Asha Workers Protest: ‘ఛలో విజయవాడ’.. ఆశా వర్కర్లను అరెస్ట్ చేస్తున్న పోలీసులు!
- నేడు 'ఛలో విజయవాడ'
- విజయవాడకుబయల్దేరిన ఆశా వర్కర్లు
- ఎక్కడిక్కడ అడ్డుకుంటున్న పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమ డిమాండ్ల సాధన కోసం ఆశా వర్కర్లు రాజమండ్రి నుండి ‘ఛలో విజయవాడ’కు బయలుదేరారు. ఛలో విజయవాడకు బయల్దేరిన పలువురు ఆశా వర్కర్లను రైల్వేస్టేషన్లో టూ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆశా వర్కర్లు చలో విజయవాడకు వెళ్లకుండా పోలీసులు ఎక్కడిక్కడ అడ్డుకుంటున్నారు. దాంతో నగరంలోని రైల్వే స్టేషన్, బస్టాండ్ల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులపై ఆశా వర్కర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ చలో విజయవాడకు ఆశా వర్కర్లు పిలుపునిచ్చారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఆశా వర్కర్ల వయోపరిమితిని రెండు సంవత్సరాలకు పెంపు, మెటర్నిటీ లీవులు మంజూరు చేసింది. అయినప్పటికీ ఇవేవీ మాకొద్దు.. జీతాలే పెంచండి అంటూ ఆశా వర్కర్లు ఆందోళన చేపట్టారు. రైళ్లు, బస్సుల్లోచలో విజయవాడకు బయలుదేరారు. చలో విజయవాడకు వెళ్లడానికి రైల్వే స్టేషన్, బస్టాండ్లకు వచ్చిన ఆశా వర్కర్ల పేర్లను పోలీసులు నమోదు చేసుకుని.. తిరిగి ఇంటికి పంపించి వేస్తున్నారు.
Also Read
- Virat Kohli: SRH మ్యాచ్కు ముందు కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఈ స్థితికి కారణం వారే అంటూ..
- EPFO: పీఎఫ్ ఖాతాదారులకు పండగలాంటి న్యూస్.. ఇకపై నిమిషాల్లోనే జేబుల్లోకి క్యాష్!
- Bank Licence Cancelled: ఆ బ్యాంక్కు బిగ్ షాక్ ఇచ్చిన ఆర్బీఐ.. లైసెన్స్ రద్దు.. ఖాతాదారుల పరిస్థితి ఏంటి..?
- PM Modi: భారత్-నార్వే ప్రపంచ శాంతిని కోరుకుంటున్నాయి.. ఉగ్రవాదం విషయంలో రాజీపడబోమన్న మోడీ
మరోవైపు విజయవాడ ధర్నాచౌక్లో ఆశా వర్కర్లు ఆందోళన చేపట్టారు. దాదాపుగా పదిహేను వందల మంది వరకూ ధర్నాచౌక్ చేరుకున్నారు. వేతనాలు పెంచాలని, రిటైర్మెంట్ వయసు సంబంధించిన జీఓలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆన్లైన్ పనులకు ఇచ్చిన ఫోన్లు ఇప్పుడు ఉన్న టెక్నాలజీ ప్రకారం మార్చాలని, రికార్డులు కొనుక్కునే పని లేకుండా ప్రభుత్వమే ఏర్పాటు చేయాలని, గత ప్రభుత్వంలో అధికారులు రాతపూర్వకంగా ఇచ్చిన నిర్ణయాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆశా వర్కర్లు రోడ్డు మీద సైతం కార్పెట్లు వేసుకుని ఎండలో ధర్నాకు దిగారు. ఆశా వర్కర్లు అన్ని జిల్లాల నుంచీ ధర్నాచౌక్కు చేరుకుంటున్నారు. ఆశా వర్కర్ల కదలికలను డ్రోన్లు, ఇంటిలిజెన్స్ టీంల ద్వారా పోలీసులు కనుగొంటున్నారు. ధర్నాచౌక్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు.
తాజావార్తలు
-
Virat Kohli: SRH మ్యాచ్కు ముందు కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఈ స్థితికి కారణం వారే అంటూ..
-
Peddi: ‘పెద్ది’కి లైన్ క్లియర్.. పర్సంటేజ్ విధానంపై గుడ్ న్యూస్
-
Hyderabad Water Board : ఏసీబీ దాడుల్లో షాక్.. బయటపడ్డ కోట్ల సామ్రాజ్యం.!
-
EPFO: పీఎఫ్ ఖాతాదారులకు పండగలాంటి న్యూస్.. ఇకపై నిమిషాల్లోనే జేబుల్లోకి క్యాష్!
-
Cheesy Chicken Sandwich Recipe: నోరూరించే చీజీ ‘చికెన్ శాండ్విచ్’.. బ్రేక్ఫాస్ట్, స్నాక్స్ కోసం ఐదు నిమిషాల్లో ఇలా చేసుకోండి!
ట్రెండింగ్
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!