PM Modi: భారత్లో అధికారంలోకి వచ్చేది బీజేపీ- ఎన్డీయే కూటమినే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP-NDA alliance: భారతదేశంలో మూడోసారి భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమినే అధికారంలోకి వస్తుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. దేశ ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారని అన్నారు. ఉత్తరప్రదేశ్లోని మిర్జాపూర్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మాట్లాడుతూ.. ఇప్పటి వరకు జరిగిన ఆరు దశల ఎన్నికల్లో ప్రజలు బీజేపీ వైపే మొగ్గు చూపారని చెప్పుకొచ్చారు. భారత్ లో బీజేపీ-ఎన్డీయే తుఫాన్ వీస్తోందన్నారు. ఇండియా కూటమి కులతత్వం, మతతత్వంతో కూరుకు పోయిందని విమర్శలు గుప్పించారు. భారత కూటమి అధికారంలోకి వస్తే ఐదేళ్లలో ఐదుగురు ప్రధాన మంత్రులు అవుతారని ఎద్దేవా చేశారు. అలాంటి వారు దేశాన్ని బలోపేతం చేయగలరా అంటూ నరేంద్ర మోడీ ప్రశ్నించారు.
Read Also: America : కూతురికి పాల సీసాలో కూల్ డ్రింక్ ఇచ్చి హత్య చేసిన తల్లి
Also Read
- Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
- US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
ఇక, సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ), కాంగ్రెస్లు ఓటు బ్యాంకుకే పరిమితం అయ్యారని ప్రధాని మోడీ ఆరోపించారు. కానీ, మోడీ మాత్రం దేశంలోని పేదలు, దళితులు, వెనుకబడిన వర్గాల ప్రజల అభివృద్ధి కోసం నిరంతరం కష్టపడుతున్నారని చెప్పారు. బీజేపీ అనుసరించిన విధానాల వల్లే దేశంలో మూడో సారి కూడా ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుందన్నారు. ఉత్తరప్రదేశ్ ప్రజలు రాజకీయాలకు అర్థం చేసుకున్నారు.. ఎవరి వైపు మొగ్గు చూపాలో వారికి తెలుసని ఆయన స్పష్టం చేశారు. రాజ్యాంగాన్ని మార్చబోతున్నామని సమాజ్ వాది పార్టీ చెబుతుంది.. దీని కన్నా దారుణమైన అబద్ధం మరకొటి లేదని విమర్శించారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెచ్చిన రిజర్వేషన్లను తొలగించేందుకు మేము సిద్ధంగా లేమని ప్రధాని మోడీ వెల్లడించారు.
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!