BJP Muralidhar Rao : రాహుల్ది జోడో యాత్ర కాదు తోడో యాత్ర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాహుల్ది జోడో యాత్ర కాదు తోడో యాత్ర అని విమర్శలు గుప్పించారు బీజేపీ నేత మురళీధర్ రావు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ ఫిల్మ్ థియేటర్ లలో రిలీజ్ కు రెడీ కాలేదని, హోటల్ లకు, వర్చువల్ మీటింగ్ లకే పరిమితం అయిందన్నారు. కూటమి ఇప్పటి వరకు ఒక్క బహిరంగ సభ పెట్టలేదన్నారు మురళీధర్ రావు. అంతేకాకుండా.. ఏ అంశం లోనూ వారు ఏకాభిప్రాయం కి రాలేదని, రాహుల్ పశ్చిమ బెంగాల్ లోకి ఎంటర్ అయ్యే నాటికి మమత బెనర్జీ పొత్తు లేదని స్పష్టం చేసిందన్నారు. ఆమె కాంగ్రెస్ నేతలకు రెస్పాన్స్ కూడా ఇవ్వడం లేదని ఆయన మండిపడ్డారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో కూటమి ఫెయిల్ అయింది… కూటమి లేదని, రాహుల్ గాంధీ నాయకత్వం లో కూటమి సాధ్యం కాదన్నారు మురళీధర్ రావు. జనవరి ఒకటి వరకు సీట్ల షేరింగ్ ప్రకటిస్తామని చెప్పారు .. ఇప్పటి వరకు తేల్చలేదన్నారు. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ను తిరస్కరించారని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read
- Hyderabad: గచ్చిబౌలి భవనం కూలిన ఘటన.. వెలుగులోకి బిల్డర్ సాజిద్ ఖాన్ అక్రమ సామ్రాజ్యం
- Hyderabad: గచ్చిబౌలి బిల్డింగ్ కూలిన ఘటనలో షాకింగ్ ట్విస్ట్.. టౌన్ ప్లానింగ్ అధికారిపై సస్పెన్షన్ వేటు
- Hero Impulse: రీ-ఎంట్రీకి సిద్ధమైన ఐకానిక్ బైక్.. ఎక్స్పల్స్ కంటే తక్కువ ధరలోనే కొత్త ఆఫ్-రోడర్!
- Suitcase Torso Case: సూట్కేసులో మొండెం కేసులో కొత్త ట్విస్ట్.. శరీర భాగాలతో బిర్యానీ వండి..!
తెలంగాణ ప్రజలు ఇచ్చిన తీర్పును బీజేపీ స్వీకరించిందని, అధికారం లోకి వచ్చిన కాంగ్రెస్, రేవంత్ రెడ్డి అవినీతి విచారణ లో ఒక్క అడుగు ముందుకు వేయలేదన్నారు. వంద మీటర్ లు పాతేస్త అనేది ఎవరు నమ్మరు… ఏమీ చేస్తున్నారో ప్రజలు చూస్తున్నారని, కాళేశ్వరం, ORR, ధరణి స్కాం ల విషయం లో ఈ ప్రభుత్వం ముందుకు పోవడం లేదు… ఏదో రహస్యం దీని వెనుక ఉందని ఆయన అన్నారు. బీఆర్ఎస్ అధినేత తో ఈ ప్రభుత్వం కుమ్మక్కు అయిందని ఆయన ఆరోపణలు గుప్పించారు. తిట్లు, విమర్శలు ఒక నాటకమని, సెటిల్మెంట్ లు చేసుకుంటున్నారన్నారు. బీఆర్ఎస్ను పావు గా కాంగ్రెస్ వాడుకుంటుందని, ఎల్లుండితో సర్పంచ్ ల కాల పరిమితి ముగుస్తుందని, ఈ ప్రభుత్వం ఎన్నికల నిర్వహణ కు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. సర్పంచ్ లకు బిల్లులు ఇంకా బకాయి లు ఉన్నాయన్నారు. స్పెషల్ ఆఫీసర్స్ తో గ్రామ పంచాయతీలు నడిపిస్తే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినట్టేనని ఆయన అభివర్ణించారు. ఎన్నికలు నిర్వహించే వరకు ప్రస్తుత సర్పంచ్ లను కొనసాగించండని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Hyderabad: గచ్చిబౌలి భవనం కూలిన ఘటన.. వెలుగులోకి బిల్డర్ సాజిద్ ఖాన్ అక్రమ సామ్రాజ్యం
-
Bigg Boss Telugu 10: బిగ్ బాస్ హౌస్లోకి టాలీవుడ్ విలన్.. ఎవరూ ఊహించని కంటెస్టెంట్ గా ఎంట్రీ?
-
Hyderabad: గచ్చిబౌలి బిల్డింగ్ కూలిన ఘటనలో షాకింగ్ ట్విస్ట్.. టౌన్ ప్లానింగ్ అధికారిపై సస్పెన్షన్ వేటు
-
IBPS Clerk Recruitment 2026: 11,403 పోస్టులకు దరఖాస్తు గడువు పొడిగింపు.. చివరి తేదీ ఎప్పుడు? అర్హత, ఫీజు వివరాలు ఇవే
-
Hero Impulse: రీ-ఎంట్రీకి సిద్ధమైన ఐకానిక్ బైక్.. ఎక్స్పల్స్ కంటే తక్కువ ధరలోనే కొత్త ఆఫ్-రోడర్!
ట్రెండింగ్
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!