.. ఇకపై నిమిషాల్లోనే జేబుల్లోకి క్యాష్!
-
Cheesy Chicken Sandwich Recipe: నోరూరించే చీజీ ‘చికెన్ శాండ్విచ్’.. బ్రేక్ఫాస్ట్, స్నాక్స్ కోసం ఐదు నిమిషాల్లో ఇలా చేసుకోండి!
-
Bank Licence Cancelled: ఆ బ్యాంక్కు బిగ్ షాక్ ఇచ్చిన ఆర్బీఐ.. లైసెన్స్ రద్దు.. ఖాతాదారుల పరిస్థితి ఏంటి..?
-
PM Modi: భారత్-నార్వే ప్రపంచ శాంతిని కోరుకుంటున్నాయి.. ఉగ్రవాదం విషయంలో రాజీపడబోమన్న మోడీ
-
RR vs LSG: ప్లేఆఫ్ స్థానం కోసం రాజస్థాన్.. పరువు కోసం లఖ్నవూ సూపర్ జెయింట్స్.. గెలిచేదెవరో.?
ట్రెండింగ్
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!