Kishan Reddy : కేసీఆర్, రేవంత్కు ఏమాత్రం తేడా లేదు
- కేసీఆర్, రేవంత్కు ఏమాత్రం తేడా లేదు
- రేవంత్ ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నామని అనుకుంటున్నారు
- మేము ఎవరితో కుమ్మక్కయ్యామో సీఎం చెప్పాలి
- రేవంత్లో ఓటమి భయం కనిపిస్తోంది
- రేవంత్రెడ్డి బురద చల్లే ప్రయత్నాలు చేస్తున్నారు
- కేసీఆర్ అబద్ధాలను రేవంత్ పుణికిపుచ్చుకున్నారు : కిషన్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kishan Reddy : తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల సమరంలో బీజేపీ తన వ్యూహాన్ని స్పష్టంగా ప్రకటించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ మూడు స్థానాల్లో పోటీ చేస్తుందని తెలిపారు. కిషన్ రెడ్డి మాట్లాడుతూ, “1960 నుండి బీజేపీ పట్టభద్రుల, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తూ వస్తుంది” అని పేర్కొన్నారు. ఇది పార్టీకి కొత్త పోటీ కాదని, గత అనుభవంతో ఈ ఎన్నికల్లో విజయంపై పూర్తి విశ్వాసం ఉందని తెలిపారు. అలానే, ఈసారి “బీజేపీ మూడు స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది” అని విశ్వాసం వ్యక్తం చేశారు.
కిషన్ రెడ్డి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రచారాన్ని తప్పుబట్టారు. ఆయన అనుకోకుండా ప్రచారానికి వచ్చారని, “ఎవరి కోసం వచ్చారో, ఎవరి ఒత్తిడితో వచ్చారో తెలియదు” అంటూ వ్యంగ్యంగా ప్రశ్నించారు. అంతేగాక, “బహిరంగ సభలు పెట్టుకున్నారు, శాసనసభ ఎన్నికల్లో ఏ విధంగా బురద జల్లే ప్రయత్నం చేశారో, ఈ రోజు కూడా అదే చేశారు” అంటూ రేవంత్ రెడ్డి విధానాన్ని విమర్శించారు.
Also Read
- Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
- Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
- Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
- AP TET 2026: ఏపీ టెట్ షెడ్యూల్ వచ్చేసింది.. జూన్ 5న నోటిఫికేషన్.. పరీక్షలు ఎప్పుడంటే..
కిషన్ రెడ్డి మాటల్లో, కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర నిరాశ వ్యక్తమైంది. “ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నట్టు కాంగ్రెస్ నేతలు అనుకుంటున్నారు. వారి మాటల్లో నిరాశ, నిస్పృహ, ఓటమి భయం స్పష్టంగా కనిపిస్తోంది” అన్నారు. రేవంత్ రెడ్డి, బీజేపీపై బీఆర్ఎస్తో కుమ్మక్కైందని చేసిన ఆరోపణలను ఖండిస్తూ, కిషన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. “పోటీ చేస్తుంది ఒక చోట.. బీజేపీ బీఆర్ఎస్తో కుమ్మక్కైతే, మరి మిగతా రెండు చోట్ల ఎవరితో కుమ్మక్కు అయ్యాం?” అని తిరిగి ప్రశ్నించారు.
అలాగే, కాంగ్రెస్ ఇప్పటికే ఓటమిని అంగీకరించినట్టే ఉందని వ్యాఖ్యానించారు. “గెలిచినా, ఓడినా తన ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఏమీలేదని రేవంత్ అంటున్నారు. అంటే, కాంగ్రెస్ ఓటమిని అంగీకరించినట్టే కదా?” అని ఎద్దేవా చేశారు. కిషన్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. “ఈ 14 నెలల్లో తెలంగాణ ప్రజలకు ద్రోహం చేసింది కాంగ్రెస్ పార్టీ. యువతకు, పట్టభద్రులకు ద్రోహం చేసింది రేవంత్ రెడ్డి” అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. కిషన్ రెడ్డి చివరగా, “10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ప్రజలను పీడిస్తే, గత 14 నెలలుగా కాంగ్రెస్ అదే తీరును కొనసాగిస్తోంది” అని మండిపడ్డారు.
బీజేపీ ఎమ్మెల్సీ ఎన్నికల పోరుకు సిద్ధమవుతోంది. మూడు స్థానాల్లో గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. కాంగ్రెస్పై తీవ్ర విమర్శలు చేస్తూ, తమకు విజయం తప్పదని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. తెలంగాణలో రానున్న ఎమ్మెల్సీ ఎన్నికలు ఆసక్తికరంగా మారనున్నాయి.
Telangana: విద్యార్థులకు అలర్ట్.. లాసెట్, పీజీఎల్సెట్, ఈసెట్ పరీక్షలు షెడ్యూల్ విడుదల
తాజావార్తలు
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
-
AP TET 2026: ఏపీ టెట్ షెడ్యూల్ వచ్చేసింది.. జూన్ 5న నోటిఫికేషన్.. పరీక్షలు ఎప్పుడంటే..
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!