Kishan Reddy : కేసీఆర్, రేవంత్కు ఏమాత్రం తేడా లేదు
- కేసీఆర్, రేవంత్కు ఏమాత్రం తేడా లేదు
- రేవంత్ ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నామని అనుకుంటున్నారు
- మేము ఎవరితో కుమ్మక్కయ్యామో సీఎం చెప్పాలి
- రేవంత్లో ఓటమి భయం కనిపిస్తోంది
- రేవంత్రెడ్డి బురద చల్లే ప్రయత్నాలు చేస్తున్నారు
- కేసీఆర్ అబద్ధాలను రేవంత్ పుణికిపుచ్చుకున్నారు : కిషన్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kishan Reddy : తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల సమరంలో బీజేపీ తన వ్యూహాన్ని స్పష్టంగా ప్రకటించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ మూడు స్థానాల్లో పోటీ చేస్తుందని తెలిపారు. కిషన్ రెడ్డి మాట్లాడుతూ, “1960 నుండి బీజేపీ పట్టభద్రుల, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తూ వస్తుంది” అని పేర్కొన్నారు. ఇది పార్టీకి కొత్త పోటీ కాదని, గత అనుభవంతో ఈ ఎన్నికల్లో విజయంపై పూర్తి విశ్వాసం ఉందని తెలిపారు. అలానే, ఈసారి “బీజేపీ మూడు స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది” అని విశ్వాసం వ్యక్తం చేశారు.
కిషన్ రెడ్డి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రచారాన్ని తప్పుబట్టారు. ఆయన అనుకోకుండా ప్రచారానికి వచ్చారని, “ఎవరి కోసం వచ్చారో, ఎవరి ఒత్తిడితో వచ్చారో తెలియదు” అంటూ వ్యంగ్యంగా ప్రశ్నించారు. అంతేగాక, “బహిరంగ సభలు పెట్టుకున్నారు, శాసనసభ ఎన్నికల్లో ఏ విధంగా బురద జల్లే ప్రయత్నం చేశారో, ఈ రోజు కూడా అదే చేశారు” అంటూ రేవంత్ రెడ్డి విధానాన్ని విమర్శించారు.
Also Read
- రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
- Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’ అమరవీరుల పేర్లు ఇవే.. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆరుగురు వీరులు!
- Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ "పెసర గారెలు" చేసేయండి ఇలా.!
- Sitanshu Kotak: "వైభవ్ కోసం పాతోళ్లను తీసేయలేం".. బుడ్డోడి ప్లేయింగ్-11 ఛాన్స్పై కోచ్ సంచలన ప్రకటన..
కిషన్ రెడ్డి మాటల్లో, కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర నిరాశ వ్యక్తమైంది. “ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నట్టు కాంగ్రెస్ నేతలు అనుకుంటున్నారు. వారి మాటల్లో నిరాశ, నిస్పృహ, ఓటమి భయం స్పష్టంగా కనిపిస్తోంది” అన్నారు. రేవంత్ రెడ్డి, బీజేపీపై బీఆర్ఎస్తో కుమ్మక్కైందని చేసిన ఆరోపణలను ఖండిస్తూ, కిషన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. “పోటీ చేస్తుంది ఒక చోట.. బీజేపీ బీఆర్ఎస్తో కుమ్మక్కైతే, మరి మిగతా రెండు చోట్ల ఎవరితో కుమ్మక్కు అయ్యాం?” అని తిరిగి ప్రశ్నించారు.
అలాగే, కాంగ్రెస్ ఇప్పటికే ఓటమిని అంగీకరించినట్టే ఉందని వ్యాఖ్యానించారు. “గెలిచినా, ఓడినా తన ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఏమీలేదని రేవంత్ అంటున్నారు. అంటే, కాంగ్రెస్ ఓటమిని అంగీకరించినట్టే కదా?” అని ఎద్దేవా చేశారు. కిషన్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. “ఈ 14 నెలల్లో తెలంగాణ ప్రజలకు ద్రోహం చేసింది కాంగ్రెస్ పార్టీ. యువతకు, పట్టభద్రులకు ద్రోహం చేసింది రేవంత్ రెడ్డి” అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. కిషన్ రెడ్డి చివరగా, “10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ప్రజలను పీడిస్తే, గత 14 నెలలుగా కాంగ్రెస్ అదే తీరును కొనసాగిస్తోంది” అని మండిపడ్డారు.
బీజేపీ ఎమ్మెల్సీ ఎన్నికల పోరుకు సిద్ధమవుతోంది. మూడు స్థానాల్లో గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. కాంగ్రెస్పై తీవ్ర విమర్శలు చేస్తూ, తమకు విజయం తప్పదని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. తెలంగాణలో రానున్న ఎమ్మెల్సీ ఎన్నికలు ఆసక్తికరంగా మారనున్నాయి.
Telangana: విద్యార్థులకు అలర్ట్.. లాసెట్, పీజీఎల్సెట్, ఈసెట్ పరీక్షలు షెడ్యూల్ విడుదల
తాజావార్తలు
-
NRI: అంతిమ శ్వాస భారత్లోనే… అమెరికా పౌరసత్వం ఉన్న బాపట్ల వృద్ధురాలి కన్నీటి విజ్ఞప్తి!
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’ అమరవీరుల పేర్లు ఇవే.. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆరుగురు వీరులు!
-
Income Tax Notice: మీ బ్యాంకు ఖాతాలో ఇంత మొత్తం డబ్బు ఉందా? ఇన్ కమ్ ట్యాక్స్ నోటీస్ వచ్చే ఛాన్స్!
-
Vaibhav Sooryavanshi Debut: ఇతరులకు అన్యాయం చేయలేమంటున్న టీమిండియా.. వైభవ్ అరంగేట్రం కష్టమే!
ట్రెండింగ్
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!