Kishan Reddy : కేసీఆర్, రేవంత్కు ఏమాత్రం తేడా లేదు
- కేసీఆర్, రేవంత్కు ఏమాత్రం తేడా లేదు
- రేవంత్ ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నామని అనుకుంటున్నారు
- మేము ఎవరితో కుమ్మక్కయ్యామో సీఎం చెప్పాలి
- రేవంత్లో ఓటమి భయం కనిపిస్తోంది
- రేవంత్రెడ్డి బురద చల్లే ప్రయత్నాలు చేస్తున్నారు
- కేసీఆర్ అబద్ధాలను రేవంత్ పుణికిపుచ్చుకున్నారు : కిషన్ రెడ్డి
Kishan Reddy : తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల సమరంలో బీజేపీ తన వ్యూహాన్ని స్పష్టంగా ప్రకటించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ మూడు స్థానాల్లో పోటీ చేస్తుందని తెలిపారు. కిషన్ రెడ్డి మాట్లాడుతూ, “1960 నుండి బీజేపీ పట్టభద్రుల, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తూ వస్తుంది” అని పేర్కొన్నారు. ఇది పార్టీకి కొత్త పోటీ కాదని, గత అనుభవంతో ఈ ఎన్నికల్లో విజయంపై పూర్తి విశ్వాసం ఉందని తెలిపారు. అలానే, ఈసారి “బీజేపీ మూడు స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది” అని విశ్వాసం వ్యక్తం చేశారు.
కిషన్ రెడ్డి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రచారాన్ని తప్పుబట్టారు. ఆయన అనుకోకుండా ప్రచారానికి వచ్చారని, “ఎవరి కోసం వచ్చారో, ఎవరి ఒత్తిడితో వచ్చారో తెలియదు” అంటూ వ్యంగ్యంగా ప్రశ్నించారు. అంతేగాక, “బహిరంగ సభలు పెట్టుకున్నారు, శాసనసభ ఎన్నికల్లో ఏ విధంగా బురద జల్లే ప్రయత్నం చేశారో, ఈ రోజు కూడా అదే చేశారు” అంటూ రేవంత్ రెడ్డి విధానాన్ని విమర్శించారు.
Also Read
- Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
- Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
- RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
కిషన్ రెడ్డి మాటల్లో, కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర నిరాశ వ్యక్తమైంది. “ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నట్టు కాంగ్రెస్ నేతలు అనుకుంటున్నారు. వారి మాటల్లో నిరాశ, నిస్పృహ, ఓటమి భయం స్పష్టంగా కనిపిస్తోంది” అన్నారు. రేవంత్ రెడ్డి, బీజేపీపై బీఆర్ఎస్తో కుమ్మక్కైందని చేసిన ఆరోపణలను ఖండిస్తూ, కిషన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. “పోటీ చేస్తుంది ఒక చోట.. బీజేపీ బీఆర్ఎస్తో కుమ్మక్కైతే, మరి మిగతా రెండు చోట్ల ఎవరితో కుమ్మక్కు అయ్యాం?” అని తిరిగి ప్రశ్నించారు.
అలాగే, కాంగ్రెస్ ఇప్పటికే ఓటమిని అంగీకరించినట్టే ఉందని వ్యాఖ్యానించారు. “గెలిచినా, ఓడినా తన ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఏమీలేదని రేవంత్ అంటున్నారు. అంటే, కాంగ్రెస్ ఓటమిని అంగీకరించినట్టే కదా?” అని ఎద్దేవా చేశారు. కిషన్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. “ఈ 14 నెలల్లో తెలంగాణ ప్రజలకు ద్రోహం చేసింది కాంగ్రెస్ పార్టీ. యువతకు, పట్టభద్రులకు ద్రోహం చేసింది రేవంత్ రెడ్డి” అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. కిషన్ రెడ్డి చివరగా, “10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ప్రజలను పీడిస్తే, గత 14 నెలలుగా కాంగ్రెస్ అదే తీరును కొనసాగిస్తోంది” అని మండిపడ్డారు.
బీజేపీ ఎమ్మెల్సీ ఎన్నికల పోరుకు సిద్ధమవుతోంది. మూడు స్థానాల్లో గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. కాంగ్రెస్పై తీవ్ర విమర్శలు చేస్తూ, తమకు విజయం తప్పదని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. తెలంగాణలో రానున్న ఎమ్మెల్సీ ఎన్నికలు ఆసక్తికరంగా మారనున్నాయి.
Telangana: విద్యార్థులకు అలర్ట్.. లాసెట్, పీజీఎల్సెట్, ఈసెట్ పరీక్షలు షెడ్యూల్ విడుదల
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!