CM Revanth: మీరెప్పుడు రైతుబంధు ఇచ్చారు..? మేము వచ్చి 60 రోజులు కూడా కాలేదు
తమ ప్రభుత్వం వచ్చి రెండు నెలలు కాలేదు అప్పుడే తమపై శాపనార్థాలు పెడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచిందని.. రాష్ట్రాన్ని దివాలా తీయించిందని ఆరోపించారు. అయినప్పటికీ తాము ఉద్యోగులకు మొదటి తారీఖునే వేతనాలు ఇస్తున్నామన్నారు. మరోవైపు.. రైతుబంధుపై పదే పదే మాట్లాడుతున్నారని.. గతంలో వారు ఎలా వేసారో గుర్తు చేసుకోవాలన్నారు. 2018-19లో యాసంగి పంటకు రైతుబంధు ఐదు నెలలకు వేశారు.. 2019-20లో 9 నెలలు, 2021-22 నాలుగు నెలలు పట్టిందన్నారు.
CM Revanth: 80 వేల పుస్తకాలు చదివిండు కానీ.. కేసీఆర్ పై విమర్శలు
Also Read
- Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
- Jyoti Poorvaj : అందాలతో మంట రాజేస్తున్న జ్యోతి పూర్వాజ్
- Kidney Stones Rising in Summer: వేసవిలో కిడ్నీల్లో పెరిగిపోతున్న రాళ్లు.. ఇలా చెక్ పెట్టండి..!
- Ajit Doval: యూఏఈలో అజిత్ దోవల్ పర్యటన.. దౌత్య సంబంధాలపై చర్చ
ఇదిలా ఉంటే.. రెండు లక్షల ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారు అంటున్నారన్నారు. మీ ఉద్యోగం పోయింది అని మీరు దుఃఖంలో ఉన్నారు.. నిరుద్యోగ యువత అలాంటి దుఃఖంలో లేరని సీఎం రేవంత్ తెలిపారు. మీలాగా అంగట్లో ప్రశ్నాపత్రం అమ్మకానికి పెట్టం.. మీ పేషీల్లో లాగా మా పేషీల్లో పైరవీకారులు లేరని పేర్కొన్నారు. తాము 6700 స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు, సింగరేణిలో ఉద్యోగాలు ఇచ్చామని రేవంత్ రెడ్డి తెలిపారు. వాళ్ళ ఇంట్లో మాత్రం కారుణ్య నియామకాలు జరిగాయి.. కానీ సింగరేణిలో జరగలేదని మండిపడ్డారు. త్వరలోనే 15 వేల పోలీసు ఉద్యోగాలు నియామకం చేపడతామన్నారు. బీఆర్ఎస్ వాళ్ళు గోల పెట్టినా.. నియామకాలు చేసి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గవర్నర్ కోటాలో ఒక మైనార్టీకి ఎమ్మెల్సీ ఇచ్చామన్నారు. సలహాదారులో షబ్బీర్ ఆలీకి అవకాశం ఇచ్చామని చెప్పారు. మైనార్టీలకు అన్ని రకాల అవకాశం ఇచ్చామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
Election Commission: దేశంలో 97 కోట్ల మంది ఓటర్లు..
మరోవైపు.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆటో ఎక్కిన ఘటనపై రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఆటో రాముడు వచ్చాడు.. బీఆర్ఎస్లో ఓ జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నాడు.. కృష్ణానగర్ లో జూనియర్ ఆర్టిస్టు లెక్క.. ఆటో రాముడు కృష్ణానగర్ నుండి.. ఆఫీస్ కి ఆటోలో వెళ్లి డ్రామాలు చేశాడంటూ విమర్శించారు. ఇంకో నటుడు 100 పెట్టి పెట్రోల్ కొంటాడు.. పది పైసలు పెట్టి అగ్గిపెట్టే కొనలేదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆడ బిడ్డలకు ఉచిత ప్రయాణం ఇచ్చాం.. గత పాలనలో మొదటి టర్మ్ లో అసలు మహిళ మంత్రి పదవి ఇయ్యలేదని ఆరోపించారు. ఆడ బిడ్డల కోసం రెండు నెలలలో రూ.500 కోట్లు ఖర్చు పెట్టామని సీఎం రేవంత్ తెలిపారు.
తాజావార్తలు
-
Padma Awards 2027: దేశ అత్యున్నత పౌర పురస్కారాలు.. నేడే నామినేట్ చేసుకోండి.. పూర్తి వివరాలివే!
-
Ola Electric Share: ఒక్కప్పుడు రారాజు.. ఇప్పుడు బికారి! ఓలా ఎలక్ట్రిక్ రూ.157 నుంచి రూ.20 కి?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Tollywood Star Hero: ధురందర్ డైరెక్టర్ తో సినిమాకి తెలుగు స్టార్ హీరో యత్నాలు?
-
NTV ఎఫెక్ట్..! డ్యూటీ వదిలి చేపలు పట్టిన 60 మంది CRPF పోలీసుల బదిలీ
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!