KCR : కేసీఆర్ కీలక వ్యాఖ్యలు.. ఉప ఎన్నికలు ఖాయం
- ఎర్రవల్లి ఫాంహౌస్లో కేసీఆర్ని కలిసిన స్టేషన్ ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య
- పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం ఖాయం
- తెలంగాణ ప్రజలు పార్టీ మారిన ఎమ్మెల్యేలకు బుద్ధి చెబుతారు
- స్టేషన్ ఘన్పూర్లోనూ ఉప ఎన్నిక వస్తుంది
- కడియం శ్రీహరి ఓడిపోయి.. రాజయ్య ఎమ్మెల్యేగా గెలుస్తాడు :కేసీఆర్
KCR : తెలంగాణ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్)ను తెలంగాణ మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీ ఎర్రవెల్లిలోని కేసీఆర్కు చెందిన ఫామ్ హౌస్లో జరిగింది. ఈ సందర్భంగా జరిగిన చర్చల్లో రాజకీయ పరిణామాలు, రానున్న ఉప ఎన్నికలు, రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై గంభీరంగా చర్చ జరిగినట్లు సమాచారం.
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక రావడం ఖాయమని తెలిపారు. రాబోయే ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున తాటికొండ రాజయ్య పోటీ చేయడం అనివార్యమని, ఈ ఎన్నికల్లో రాజయ్య గెలుపును ఎవరూ ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు. అలాగే, ఇటీవల పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేల విషయంలో ప్రజలు తగిన బుద్ధి చెప్పడం ఖాయమని పేర్కొన్నారు.
Also Read
- DC Vs RCB: హమ్మయ్య.. ‘49’ తప్పించుకున్నాం.. ఢిల్లీ క్యాపిటల్స్ హ్యాపీ..
- Bordeaux : ఈ ఒక్క ప్రాంతం వైన్ ప్రపంచాన్ని ఎలా మార్చింది..??
- 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
- DC Vs RCB: రెండు చెత్త రికార్డులను మూట కట్టుకున్న ఢిల్లీ క్యాపిటల్స్.. ఆర్సీబీ సంచలనం..
ఇదిలా ఉండగా, బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ ఇప్పటికే స్పీకర్కు మూడు వేర్వేరు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై భారతదేశ అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీంకోర్టులో విచారణ కూడా ప్రారంభమైంది. పార్టీ మారిన ఈ ఎమ్మెల్యేల్లో పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎం.సంజయ్ కుమార్, కాలె యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాశ్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, అరెకపూడి గాంధీ, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావ్, కడియం శ్రీహరిలు ఉన్నారు.
ఈ పరిణామాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర రాజకీయ వాతావరణం మరింత రసవత్తరంగా మారింది. బీఆర్ఎస్ పార్టీ తన బలాన్ని తిరిగి పెంపొందించుకునే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఉప ఎన్నికల ముందు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై తగిన చర్యలు తీసుకోవాలనే అంశంపై కేసీఆర్ స్పష్టమైన అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
DC Vs RCB: హమ్మయ్య.. ‘49’ తప్పించుకున్నాం.. ఢిల్లీ క్యాపిటల్స్ హ్యాపీ..
-
Bordeaux : ఈ ఒక్క ప్రాంతం వైన్ ప్రపంచాన్ని ఎలా మార్చింది..??
-
Yatra: హీరోగా రజనీకాంత్ మనవడు.. కొడుకు సిల్వర్ స్క్రీన్ ఎంట్రీపై ధనుష్ క్లారిటీ ఇదే!
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
DC Vs RCB: రెండు చెత్త రికార్డులను మూట కట్టుకున్న ఢిల్లీ క్యాపిటల్స్.. ఆర్సీబీ సంచలనం..
ట్రెండింగ్
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!